శవం చెప్పిన నిజం.. ముజఫర్నగర్లో అత్యాచార పర్వం | Sakshi
Sakshi News home page

శవం చెప్పిన నిజం.. ముజఫర్నగర్లో అత్యాచార పర్వం

Published Tue, Oct 15 2013 1:24 PM

Body of minor girl found in Muzaffarnagar

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో అల్లర్ల నేపథ్యంలో ఇంటి నుంచి సోమవారం సాయంత్రం అదృశ్యం అయిన 11 ఏళ్ల బాలిక మృతదేహం బయటపడింది. ఆమె రెండు చేతులు, రెండు కాళ్లు కట్టేసి ఉన్న స్థితిలో ఆమె మృతదేహం ఖరీ సరాయ్ గ్రామంలోని పొలాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

పొలంలో గడ్డి కోసుకోడానికి ఆ బాలిక వెళ్లినప్పుడు కొందరు దుండగులు ఆమెను అపహరించుకుపోయారు. ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత పీకపిసికి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో భద్రతను పెంచినట్లు తెలిపారు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిరసన ప్రదర్శన చేసి, దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు.

Advertisement
Advertisement