బండికి పండగొచ్చింది... | Sakshi
Sakshi News home page

బండికి పండగొచ్చింది...

Published Thu, Sep 5 2013 1:06 AM

Japan's kavasaki two ninja bikes

ముంబై/న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సీజన్‌లో అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తున్నాయి. దీంట్లో భాగంగా జపాన్‌కు చెందిన కవాసాకీ రెండు నింజా బైక్‌లను, హోండా మోటార్ సైకిల్ అం డ్ స్కూటర్ ఇండియా డ్రీమ్ యుగ మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్‌ను, నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్‌లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్‌ఈను మార్కెట్లోకి తెచ్చాయి. ఆ వివరాలు ఇవీ...
 
 నిస్సాన్ మైక్రా డీజిల్ వేరియంట్
 నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్‌లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్‌ఈను మార్కెట్లోకి తెచ్చింది. ఆరు రంగుల్లో లభ్యమయ్యే ఈ కారు ధర రూ.5.57 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా కారుతో నిస్సాన్ కంపెనీ భారత్‌లో అందిస్తున్న మైక్రా వేరియంట్ల సంఖ్య 12కు చేరింది.  
 
 హోండా డ్రీమ్ యుగలో లిమిటెడ్ ఎడిషన్
 హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డ్రీమ్ యుగ మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తోంది.  స్టైలిష్ డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ధర రూ. 45,164(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).  డ్రీమ్ యుగ ఏడాదిలో 3 లక్షల బైక్‌లను విక్రయించిన సందర్భంగా, పండుగల నేపథ్యంలో లిమిటెడ్ ఎడిషన్‌ను  అందిస్తున్నామని  కంపెనీ పేర్కొంది.
 
 కవాసాకీ సూపర్ బైక్‌లు
 జపాన్‌కు చెందిన కవాసకి మోటార్స్ రెండు కొత్త సూపర్ బైక్‌లు- నింజా జడ్‌ఎక్స్-14ఆర్(ధర రూ.16.90 లక్షలు), నింజా జడ్‌ఎక్స్-10ఆర్(ధర రూ.15.70 లక్షలు) మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ రెండు బైక్‌లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్(సీబీయూ) రూపంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని ఏడాదిలో 100 బైక్‌లను విక్రయించడం లక్ష్యమని తెలిపింది. 1000 కంటే ఎక్కువ సిసి బైక్‌లకు భారత్‌లో డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని వివరించింది.
 

Advertisement
Advertisement