ఆవు, ఎద్దు డిష్యూం డిష్యూం... పట్టాలు తప్పిన రైలు | Sakshi
Sakshi News home page

ఆవు, ఎద్దు డిష్యూం డిష్యూం... పట్టాలు తప్పిన రైలు

Published Tue, Jul 29 2014 10:20 AM

ఆవు, ఎద్దు డిష్యూం డిష్యూం... పట్టాలు తప్పిన రైలు

లక్నో: ఆవు,ఎద్దు కొట్లాడుకుంటు రైల్వే ట్రాక్పైకి వచ్చాయి. ఆ క్రమంలో ట్రాక్పై వెళ్తున్న లాల్ కునా ఎక్స్ప్రెస్ ఇంజన్ను ఢీ కొట్టాయి. దాంతో ఆ ఎక్స్ప్రెస్ రైలు నాలుగు స్లీపర్ కోచ్లు పట్టాలు తప్పాయి. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని దాలిగంజ్ రైల్వేస్టేషన్ సమీపంలో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైలు ప్రయాణికులలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. రైలు కోచ్లను పట్టాలపైకి ఎక్కించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

Advertisement
Advertisement