ముంబై: ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు... ఏ నోటైనా సరే! 2005 కన్నా ముందు ముద్రించినట్లయితే అది మార్చి 31 తరవాత చెల్లదు. మార్చి 31 తరవాత ఈ నోట్లను ఏ లావాదేవీలోనూ, ఏ కొను గోలులోనూ ఉపయోగించలేరు. ఒకవేళ అప్పటికీ మీ దగ్గర ఇలాంటి నోట్లు మిగిలిపోతే వీటిని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటిని తీసుకుని... బదులుగా 2005 తరవాత ముద్రించిన నోట్లను మీకు అందజేస్తాయి.
అయితే మార్చి 31 దాకా వీటిని ఏ లావాదేవీలోనైనా యథేచ్చగా వినియోగించవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం సహా ఏదైనా చేయొచ్చు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రిజర్వు బ్యాంకు ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.
మంగళవారం నాటి ప్రకటనలో నోట్ల మార్పిడిపై బ్యాంకులన్నిటికీ ఆర్బీఐ తగు సూచనలు చేసింది. మార్చి 31 తరవాత ఇవి చెల్లవు కనక... వీటిని ఏ బ్యాంకు బ్రాంచిలోనైనా ఇచ్చి మార్పు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ‘‘ఇలా జులై 1వ తేదీ వరకూ ఏ బ్రాంచిలోనైనా, ఎన్ని నోట్లయినా మార్చుకోవచ్చు. జులై 1 తరవాత కూడా ఏ బ్రాంచిలోనైనా నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆ బ్రాంచిలో మీకు ఖాతా లేకున్నా సరే!. అయితే సదరు బ్యాంకులో ఖాతా లేనివారు రూ.500, రూ.1000 నోట్లను 10 కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం వారి గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ వివరాలను ఆ బ్రాంచిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతా ఉన్న బ్రాంచిలో గనక ఎన్ని నోట్లిచ్చినా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ఆర్బీఐ వివరించింది. ఈ ప్రక్రియకు బ్యాంకులన్నీ సహకరించాలని తన నోట్లో కోరింది.
ఇకపై బ్యాంకులు తమ కస్టమర్లకు 2005కు ముందు ముద్రించిన నోట్లను ఇవ్వకూడదని, ఎవరైనా పాత నోట్లను తీసుకొచ్చి కొత్తవి ఇవ్వాలని అడిగితే మార్పు చేయాలని బ్యాంకులకు సూచించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఎలా గుర్తు పట్టాలనే విషయమై ఆర్బీఐ ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది.
ఇది గుర్తుంచుకోండి...
2005 తరవాత ముద్రించిన నోట్ల వెనక వైపున దాని ముద్రణ సంవత్సరం ఉంటుంది. 2005కు ముందు ముదించిన నోట్ల వెనక ఎలాంటి తేదీ కానీ సంవత్సరం కానీ ఉండదు. నోట్ల వెనక సంవత్సరం కనక లేకున్నట్లయితే... దాన్ని పాత నోటుగానే భావించాలి.పాత నోట్లు కూడా మార్చి 31 వరకూ యథావిధిగా చెల్లుతాయి. ఆ తర్వాత కూడా వీటిని బ్యాంకుల్లో ఇచ్చి మార్పిడి చేసుకోవచ్చు.
నకిలీ కరెన్సీని నిరోధించడానికే: రాజన్
నకిలీ కరెన్సీని నిరోధించడానికే ఈ చర్య తీసుకున్నట్లు మంగళవారం ఉదయం ఒక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ‘‘నల్ల ధనం, పన్ను ఎగవేతల వంటివి మంచి పనులని నేను చెప్పటం లేదు. కానీ మా నిర్ణయం మాత్రం వాటి నివారణకు తీసుకున్నది కాదు’’ అన్నారాయన. గతంలో జారీచేసిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా తక్కువని, వాటిని ఉపసంహరించుకోవడానికి ఇదో సాంకేతికపరమైన చర్యని తెలియజేశారు. 2005 క్రితం నోట్లతో పోలిస్తే తరవాత ముద్రించిన నోట్లలో 6 నుంచి 8 భద్రత ఫీచర్లు అదనంగా ఉన్నట్లు తెలిపారు.
మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు
Published Wed, Jan 29 2014 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement