అథ్లెట్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువన్న విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకు కారణం వారు సరైన పోషక పదార్థాలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, ధూమపానం లాంటి దురలవాట్లు లేకపోవడమేనని భావిస్తూ వచ్చారు. అయితే.. శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి ఉన్న సంబంధం ఏంటో మాత్రం వారు విడమరచి చెప్పలేకపోయారు.
శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి కారణాలు ఏంటో తాజాగా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. కోపెన్హాగెన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణులు ఎంపికచేసిన ఆరు ఎలుకల్లోకి క్యాన్సర్ కణాలను ఎక్కించారు. వాటిలో మూడింటిని బోనులో బంధించారు. మరో మూడింటిని స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. కొన్ని నెలల తర్వాత వాటిని పరీక్షించి చూడగా, బోనులో బంధించిన మూడు ఎలుకల్లోనూ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందాయి. స్వేచ్ఛగా వదిలేసిన మూడు ఎలుకల్లో ఒకదానిలో మాత్రమే క్యాన్సర్ కణితి ఏర్పడింది. అదికూడా బోనులో బంధించిన ఎలుకల క్యాన్సర్ కణుతుల కన్నా చిన్నగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా వ్యాయామం చేయడంతో క్యాన్సర్ వచ్చే ముప్పును దాదాపు తప్పించుకోవచ్చని తేలింది.
క్యాన్సర్కు, వ్యాయామానికి ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏంటన్న అంశంపై కూడా శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరిపారు. బ్రిటన్లోని చారిటీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉన్న 50 మందిని ఎంపిక చేసి వారితో వారానికి రెండున్నర గంటల చొప్పున 12 నెలలపాటు వ్యాయామం చేయించింది. వారిలో గణనీయంగా క్యాన్సర్ తగ్గిపోయింది. వ్యాయామం చేయడం వల్ల ఆడ్రినలైన్ అనే హార్మోన్, ఇంటర్లుకిన్ అనే ప్రోటీన్ బాడీలో విడుదలవుతుంది. ఈ రెండు కూడా క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ నివారణ మందుల్లోనూ ఇప్పుడు వీటిని వాడుతున్నారు.
ఈ మందులు అవసరం లేకుండా క్యాన్సర్ను నిరోధించేందుకు వ్యాయామం చేయడమే ఉత్తమమైన మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అడ్రినలిన్, ఇంటర్లుకిన్ మందుల వల్ల శరీరంలో మంట పుడుతుందని, ఆది కొన్ని సందర్భాల్లో బాధగాను ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఈ మంట శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుందని వారు చెబుతున్నారు. ఏ మాత్రం వ్యాయామం చేయలేని వారే మందులు వాడాలని, వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెస్ట్, అండాశయం, సర్వికల్ క్యాన్సర్లను సులభంగానే ఎదుర్కోవచ్చని వారంటున్నారు. వ్యాయామం అంటే అథ్లెట్లలా చేయాల్సిన అవసరం లేదని, వారానికి మూడు గంటలు చేస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. వ్యాయామం చేయడం ద్వారానే క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్, బాలీవుడ్ తార మనిషా కొయిరాలా తదితరులు క్యాన్సర్ను జయంచిన విషయం తెల్సిందే.
ఎక్సర్సైజ్తో క్యాన్సర్ మటుమాయం
Published Wed, Jul 13 2016 6:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement