న్యూఢిల్లీ: బాలికలపై కామాంధుల ఆకృత్యాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. వయసు తారతమ్యాన్ని మరిచిపోయి మరీ మానవ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మైనర్ బాలికపై 77ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో వెలుగుచూసింది. మహేందర్ సెహ్వాగల్ అనే వ్యాపార వేత్త మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ కామాంధుని ఆకృత్యాలు రోజురోజుకు శృతిమించడంతో ఆ బాలిక పోలీసుల్ని ఆశ్రయించింది. నీలి చిత్రాలు కల్గిన వీడియోలను తనకు బలవంతంగా చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.
గత కొన్ని నెలల నుంచి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ బాలిక పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆ వృద్ద వ్యాపారవేత్తను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.