Sakshi News home page

మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారం

Published Thu, Aug 28 2014 6:40 PM

మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారం - Sakshi

ఘజియాబాద్: కొత్తగా పెళ్లైన మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తన ఆడపడుచు భర్త షంషాద్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు షహిబాబాద్ పోలీసులు ఫిర్యాదు చేసింది. తన భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో అతడీ ఘాతుకానికి ఒడిగట్టాడని ఆరోపించింది.

గతరాత్రి తన భర్తతో కలిసి షహిద్ నగర్ లోని రేష్మా ఇంటికి వెళ్లానని బాధితురాలు తెలిపింది. తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త ప్రోత్సాహంతో షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొంది.  నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement