కమలాఫలాలతో కొట్టి చంపారు! | Sakshi
Sakshi News home page

కమలాఫలాలతో కొట్టి చంపారు!

Published Fri, Aug 22 2014 10:25 AM

కమలాఫలాలతో కొట్టి చంపారు!

కమలాఫలాలతో కొట్టి ఓ వ్యక్తిని చంపిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. వ్యవసాయ కూలీని ఇద్దరు వ్యక్తులు కమలాఫలాలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.

వీరి మధ్య గొడవ తలెత్తడంతో కమలాపళ్లు సేకరించి ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. తమ వద్దనున్న కమలాలు అయిపోయే వరకు అతడిపై విసిరారు. దీంతో వ్యవసాయకూలీ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement