-
బండికి పండగొచ్చింది...
ముంబై/న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సీజన్లో అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తున్నాయి. దీంట్లో భాగంగా జపాన్కు చెందిన కవాసాకీ రెండు నింజా బైక్లను, హోండా మోటార్ సైకిల్ అం డ్ స్కూటర్ ఇండియా డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను, నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చాయి. ఆ వివరాలు ఇవీ... నిస్సాన్ మైక్రా డీజిల్ వేరియంట్ నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చింది. ఆరు రంగుల్లో లభ్యమయ్యే ఈ కారు ధర రూ.5.57 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా కారుతో నిస్సాన్ కంపెనీ భారత్లో అందిస్తున్న మైక్రా వేరియంట్ల సంఖ్య 12కు చేరింది. హోండా డ్రీమ్ యుగలో లిమిటెడ్ ఎడిషన్ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తోంది. స్టైలిష్ డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ధర రూ. 45,164(ఎక్స్షోరూమ్, ఢిల్లీ). డ్రీమ్ యుగ ఏడాదిలో 3 లక్షల బైక్లను విక్రయించిన సందర్భంగా, పండుగల నేపథ్యంలో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. కవాసాకీ సూపర్ బైక్లు జపాన్కు చెందిన కవాసకి మోటార్స్ రెండు కొత్త సూపర్ బైక్లు- నింజా జడ్ఎక్స్-14ఆర్(ధర రూ.16.90 లక్షలు), నింజా జడ్ఎక్స్-10ఆర్(ధర రూ.15.70 లక్షలు) మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ రెండు బైక్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్(సీబీయూ) రూపంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని ఏడాదిలో 100 బైక్లను విక్రయించడం లక్ష్యమని తెలిపింది. 1000 కంటే ఎక్కువ సిసి బైక్లకు భారత్లో డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని వివరించింది. -
బండికి పండగొచ్చింది...
ముంబై/న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సీజన్లో అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తున్నాయి. దీంట్లో భాగంగా జపాన్కు చెందిన కవాసాకీ రెండు నింజా బైక్లను, హోండా మోటార్ సైకిల్ అం డ్ స్కూటర్ ఇండియా డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను, నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చాయి. ఆ వివరాలు ఇవీ... నిస్సాన్ మైక్రా డీజిల్ వేరియంట్ నిస్సాన్ కంపెనీ మైక్రా మోడల్లో డీజిల్ వేరియంట్, మైక్రా ఎక్స్ఈను మార్కెట్లోకి తెచ్చింది. ఆరు రంగుల్లో లభ్యమయ్యే ఈ కారు ధర రూ.5.57 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా కారుతో నిస్సాన్ కంపెనీ భారత్లో అందిస్తున్న మైక్రా వేరియంట్ల సంఖ్య 12కు చేరింది. హోండా డ్రీమ్ యుగలో లిమిటెడ్ ఎడిషన్ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డ్రీమ్ యుగ మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తోంది. స్టైలిష్ డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ధర రూ. 45,164(ఎక్స్షోరూమ్, ఢిల్లీ). డ్రీమ్ యుగ ఏడాదిలో 3 లక్షల బైక్లను విక్రయించిన సందర్భంగా, పండుగల నేపథ్యంలో లిమిటెడ్ ఎడిషన్ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. కవాసాకీ సూపర్ బైక్లు జపాన్కు చెందిన కవాసకి మోటార్స్ రెండు కొత్త సూపర్ బైక్లు- నింజా జడ్ఎక్స్-14ఆర్(ధర రూ.16.90 లక్షలు), నింజా జడ్ఎక్స్-10ఆర్(ధర రూ.15.70 లక్షలు) మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ రెండు బైక్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్(సీబీయూ) రూపంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని ఏడాదిలో 100 బైక్లను విక్రయించడం లక్ష్యమని తెలిపింది. 1000 కంటే ఎక్కువ సిసి బైక్లకు భారత్లో డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని వివరించింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement