Sakshi News home page

పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు

Published Sat, Oct 10 2015 3:20 PM

పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు - Sakshi

టీడీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని, ఇసుక, మట్టి, చివరకు భూములు కూడా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లాం బాలరాజు మండిపడ్డారు. ఈ రాజ్యంలో ఏదీ ఉంచేలా లేరని ఆయన విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
  • మీ అందరి తరఫున జగనన్నకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకొంటున్నా.
  • ఈ దీక్షతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ అంటే చంద్రబాబుకు దడ.
  • ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే ఎలా అడ్డంకులు కల్పిస్తున్నారో, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మీరంతా చూస్తున్నారు.
  • అయినా వాటిని జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు
  • పోలవరం ప్రాజెక్టు దివంగత రాజశేఖర రెడ్డి కల
  • ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా పోతుంది
  • ప్రత్యేక హోదా గురించి అందరూ ఇంతలా ఘోష పెడుతుంటే చంద్రబాబుకు వినిపించడం లేదు, కనిపించడం లేదు.
  • ఆయన ధ్యాసంతా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అన్నదే.
  • ఆయనకు ఎంతసేపూ చైనా, జపాన్ లాంటి దేశాలు తిరగడానికి తీరిక ఉంటుంది తప్ప ప్రజాసేవకు తీరిక లేదు.
  • ఈ 18 నెలల్లో ఆయన కల్లిబొల్లి మాటలతో దోపిడి రాజ్యం నడిపిస్తున్నాడు.
  • ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎలా ఎడారి అయ్యిందో చూస్తున్నాం
  • పంటలు పండట్లేదు, ఏ రైతూ సుఖంగా లేరు
  • చంద్రబాబు పాలనలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు
  • ప్రజలే ఆయనను తిప్పికొడతారు.. ఇది ఖాయం

Advertisement

What’s your opinion

Advertisement