విజయవాడ: విజయవాడ మెట్రో రైల్వే లైన్కు 6769 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో 26.03 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అమరావతి, విశాఖపట్నం మెట్రో ప్లాన్లను మెట్రో చైర్మన్ శ్రీధరన్.. చంద్రబాబుకు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ నివేదికలను చంద్రబాబుకు సమర్పించారు. విజయవాడ బస్టాండ్ నుంచి పెనుమలూరు, నిడమానూరు వరకు రెండు కారిడార్లు నిర్మించనున్నారు. విశాఖ మెట్రో కారిడార్ను 45.5 కిలో మీటర్ల మేర చేపట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ, విజయవాడకు డీఎంఆర్సీ నివేదికపై చంద్రబాబుతో చర్చించినట్టు వెంకయ్య నాయుడు చెప్పారు.
విజయవాడ, విశాఖ మెట్రోలకు ప్లాన్ రెడీ
Published Sat, Sep 12 2015 5:40 PM
Related news
-
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
చిన్నమ్మ.. వెన్నుపోటులో పెద్దమ్మ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చిన్నమ్మ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు పురందేశ్వరి. మెట్టినిల్లు దగ్గుబాటి ఇంట అడుగిడి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. వీటితోపాటు తాజాగా ఆమె ఘనతలో మరోసారి ‘వెన్నుపోటుదారు’అనే అలంకారం చేరింది. అదికూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీజేపీ నుంచే కావడంతో చిన్నమ్మ మరింత చిన్నబోయారు. నాడు–నేడు బాబుకే చేదోడు సీఎం పీఠం కోసం అవమానకరంగా ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ని చేసిన నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారునిగా అందరి నోళ్లలో నిత్యం నానుతూనే ఉన్నారు. ఈ వెన్నుపోటు వ్యవహారంలో పురందేశ్వరి భర్త, బాబుకు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనవంతు పాత్ర పోషించినట్లు పలు సందర్భాలలో బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన అంకంలో భర్తను గట్టిగా ప్రోత్సహించి, మరిది బాబుకు చేదోడువాదోడుగా నిలిచారని పురందేశ్వరి గురించి అయినవారంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పొత్తుల ముసుగులో తన పార్టీకన్నా టీడీపీకే మద్దతిస్తున్నారని కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షురాలిగా ఈ స్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడవటాన్ని అంతర్గత సమావేశాల్లో నాయకులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. 5 ఎన్నికలు... 4 స్థానాలు పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా తన తండ్రి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే.. ఈమె హస్తం పంచన చేరి, 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. బాబు తమ కుటుంబానికి చేసిన మోసం వల్లే కాంగ్రెస్లో చేరినట్లు సమరి్ధంచుకున్నారు. అదే వాస్తవమైతే ఇప్పుడు చంద్రబాబుకు అంతలా వత్తాసు ఎలా పలుకుతున్నారన్నది విశ్లేషకుల ప్రశ్న. బాపట్ల రిజర్వుడు స్థానం కావడంతో 2009లో విశాఖ నుంచి పోటీచేశారు. రెండుసార్లూ దివంగత మహానేత వైఎస్సార్ హవా తన విజయానికి బాటలు వేసింది.కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర విభజన సాకుతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్కు బద్ధశత్రువైన బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి ఎన్డీయే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా 33,892 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. స్వార్థమే పరమావధిగా... 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయగా పురందేశ్వరి విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ దగ్గుబాటికి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు లేకపోలేదు. గత ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. చిన్నమ్మ కోసం పరోక్ష రాజకీయాలు చేస్తూ తెరమరుగవ్వాల్సి వచ్చిందని ఆయన వీరాభిమానులు వాపోతున్నారు. ఆయన మాత్రం తనకు రాజకీయాలంటే విముఖతని చెప్తూనే.. పురందేశ్వరి కోసం తాజాగా రాజమండ్రిలో తిష్ట వేయడం గమనార్హం. ఎన్టీఆర్ను మించిన నటి చిన్నమ్మ: నందమూరి లక్ష్మీపార్వతి ‘అవును, నేను చెబుతున్నది యదార్థం. ఎన్టీఆర్ స్క్రీన్పై కనిపించి మహానటుడిగా వినుతికెక్కారు. చిన్నమ్మ తెరవెనుక నటనలో మహానటిని మించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు వ్యవహారంలో కుటుంబపరంగా పురందేశ్వరి పాత్రను తెలుసుకున్న ఎన్టీఆర్ అభిప్రాయమిది. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందునే ఈ మాటలు చెప్పగలుగుతున్నానని’ నందమూరి లక్ష్మీపార్వతి ’సాక్షి’కి తెలిపారు. ‘చంద్రబాబు, రామోజీల వెన్నుపోటు కుట్ర గురించి దగ్గుబాటికి తొలుత తెలియదు.బాబుకు సహకరించే క్రమంలో పురందేశ్వరే కుటుంబ సభ్యులను కూటమి కట్టేలా చేసింది. భర్తను దగ్గరుండి వైశ్రాయ్ హోటల్కు పంపింది. ఆ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వచ్చి పక్కన కూర్చుంద’న్నారు. చిన్నమ్మ నాటకాలు ఆ సమయంలో గుర్తించలేకపోయినా ఆ తరువాత వెన్నుపోటుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిశాయని, నటనలో తనను కూతురు మించిపోయిందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారని లక్ష్మీపార్వతి వివరించారు. బీజేపీకి భారీ వెన్నుపోటుటీడీపీ, జనసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆరు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుండగా, ఆయా స్థానాల ఎంపిక, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో మరిది బాబుతో కలిసి చిన్నమ్మ ఆడిన డ్రామాలను ప్రజలు గమనించకపోలేదు. అనపర్తిలో మాజీ సైనికుడు శివకృష్ణరాజును కాదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. కడప జిల్లా బద్వేలు అభ్యర్థి రోశన్న టీడీపీ కండువా తీసేసిన మరునాడే బీజేపీ టికెట్ దక్కింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎన్.ఈశ్వరరావులు ఏ పార్టీ వారో అందరికీ తెలుసు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీచేస్తున్న సీఎం రమేశ్ చంద్రబాబు జేబులో మనిషి. కాపులకు బీజేపీ నుంచి ఒక్క టిక్కెట్ కూడా దక్కకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. తన కళ్ల ముందు ప్రధాని మోదీ ఫ్లెక్సీలను కొందరు టీడీపీ కార్యకర్తలు చింపుతున్నా, కనీసం వారించకుండా మౌనం వహించిన చిన్నమ్మ వైఖరి బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. -
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈసారి మరిన్ని మోసపూరిత హామీలతో ముందుకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఇచ్చిన హామీలకే తాము వెచ్చిస్తున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు అవుతోందని, ఇది నెరవేర్చే అవకాశం లేకపోయినా.. తాను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తానని బాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రతి సందర్భంలోనూ ‘నేను సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తా’ అని చంద్రబాబు అరిచే అరుపుల వెనక మర్మాన్ని ముఖ్యమంత్రి శనివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... జగన్ అబద్ధాలు చెప్పడు... వీళ్లంతా కూడా అబద్ధానికి రెక్కలు కట్టి ఎలా మోసం చేస్తారో తెలియజేయడానికే ఇదంతా చెబుతున్నా. ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలచుకున్నా. నేను చేయలేకపోతే చేయలేనని చెబుతా. అంతే తప్ప అబద్ధాలు ఆడను. మోసం చెయ్యను. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. వేయలేరు కూడా. మేనిఫెస్టోలో లేనివి కూడా... ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో లేని అంశాలెన్నిటినో అమల్లోకి తెచ్చాం. కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద ఇవేవీ 2019 మేనిఫెస్టోలో లేవు. కానీ ఇప్పుడు అమలవుతున్నాయి. అలాగే పిల్లలకు ట్యాబ్లు, ఆరోగ్య శ్రీని రూ.25లక్షలకు పెంచటం, 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటం... ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పకుండానే చేసి చూపించాం. అందుకే చెబుతున్నా. అబద్ధాలు చెప్పి నేను చంద్రబాబుతో పోటీ పడదల్చుకోలేదు. కారణం... అది అబద్ధమని తెలిసి కూడా చెప్పటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగిందే చెబుతా. అవకాశం ఉంటే పేదల కోసం పది అడుగులు ముందుకే వేస్తా. 14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే... జగన్ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను కనుక చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ అంటుంటాడు. అలా తాను చెప్పే అబద్ధాలి్న, చేసే మోసాల్ని నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటాడు. మరి తన 14 ఏళ్ల పాలనలో ఏ సంపద సృష్టించాడు? అసలు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ప్రతి ఏటా లోటే కదా? మరి రెవెన్యూ వ్యయానికే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు? మరి చంద్రబాబు అధికారంలో లేక ముందు గానీ... తర్వాత గానీ ఎప్పుడు చూసినా రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఇదీ వాస్తవం.అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుంది. అంటే లెక్కలన్నీ చంద్రబాబు సంపద సృష్టించలేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలనంతా దోచుకోవడం, దాన్ని పంచుకోవటమే జరిగింది కాబట్టే ఇదంతా. బాబు చేయలేనిది నేను ఎందుకు చేయగలిగానంటే ఇక్కడ కరప్షన్ లేదు. వివక్ష లేదు. అందుకే!. అడ్డగోలు అప్పులు తెచ్చింది బాబేగా? అప్పులపై నోటికొచ్చింది చెబుతున్నారు. కానీ లెక్కలు మారవు కదా? ఎవరెంత అప్పులు చేశారో ఒకసారి గమనిస్తే... 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. మరి ఎక్కువ అప్పులు తెచ్చిందెవరో తెలియటం లేదా? అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గవర్నమెంట్ గ్యారంటీడ్ రుణం... బాబు రాకముందు రూ.14వేల కోట్లు. బాబు దిగిపోయే నాటికి రూ.59వేల కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల రుణాలు రూ.21,367 కోట్ల నుంచి రూ.81,337 కోట్లకు పెరిగాయి. మొత్తంగా అప్పులు బాబు హయాంలో రూ.1,53,346 కోట్ల నుంచి 4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ ప్రభుత్వ హయాలలో చూస్తే ప్రభుత్వ రుణాలు రూ.4.90 లక్షల కోట్లకు, గ్యారంటీడ్ రుణాలు 1.43 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల అప్పులు రూ.69,372 కోట్లకు తగ్గాయి. మొత్తమ్మీద రుణాలు రూ.7,03,471 కోట్లకు చేరాయి. బాబు హయాంలో పెరుగుదల రేటు 21.87 శాతం ఉంటే... ఇప్పుడది 12.13 శాతం. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికుంది? జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందెప్పుడు? పురోగతి అంటే ఏంటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? జీడీపీలో మన రాష్ట్ర వాటా ఎంత? ఇవన్నీ చూడాలి కదా!! వాస్తవానికి చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం ఉంటే.. అది ఇప్పుడు సగటున 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియటం లేదా? ఆస్తుల కల్పన ఎవరి హయాంలో జరిగిందో తెలియటం లేదా? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్రహ్మాండంగా పరుగెత్తుతున్నాయో తెలియటం లేదా? మూలధన వ్యయం... మాటల్లోనేనా? డబ్బులన్నీ పంచేస్తున్నారంటూ చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నాడు. ఎప్పుడైనా తను చెప్పేదొక్కటే. తాను స్కీములకు కాదని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం) రూపంలో ఖర్చు చేశానని. అందుకనే ఇన్ని స్కీములు ఇవ్వలేకపోయానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే... అసలు నాడు–నేడు ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఆసుపత్రులు, స్కూళ్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది? ఆయన హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... మన ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు చేస్తున్నాం. కొత్తగా 4 సీపోర్టులు కడుతున్నాం. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతున్నాం. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుటే జరుగుతున్నాయి. నిజానికి మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ నీడన గడిచిపోయాయి. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద ఇంత భారీగా ఖర్చు చేయగలిగాం. పైపెచ్చు ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ఇదీ జగన్ పనితీరుకు, చంద్రబాబు పనితీరుకు తేడా!. పన్నుల బాదుడులోనూ చంద్రబాబే టాప్... చంద్రబాబు ప్రతిసారీ జగన్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడని. పన్నులతో బాదేస్తున్నాడని అంటున్నారు. కానీ నిజానికి జీఎస్డీపీలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఎవరి హయాంలో ఎక్కువో తెలుసా? చంద్రబాబు నాయుడి హయాంలో జీఎస్డీపీలో ట్యాక్స్ బర్డెన్ 6.57 శాతం. జగన్ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లలో చెప్పినవే కదా? -
