నెలాఖరుకల్లా కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన! | Sakshi
Sakshi News home page

నెలాఖరుకల్లా కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన!

Published Thu, Jan 9 2014 4:17 AM

Cong may to finalize 150-200 Lok Sabha poll candidates by month-end

న్యూఢిల్లీ: జనవరి నెలాఖరుకల్లా 150 నుంచి 200 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జనవరి 17న జరిగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశం తరువాత అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ప్రారంభిస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
 
 అభ్యర్థులను ముందే ప్రకటించాలని రాహుల్‌గాంధీ కూడా భావిస్తున్నారని, దానివల్ల ప్రచార వ్యూహాలను రూపొందించుకోవడం, ఎన్నికల కోసం ఇతరత్రా సిద్ధం కావడం సాధ్యమవుతుందని పార్టీ అనుకుంటోందని ఆయన వివరించారు. పార్టీని ఎన్నికల కోసం సిద్ధం చేసే వ్యూహాలను రూపొందించే లక్ష్యంతో గతంలో ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ కూడా అభ్యర్థుల ముందస్తు ప్రకటనను సూచించిందన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్, మేలలో జరిగే అవకాశాలున్నందున, అభ్యర్థులకు కనీసం మూడు నెలల సమయం లభిస్తుందన్నారు. రెబెల్ అభ్యర్థుల బెడదతోనే ఆంటోనీ కమిటీ సూచన కార్యరూపం దాల్చలేదన్నారు.
 

Advertisement
Advertisement