టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
కాపుగర్జన నిర్వహించాలని సూచన
మున్నూరు కాపు భవన నిర్మాణానికి భూమి పూజ
హాజరైన కొండా దంపతులు, ఎమ్మెల్సీ పూలరవీందర్
హన్మకొండ చౌరస్తా : ‘నా చిన్న తనంలో మానాన్న వ్యవసాయ జీతగాడిగా పనిచేసే వాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కుల చైతన్యమే’ అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీతో వివిధ ప్రాంతాల్లోని కులబాంధవులను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కాపు సోదరుడు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే కులబంధం గుర్తుకొచ్చిందన్నారు.
సంఘం భవన నిర్మాణానికి తన వంతు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. అందరిని ఒక్కతాటి పైకి తెచ్చేందుకు నేటి తరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. కాపు భవన్లో ప్రత్యేక లైబ్రరినీ ఏర్పాటు చేయాలన్నారు. ఐకమత్యంతో ముందుకు పోయి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన నాయకత్వం కులానికి అవసరమన్నారు. వ్యాపార, రాజకీయ, స్నేహబంధాలలో ఆలోచనలు, వైఖరి మారవచ్చు కానీ, కుల బంధంలో ఆలోచనలు మారవన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి కులం ఐక్యత కోసం పనిచేయాలని సూచించారు. కాపు భవనానికి సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయనకు కుల బంధువుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ తనకు రాజకీయంగా ఈ అవకాశం వచ్చిందంటే కాపు సోదరుల ప్రోత్సాహమేనని అన్నారు. అన్ని జిల్లాల్లోని కాపు వర్గాల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కాపు భవన నిర్మాణానికి తన వంతు సాయమందిస్తానని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మాట్లాడుతూ కుల అభ్యున్నతి కోసం ప్రతి పనిలో ముందుంటానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొండా సురేఖ విజయానికి కులబాంధవుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, తోట తిరుపతయ్య, డాక్టర్ కాళీప్రసాద్, ఈవీ శ్రీనివాసరావు, ఆశం కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర, గుజ్జుల నర్సయ్య, కనుకుంట్ల రవికుమార్, కోలా జనార్దన్, కేడల ప్రసాద్, తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కుల చైతన్యంతోనే ఈ స్థాయికి వచ్చా...
Published Sat, Jan 24 2015 1:51 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
What’s your opinion
Advertisement