రాష్ట్రంలోని ఉన్నతాధికారుల మూకుమ్మడి సెలవు
* డానిక్స్ అధికారుల ‘సస్పెన్షన్’పై నిరసన
* ఆ అధికారుల సస్పెన్షన్ చెల్లదు: హోంశాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో రగడ రాజుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంకో వివాదం ముదురుతోంది. ఇద్దరు డానిక్స్ అధికారులను సస్పెండ్ చేయటానికి నిరసనగా.. ఢిల్లీ రాష్ట్ర సర్కారులోని సీనియర్ అధికారులంతా గురువారం మూకుమ్మడి సెలవు పెట్టారు. ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటం చెల్లదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేర్కొనగా.. రాజధానిలో శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ కార్యక్రమాన్ని విఫలం చేసే కుట్రలో భాగమే అధికారుల సమ్మె అని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది.
కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయనందుకు సస్పెన్షన్...
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలుపై సంతకాలు చేయటానికి ఢిల్లీ హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శులు యశ్పాల్గార్గ్, సుభాష్చంద్రలు నిరాకరించటంతో వారిని ఆప్ సర్కారు సోమవారం నాడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా ఢిల్లీ సర్కారులోని దాదాపు 200 మంది డానిక్స్ (ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్) కేడర్ అధికారులు గురువారం రోజంతా మూకుమ్మడి సెలవు పెట్టగా.. మరో 70 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సమ్మె చేశారు.
సుదీర్ఘ సెలవులో వెళితే సంతోషం: కేజ్రీవాల్
సమ్మెలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. డానిక్స్, ఐఏఎస్ సంఘాలు బీజేపీ బీ-టీమ్ (ప్రత్యామ్నాయ బృందం)గా తయారయ్యాయని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ.. లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర అధికారుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని ట్విటర్లో ఆరోపించారు. ‘‘వీళ్లు (ఢిల్లీ అధికారులు) సుదీర్ఘ సెలవులో వెళ్తే జనం సంతోషిస్తారు. వారికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ’’ అని పేర్కొన్నారు.
శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ పథకాన్ని విఫలం చేసే కుట్ర ఇదని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. అధికారులకు సమ్మెపై వెళ్లే హక్కు లేదని.. అది వారి సర్వీసు నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు.
వారి సస్పెన్షన్ చెల్లదు: కేంద్ర హోంశాఖ
ఇద్దరు డానిక్స్ అధికారుల సస్పెన్షన్పై లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సమాచారం అందిందని.. ఈ ఉత్తర్వును పొరపాటుగా లేదా మనుగడలో లేనిదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సదరు అధికారులు ఇద్దరూ విధుల్లో ఉన్నట్లే పరిగణించాల్సి ఉంటుందని హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
ఢిల్లీలో మరో లొల్లి
Published Fri, Jan 1 2016 3:18 AM
Advertisement
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
What’s your opinion
Advertisement