కొచ్చి: సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేరళ డీజీపీ లోక్నాథ్ బెహెరా తెలిపారు. కేసుతో సంబంధముందన్న అనుమానంతో కొంతమందిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. భావన కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
కేసుకు సంబంధించి పల్సర్ సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనే కీలక నిందితుడిగా అనుమానిస్తున్నారు. కోయంబత్తూరుతో పాటు పలు ప్రాంతాలకు పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సినీ ప్రముఖులు మోహన్లాల్, సురేశ్గోపి, పృథ్వీరాజ్ సహా పలువురు భావన కిడ్నాప్ సంఘటనను ఖండించారు.