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్
విశాఖ సిటీ: ‘మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వం. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా నెరవేర్చాం. తాజాగా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని, మరింతగా ప్రజోపయోగమైన అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ 2024 మేనిఫెస్టో రూపొందించారు.రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఆమోదించి, మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు నిక్కచ్చిగా, కచ్ఛితంగా ఏదైతే చేస్తామని చెప్పారో, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళారులు, మధ్యవర్తులు లేకుండా రూ.2.7 లక్షల కోట్లు నేరుగా పేద ప్రజలకు అందించారని తెలిపారు. దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 99 శాతం అమలు చేయలేదని, ఒక్క సీఎం వైఎస్ జగన్కి మాత్రమే అది సాధ్యమైందని, దేశ రాజకీయాల్లో కొత్త రికార్డులు నెలకొల్పి ఈ రోజు మీ ముందుకు వచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని చెప్పారు. విద్య, వైద్యాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.మూడు రాజధానులు మా అజెండారాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. ఇదే తమ అజెండా అని చెప్పారు. దీనిని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లగలరా అని కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు అదే రెఫరెండంగా మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళుతున్నామని చెప్పారు. విశాఖను ప్రపంచంలో మేటి నగరంగా తయారు చేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇక్కడ ఐటీ హబ్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రజల కోసం అర్బన్ లేఅవుట్లు డెవలప్ చేసి గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు కాస్ట్ టు కాస్ట్కు ఇళ్లు ఇవ్వడంపై దృష్టి పెడతామన్నారు.అవుట్ సోర్సింగ్లకు తీపి కబురుఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదాయ పరిమితి పెట్టడంతో నవరత్నాలు అందడంలేదన్న ఉద్యోగ సంఘాల వినతిని తాము సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని రూ.25 వేలు వరకు జీతాలున్న వారందరూ అర్హులని మేనిఫెస్టోలో చేర్చడం చాలా పెద్ద విషయమన్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్యా శాఖలో ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నో వెకెన్సీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏ ఏడాది ఖాళీ ఏర్పడితే అదే ఏడాది భర్తీ చేసే విధానాన్ని తేవాలని చూస్తున్నామన్నారు.బాబు మోసకారి.. టీడీపీ నక్కల పార్టీచంద్రబాబు మోసకారి అని, టీడీపీ నక్కల పార్టీ అని బొత్స వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశాడన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనీ అమలు చేయలేదని, మేనిఫెస్టోనే మాయం చేశారని చెప్పారు. బాబు రూ.4 వేలు పెన్షన్ ఇస్తానన్నా ఎవరు నమ్మరని అన్నారు. 2019లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన నాటికి మహిళలకు ఎంత రుణం ఉందో అంతటినీ ముఖ్యమంత్రి జగన్ మాఫీ చేశారని గర్వంగా చెబుతున్నామని అన్నారు.నాడు స్నోలు, పౌడర్లకు మూల ధన వ్యయంటీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఏడాదిలో రూ.15,227 కోట్లు మాత్రమే కేటాయించి, దానిని కూడా స్నోలు, పౌడర్లకు దుబారా ఖర్చు చేశారన్నారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆస్పత్రులు, నాడు–నేడు, వెల్నెస్ సెంటర్ల కోసం ఏటా రూ.17,757 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇది మైనస్ రూ.366 కోట్లుగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే అప్పులు తెచ్చామని, ఇదీ జగన్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు.
