ప్రసాదం తిని 100 మందికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

ప్రసాదం తిని 100 మందికి అస్వస్థత

Published Mon, Jun 29 2015 7:46 PM

100 taken ill after taking 'prasad' at a place of worship

అసోంలోని రంగియా ప్రాంతంలో ఓ ప్రార్థనా స్థలం వద్ద ఇచ్చిన ప్రసాదం తిని సుమారు వంద మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం నాడు ప్రసాదం తిన్న వారందరికీ ఆదివారం ఉదయం నుంచి అస్వస్థత మొదలైనట్లు రంగియా సబ్ డివిజనల్ ఆఫీసర్ ముకుట్ ఫుకాన్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వాళ్లకు వాంతులయ్యాయి.

చాలామందికి రంగియాలోని స్థానిక ఆస్పత్రిలోనే చికిత్స చేయించగా, కొంతమందిని మెరుగైన చికిత్స కోసం గువాహటి వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మొత్తం వందమంది పరిస్థితి సాధారణంగానే ఉంది. గ్రామంలో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు ముకుట్ ఫుకాన్ చెప్పారు.

Advertisement
Advertisement