-
రూ.500 కోసం బాలుడి హత్య
మహబూబ్నగర్ క్రైం: కేవలం ఐదే ఐదు వందల రూపాయల కోసం ఓ బాలుడిని హత్య చేసిన దారుణ ఘటన మహబూబ్నగర్లో వెలుగుచూసింది. టూటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ చెప్పిన వివరాల మేరకు.. న్యూటౌన్లోని ఓ హోటల్లో వెయిటర్గా పని చేస్తున్న ఫరూక్నగర్కు చెందిన మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్ ఆగస్టు 20న స్థానికంగా పండ్లు విక్రయించే సయ్యద్ ఖదీర్ వద్ద సెల్ఫోన్ విక్రయించి రూ.2వేలు తీసుకున్నాడు. మరుసటిరోజు మళ్లీ ఖదీర్ వద్దకెళ్లి మరో రూ.200 ఇవ్వాలని అడిగాడు. సెల్ఫోన్ చార్జర్ ఇస్తే..డబ్బులు ఇస్తానని ఖదీర్ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన షహిరియార్(16).. తాను గతంలో ఇచ్చిన రూ.500 తిరిగి ఇవ్వాలని మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్ను అడిగాడు. తాను హోటల్లో పనికి వెళ్లడం లేదని, తన దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. జేబులో నుంచి రూ.300 తీసుకున్నాడని.. కాగా, షహిరియార్కు ఫోన్ ఇచ్చి షాసాబ్గుట్టలో ఉండే తన రూంకు పంపిస్తే ఫోన్కు సరిపడా చార్జర్ చెక్ చేసి ఇస్తానని ఖదీర్కు చెప్పాడు. ఈ క్రమంలో రూం వద్దకు వెళ్లిన షహిరియార్ చార్జర్ తీసుకున్న తర్వాత ఉల్లాఖాన్ జేబులో ఉన్న రూ.300 తీసుకున్నాడు. నాకు రూ.500 ఇవ్వాలి కదా.. ఈ రూ.300మినహాయించుకో అని చెప్పాడు. అయితే నా జేబులో నుంచే డబ్బులు తీసుకుంటావా అని ఆగ్రహంతో ఊగిపోయిన ఉల్లాఖాన్ ’నిన్ను చంపితే రూ.500తో పాటు సెల్ఫోన్ మిగిలిపోతాయ’ని అంటూ షహిరియార్ గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. పదిరోజుల కిందట అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడు మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యచేసినట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రూ.500 డ్రా చేస్తే రూ.1100 ఇస్తున్న ఎటిఎం
-
మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు
ముంబై: ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు... ఏ నోటైనా సరే! 2005 కన్నా ముందు ముద్రించినట్లయితే అది మార్చి 31 తరవాత చెల్లదు. మార్చి 31 తరవాత ఈ నోట్లను ఏ లావాదేవీలోనూ, ఏ కొను గోలులోనూ ఉపయోగించలేరు. ఒకవేళ అప్పటికీ మీ దగ్గర ఇలాంటి నోట్లు మిగిలిపోతే వీటిని బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటిని తీసుకుని... బదులుగా 2005 తరవాత ముద్రించిన నోట్లను మీకు అందజేస్తాయి. అయితే మార్చి 31 దాకా వీటిని ఏ లావాదేవీలోనైనా యథేచ్చగా వినియోగించవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం సహా ఏదైనా చేయొచ్చు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రిజర్వు బ్యాంకు ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. మంగళవారం నాటి ప్రకటనలో నోట్ల మార్పిడిపై బ్యాంకులన్నిటికీ ఆర్బీఐ తగు సూచనలు చేసింది. మార్చి 31 తరవాత ఇవి చెల్లవు కనక... వీటిని ఏ బ్యాంకు బ్రాంచిలోనైనా ఇచ్చి మార్పు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ‘‘ఇలా జులై 1వ తేదీ వరకూ ఏ బ్రాంచిలోనైనా, ఎన్ని నోట్లయినా మార్చుకోవచ్చు. జులై 1 తరవాత కూడా ఏ బ్రాంచిలోనైనా నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ బ్రాంచిలో మీకు ఖాతా లేకున్నా సరే!. అయితే సదరు బ్యాంకులో ఖాతా లేనివారు రూ.500, రూ.1000 నోట్లను 10 కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం వారి గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ వివరాలను ఆ బ్రాంచిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతా ఉన్న బ్రాంచిలో గనక ఎన్ని నోట్లిచ్చినా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ఆర్బీఐ వివరించింది. ఈ ప్రక్రియకు బ్యాంకులన్నీ సహకరించాలని తన నోట్లో కోరింది. ఇకపై బ్యాంకులు తమ కస్టమర్లకు 2005కు ముందు ముద్రించిన నోట్లను ఇవ్వకూడదని, ఎవరైనా పాత నోట్లను తీసుకొచ్చి కొత్తవి ఇవ్వాలని అడిగితే మార్పు చేయాలని బ్యాంకులకు సూచించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఎలా గుర్తు పట్టాలనే విషయమై ఆర్బీఐ ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. ఇది గుర్తుంచుకోండి... 2005 తరవాత ముద్రించిన నోట్ల వెనక వైపున దాని ముద్రణ సంవత్సరం ఉంటుంది. 2005కు ముందు ముదించిన నోట్ల వెనక ఎలాంటి తేదీ కానీ సంవత్సరం కానీ ఉండదు. నోట్ల వెనక సంవత్సరం కనక లేకున్నట్లయితే... దాన్ని పాత నోటుగానే భావించాలి.పాత నోట్లు కూడా మార్చి 31 వరకూ యథావిధిగా చెల్లుతాయి. ఆ తర్వాత కూడా వీటిని బ్యాంకుల్లో ఇచ్చి మార్పిడి చేసుకోవచ్చు. నకిలీ కరెన్సీని నిరోధించడానికే: రాజన్ నకిలీ కరెన్సీని నిరోధించడానికే ఈ చర్య తీసుకున్నట్లు మంగళవారం ఉదయం ఒక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ‘‘నల్ల ధనం, పన్ను ఎగవేతల వంటివి మంచి పనులని నేను చెప్పటం లేదు. కానీ మా నిర్ణయం మాత్రం వాటి నివారణకు తీసుకున్నది కాదు’’ అన్నారాయన. గతంలో జారీచేసిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా తక్కువని, వాటిని ఉపసంహరించుకోవడానికి ఇదో సాంకేతికపరమైన చర్యని తెలియజేశారు. 2005 క్రితం నోట్లతో పోలిస్తే తరవాత ముద్రించిన నోట్లలో 6 నుంచి 8 భద్రత ఫీచర్లు అదనంగా ఉన్నట్లు తెలిపారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement