సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా

Published Fri, Feb 5 2016 2:14 AM

సమస్యలు పరిష్కరించాలంటూ మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలంటూ గురువారం తెలంగాణ మోడల్ స్కూల్స్  టీచర్లు  హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. సర్వీస్ రూల్స్‌ను ప్రకటించి అమలు చేయాలని, బకాయిలను విడుదల చేయాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు.

ఈ ధర్నాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.దశరథ్‌యాదవ్, నాయకులు భూతం యాకమల్లు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం  70 మంది టీచర్లను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Advertisement