ముంబై/న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సీజన్లో అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తున్నాయి. దీంట్లో భాగంగా జపాన్కు చెందిన కవాసాకీ రెండు నింజా బైక్లను, హోండా మోటార్ సైకిల్ అం డ్ స్కూటర్ ఇండియా డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను, నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చాయి. ఆ వివరాలు ఇవీ...
నిస్సాన్ మైక్రా డీజిల్ వేరియంట్
నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చింది. ఆరు రంగుల్లో లభ్యమయ్యే ఈ కారు ధర రూ.5.57 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా కారుతో నిస్సాన్ కంపెనీ భారత్లో అందిస్తున్న మైక్రా వేరియంట్ల సంఖ్య 12కు చేరింది.
హోండా డ్రీమ్ యుగలో లిమిటెడ్ ఎడిషన్
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తోంది. స్టైలిష్ డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ధర రూ. 45,164(ఎక్స్షోరూమ్, ఢిల్లీ). డ్రీమ్ యుగ ఏడాదిలో 3 లక్షల బైక్లను విక్రయించిన సందర్భంగా, పండుగల నేపథ్యంలో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
కవాసాకీ సూపర్ బైక్లు
జపాన్కు చెందిన కవాసకి మోటార్స్ రెండు కొత్త సూపర్ బైక్లు- నింజా జడ్ఎక్స్-14ఆర్(ధర రూ.16.90 లక్షలు), నింజా జడ్ఎక్స్-10ఆర్(ధర రూ.15.70 లక్షలు) మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ రెండు బైక్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్(సీబీయూ) రూపంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని ఏడాదిలో 100 బైక్లను విక్రయించడం లక్ష్యమని తెలిపింది. 1000 కంటే ఎక్కువ సిసి బైక్లకు భారత్లో డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని వివరించింది.
బండికి పండగొచ్చింది...
Published Thu, Sep 5 2013 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement