రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం

Published Mon, Aug 5 2013 11:24 AM

రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం


న్యూఢిల్లీ : డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి సోమవారం రాజ్యసభ సభ్యురాలిగా  ప్రమాణ స్వీకారం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నకైన వారితో  రాజ్యసభ సభ్యుడు హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయించారు.

అదేవిధంగా ఇటీవలే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవలే మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ తదితర నాయకులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి.

Advertisement
Advertisement