* రెండో భార్య కుమార్తెను చితకబాదిన వైనం
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి
* పెంపుడు తండ్రి కర్కశత్వం
బెంగళూరు : కొబ్బరి నూనె మీద పడేసిందని పెంపుడు తండ్రి తన రెండో భార్య కుమార్తెను విచక్షణరహితంగా కొట్టడంతో సదరు బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇక్కడి హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నూరాయిన్ తాజ్ అలియాస్ తాజ్ (10) అనే బాలిక మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే బాలిక తల్లి ఉస్నా సుల్తానా కొన్నేళ్ల క్రితం మొదటి భర్తతో విడాకులు తీసుకుని అస్లాంను పెళ్లి చేసుకుంది. అంతకు ముందే సుల్తానాకు ముగ్గురు పిల్లలు ఉండగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అస్లాం కూడా నలుగురు సంతానం. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు ఏడుగురు పిల్లలతో ధణిసంద్రలోని నందగోకుల లేఅఔట్లో నివాసముంటున్నారు. సుల్తానా స్థానికంగా ఉంటున్న గార్మెంట్స్లో పనిచేస్తుండగా, అస్లాం ఆటోడ్రైవర్. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న నూరాయిన్ తాజ్ తలకు నూనె రాసుకుంటుండగా పొరబాటున అస్లాంపై పడింది.
దీంతో అస్లాం తీవ్ర ఆగ్రహంతో బాలికను విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీ, కడుపు భాగంలో తన్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి కడుపునొప్పి అని చెప్పడంతో ఆమె బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని పోలీసులు తెలిపారు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు నిన్న అస్లాంను అరెస్ట్ చేశారు. హెణ్ణూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నూనె మీద పోసిందని....
Published Fri, Jan 3 2014 12:40 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement