విజయవాడలో మెట్రోరైలు సాధ్యం కాదు: కేంద్రం | Sakshi
Sakshi News home page

విజయవాడలో మెట్రోరైలు సాధ్యం కాదు: కేంద్రం

Published Wed, Aug 26 2015 7:17 AM

విజయవాడలో మెట్రోరైలు సాధ్యం కాదు: కేంద్రం - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. విజయవాడలో మెట్రోరైలు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సాయం చేయలేమని మున్సిపల్ శాఖకు కేంద్రం సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టాలంటే విజయవాడలో 20 లక్షల జనాభా కూడా లేదని, ఆర్థిక మనుగడ సాధించలేదని పేర్కొంది.

తక్కువ జనాభా ఉండటంతో రవాణా అవసరాలు అంతగా ఉండవనీ, మెట్రోరైలుకు లాభదాయకం కాదనీ, భవిష్యత్తులో ఇది భారంగా మారే సమస్య ఉత్పన్నమతుందని కేంద్రం పేర్కొంది. దాంతో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
 

Advertisement
Advertisement