Related News by category
-
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
ఎన్నికల నియమావళికి గంటా తూట్లు
మధురవాడ: భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల నియమావళికి తూ ట్లు పొడిచారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్ కాలనీ, గాయత్రీ మెడికల్ కళాశాల సమీపంలోని పవన్ మిత్ర అపార్ట్మెంట్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాలనీలో టీడీపీ నాయకులు రాత్రి 10 గంటలకు బాణసంచా కాల్చారు. తర్వాత రోడ్డు మధ్యలోనే ఫొటోలు దిగుతూ గంటా అభివాదం చేశారు. రాత్రి 10.15 గంటలకు పక్కనే ఉన్న పవన్ మిత్ర అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రచారం చేశారు. 10.25 గంటలకు వైఎస్సార్ కాలనీలో మహిళలతో ముచ్చటించి గ్రూప్ ఫొటో దిగారు. అర గంట పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గంటా ప్రచారం నిర్వహించినా అధికారులు, పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. -
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు
విశాఖ లీగల్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నగరంలోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు డోలా సాయి (23) నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట నివాసి. రౌడీ షీటర్గా స్థానికంగా పెత్తనం చెలాయించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి... ఆ బంధానికి సదరు మహిళ భర్త అడ్డం వస్తున్నాడని పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో 2018 అక్టోబర్ 20న అతని మెడపై కత్తితో సాయి బలంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు డోలా సాయిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
నయన మనోహరం .. నృసింహ కల్యాణం
సింహాచలం: సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు. కొట్నాల ఉత్సవంతో శ్రీకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలు కుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో కొలువుదీర్చారు. ఈ పల్లకీలను సింహగిరి మాడవీధుల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేశారు. స్వామివారు, అమ్మవార్ల వైభవాన్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ జరిగిన ఎదురు సన్నాహోత్సవం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా రావులపాలే నికి చెందిన కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్య సూర్యనారాయణమూర్తి వ్యవహరించారు. నేత్రపర్వం..రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంలో ఉన్న స్వామివారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజన సందోహం రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్రాజ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరిపించారు. స్వామివారిని, అమ్మవార్లను నృసింహ మండపంలోకి తీసుకొచ్చి, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కొలువుదీర్చి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు, నార్త్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన దాసరి రాము ట్రూప్ పులివేషాలు, విజయనగరం జిల్లా వేపాడకు చెందిన సింహాద్రి అప్పన్న గరిడి నృత్యం, విశాఖలోని దువ్వాడకు చెందిన నూకాంబిక ట్రూప్ కోలాటం, వడ్లపూడికి చెందిన వెంకట పరమేశ్వరి అన్నమయ్య సంఘం మహిళల కోలాటం, కూర్మాన్నపాలేనికి చెందిన శ్రీ బాలాజీ త్రిశక్తి కోలాటం సంఘం మహిళలు చేసిన నృత్యం, మాధవధారకు చెందిన లలిత వైభవ కోలాటం, విజయనగరానికి చెందిన పులివేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కనువిందుగా ఎదురు సన్నాహోత్సవం వైభవంగా రథోత్సవం పరవశించిన భక్తజనం సింహగిరికి కల్యాణ సిరి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులుమహిళల సాంస్కృతిక ప్రదర్శన -
ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా
మహరాణిపేట: ఎన్నికల సమయంలో అభ్యర్థులతోపాటు ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు రంగ రాజన్, భీమిలి, తూర్పు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండేజైన్, ఉత్తర, పశ్చిమ, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు అక్తా జైన్తో కలిసి శుక్రవారం జిల్లాలో నీనా నిగం పర్యటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అధికారులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీనా నిగం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలు పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్, ఎంసీసీ నోడల్ అధికారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి ఆమెకు వివరించారు. క్షేత్రస్థాయిలో చర్యలు, సేవలు కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ 11 చోట్ల చెక్ పోస్టులు పెట్టామని, ఇప్పటి వరకు వస్తు, ధన రూపంలో రూ.4.92 కోట్ల నగదును సీజ్ చేశామని తెలిపారు. మొత్తం 110 రకాల బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయని వివరించారు. 24/7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది నోడల్ అధికారులను నియమించామని, 502 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 1,457 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ–విజిల్ ద్వారా 388 వినతులు రాగా.. 285 వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనల్లో 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. బాధ్యతగా ఎన్నికల విధులు జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం నియోజకవర్గాల వారీగా సమీక్షలు
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్థిరంగా బంగారం ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement