ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా దూసుకుపోయాయి. ఆరంభంనుంచి రికార్డ్ లాభాలతో మెరుపులతో మురిపిస్తున్న మార్కెట్లు వరుస రికార్డులు స్థాయిలు నమోదుచేశాయి. ముఖ్యంగా మిడ్ సెషన్లో ఊపందుకున్న కొనుగోళ్ల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహించాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ 88.65 పాయింట్లు ఎగిసి రికార్డు స్థాయిలో 9307 వద్ద ముగిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 9,300 ని తాకింది. సెన్సెక్స్ 287.40 పాయింట్లు జంప్చేసి 29,943 వద్ద క్లోజైంది. మరోవైపు ఉదయం నుంచి రికార్డ్ లెవల్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ తన హవాను మరింత పొడిగించింది. తొలిసారి 22,000 పాయింట్లను అధిగమించింది.
సెన్సెక్స్ దాదాపు 250పాయింట్లకు పైగా లాభపడగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా సెక్టార్లు గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. రిలయన్స్ , ఎంఎం, ఇండియా బుల్స్ షేర్ల లాభాలు బుల్ రన్ లో ప్రధాన పాత్ర పోషించాయి.