న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశం కావడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీకి తాజాగా ఓ కొత్త ట్విస్టు జోడించారు విదేశాంగ సుష్మాస్వరాజ్. ప్రధానమంత్రి నివాసంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మీడియాకు ఆ వివరాలు తెలిపేందుకు సుష్మా రావడంతో విలేకరులు సర్ప్రైజ్ అయ్యారు.
ట్విట్టర్లో క్రియాశీలంగా ఉంటూ ఇటు ప్రజల నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి విశేషామైన అభిమానాన్ని, ప్రశంసలను సుష్మా పొందారు. విదేశాంగ మంత్రిగా తన శాఖ వ్యవహారాలకు మాత్రమే పరిమితమవుతూ.. లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్న ఆమె.. ఇతర అంశాలపై పెద్దగా స్పందించింది లేదు. కేబినెట్ సమావేశం తర్వాత సంబంధిత ప్రెస్మీట్లో ఆమె ఎప్పుడూ పెద్దగా పాల్గొనలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక్కసారిగా విలేకరుల సమావేశంలో కనిపించడం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ఆమె ఇలా ప్రెస్మీట్లో కనిపించడం వెనుక రెండు కారణాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. సరోగేట్ తల్లులకు హక్కులు కల్పించే కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై ప్రజల్లోకి వెళ్లేందుకు సుష్మా ఛరిష్మాను వాడుకోవాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లును రూపొందించిన మంత్రుల బృందానికి సుష్మా అధిపతిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్పెషల్గా ఈ ప్రెస్మీట్లో కనిపించారు.
విలేకరుల ఆసక్తిని గమనించిన సుష్మా.. 'మీ ఆసక్తి నాకు అర్థమైంది. నేను విదేశాంగ వ్యవహారాలపై కాకుండా.. సరోగసీ బిల్లుపై మంత్రుల బృందానికి అధిపతిగా ఇక్కడికి వచ్చాను' అని పేర్కొన్నారు.
కేబినెట్ భేటీ తర్వాత సుష్మా ట్విస్టు!
Published Wed, Aug 24 2016 4:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement