యువతి అదృశ్యం | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Published Tue, Mar 8 2016 6:39 PM

Woman missing

చార్మినార్ (హైదరాబాద్) : కుటుంబసభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా నైస్ హోటల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ లతీఫ్ కూతురు ఫరీన్ ఫాతిమా (21) ఈ నెల 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిసినవారిని, చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించినా ఫలితం లేదు. దీనిపై అబ్దుల్ లతీఫ్ మంగళవారం ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement