న్యూఢిల్లీ: భద్రత బలగాలకు సంబంధించిన ఒకే ర్యాంకు, ఒకే పింఛను(ఓఆర్ఓపీ) పథకంపై దీపావళి పండగకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. బిహార్ ఎన్నికల కోడ్ కారణంగా ఓఆర్ఓపీ ప్రకటనను వాయిదా వేసినట్లు వెల్లడించారు.
మెడళ్లు వెనక్కి.. ఓఆర్ఓపీ డిమాండుతో ఉద్యమిస్తున్న మాజీ సైనికోద్యోగులు తమ మెడళ్లను వెనక్కు ఇచ్చేయాలని తీర్మానించుకున్నారు. మాజీ సైనికులు ఈ నెల 9,10 తేదీల్లో తమ మెడళ్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు భారత మాజీసైనికుల నేత వీకే గాంధీ వెల్లడించారు.
దీపావళికి ముందే ఓఆర్ఓపీ నోటిఫికేషన్
Published Sat, Nov 7 2015 2:16 AM
Related news
-
నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు
సాక్షి, పులివెందుల : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆర్మీలో పనిచేసి దేశానికి సేవ చేసిన ఇద్దరు స్నేహితులు తుదకు మృత్యుఒడికి కూడా కలిసే చేరుకున్నారు. వివరాలలోకి వెళితే లింగాల మండలం గుణకణపల్లెకి చెందిన ప్రతాప్రెడ్డి(36), వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన రామిరెడ్డి గోవర్దన్రెడ్డి(35)లు కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తర్వాత రిజైన్ చేసి సొంత గ్రామాలకు వచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం వీరిద్దరు వేర్వేరుగా పులివెందులకు వచ్చారు. పులివెందులలో వారిరువురు కలుసుకున్నారు. ఇంటి స్థలాల కొనుగోలు విషయమై కదిరి రోడ్డులో గల రియల్ ఎస్టేట్ భూములను పరిశీలించేందుకు గోవర్థన్రెడ్డికి చెందిన హోండా షైన్ బైకుపై కలిసి వెళ్లారు. కదిరి రోడ్డులోని గంగమ్మ గుడి దాటిన తర్వాత కుడి వైపున వెంకటాపురం హరిజనవాడ సమీపంలో ఉన్న స్థలాల దగ్గరకు వెళుతుండగా.. ఒక్కసారిగా రోడ్డు ప్రక్కనే గల విద్యుత్ స్థంభాలకు ఉన్న 11కె.వి హైటెక్షన్ విద్యుత్ వైరు తెగి బైకుపై పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కల వారు రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో వారిద్దరు అక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు గోవర్థన్రెడ్డికి భార్య పార్వతితోపాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, సాయి, కుమారుడు బద్రినాథరెడ్డిలు ఉన్నారు. మరొక మృతుడు ప్రతాప్రెడ్డికి భార్య అనురాధతోపాటు కుమార్తె రక్షిత ఉన్నారు. స్థానికులు పోలీసులకు, ఫైరింజన్కు సమాచారం అందించారు. వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా.. గోవర్థన్రెడ్డి, ప్రతాప్రెడ్డిల మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే పులివెందులకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారు విలపిస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు చలించిపోయారు. గుణకణపల్లె, నల్లచెరువుపల్లెలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో గోవర్థన్రెడ్డి, ప్రతాప్రెడ్డిలు మృతి చెందడానికి కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్ లైన్ తెగిపోవడానికి లైన్ ఫాల్ట్ కానీ, జంపర్ వద్ద లూజు ఉండటంవల్ల కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై విద్యుత్ లైన్ను సరిచేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులుగా 11కె.వి విద్యుత్ లైన్ లూజుగా ఉందని స్థానికులు ఆరోపించారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ అధికారులు లూజుగా ఉన్న వైర్లను, ఇతర వాటిని సరి చేయాల్సి ఉంది. జూన్, జులై నెలల్లో బలమైన గాలులు, వర్షాలు వస్తాయని ముందుగానే ట్రాన్స్కో అధికారులు ఇలాంటి పనులు చేపడుతుంటారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు మృతుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యుత్ శాఖ అధికారులపై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ రామాంజినాయక్ పేర్కొన్నారు. -
రణానికి మేమూ సై..
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్ ఉగ్ర దాడులు, ఆపైకవ్వింపు చర్యలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత మాజీ సైనికులు ప్రకటించారు. రాష్ట్రం నుంచి అనేక మంది యుద్ధవీరులు భారత్–పాకిస్తాన్, చైనా యుద్ధాల్లో పనిచేసిన అనుభవంతో పాటు కశ్మీర్ లోయపైభౌగోళిక అవగాహన కలిగి ఉన్నారు. దీంతో సైనిక సంక్షేమ శాఖకు పలువురు మాజీ సైనికులు తాము దేశం తరఫున మళ్లీ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని బుధవారం సంకేతాలిచ్చారు. వారిలో పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మళ్లీ మిగ్ 21 ఎక్కేస్తా.. ‘మన వైమానిక శక్తి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైంది, బలమైంది కూడా. యుద్ధ విమానాలను మనకు సరఫరా చేసిన దేశాలు సైతం వాటిని మనం వినియోగిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపడ్డ ఘటనలు అనేకం’ అని భారత వాయుసేనలో వింగ్ కమాండర్గా పనిచేసిన జగన్మోహన్ మంతెన అన్నారు. మిగ్–21తో పాటు అనేయ యుద్ధవిమానాలు నడపడంలో నిపుణుడైన జగన్ మోహన్.. సైనిక శక్తిపరంగా పాకిస్తాన్కు మనకు ఏ పోలికా లేదన్నారు. పుల్వామా ఘటనతో జాతి యావత్తు కలత చెందిందని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే ప్రక్రియ విజయవంతం కావడం సంతోషకరమన్నారు. యుద్ధం అనివార్యమైతే తామంతా మళ్లీ మిగ్ విమానాలతో దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకెంత మంది చావాలి ‘కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నన్ని రోజులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతీయులను బలి తీసుకుంటూనే ఉంటుంది. అందుకే ప్రత్యేక హక్కులను రద్దు చేసేందుకు ఇదే సమయం’ అని 1971లోభారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్లింగాల పాండురంగారెడ్డి అన్నారు. పుల్వామా–బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేయడం శుభపరిణామమని, ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పీచమణచాలన్నారు. అవసరమైతే మళ్లీ మేమంతా సాయుధులైయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని పాండురంగారెడ్డి చెప్పారు. పాకిస్తాన్ వల్లించే శాంతి వచనాలు నమ్మి మోసపోవద్దని, దృఢమైన రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నారు. జాతి యావత్తు ఒక్కటై ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
మాజీ సైనికులకూ ఆధార్!
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశవ్యాప్తంగా మాజీ సైనికులు పొందుతున్న వివిధ పథకాలు, గ్రాంట్లకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివాహాల గ్రాంటు నుంచి దహన సంస్కారాల వరకు ప్రభుత్వం అందించే ప్రతీ ఒక్క పథకం, గ్రాంటుకు ఇకపై ఆధార్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం పొందుతున్న పథకాలు, గ్రాంట్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు సైతం ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలోనే ఆప్షన్.. ఇకపై మాజీ సైనికులు తమ పథకాలకు, గ్రాంట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ ఆప్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాతే మిగిలిన వివరాలను నమోదు చేయాల్సి ఉం టుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో త్రివిధ దళాల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన మాజీ సైనికులతోపాటు వితంతువులు కలిపి 6 వేల మంది వరకు ఉన్నారు. వీరిందరికీ ఆధార్ వర్తించనుం ది. అయితే హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న పారా మిలిటరీ సైనికులు, పోలీసులుగా పదివీ విరమణ చేసినవారికి ఆధార్ అనుసంధానంపై వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ సైనికులంతా మేల్కోవాలి మాజీ సైనికులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, గ్రాంట్లకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పథకాలు, గ్రాంట్లు పొందుతున్న వారితో పాటు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ నంబర్ను అనుసంధాల్సిందే. మాజీ సైనికులు, వితంతువులు, కుటుంబీకులంతా మేల్కొవాలి. – జి.సత్యానందం, జిల్లా సైనిక సంక్షేమాధికారి -
మాజీ సైనికోద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు
మాజీ సైనికులు, వారి కుటుంబాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా తాము మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నామని, త్వరలో మరి కొన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. -
మాజీ సైనికులకు కేసీఆర్ వరాలు!
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్కు ఓకే • మరణించిన తర్వాత భార్యకు సైతం పెన్షన్ • దేశంలోనే అత్యధికంగా ‘గ్యాలెంటరీ’ పరిహారం • సైనికుల వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు • ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష • సైనికాధికారులు, మాజీ సైనికులతో కలసి భోజనం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులు, వారి కుటుంబాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా తాము మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నామని, త్వరలో మరి కొన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బి.వినోద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రాజీవ్ త్రివేదీ, ఎస్.నర్సింగ్రావు, హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, దక్షిణ భారత సైనిక కమాండెంట్ జనరల్ మేజర్ జనరల్ ఎస్.పచౌరి, సికింద్రాబాద్ స్టేషన్ లెఫ్టినెంట్ కల్నల్ జస్విందర్సింగ్, కెప్టెన్ నవనీత్సింగ్, సైనిక సంక్షేమ కమిటీ సభ్యులు సురేశ్రెడ్డి, జగన్రెడ్డి, పోచయ్య, ప్రభాకర్రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఇందులో పాలొ ్గన్నారు. ఈ భేటీకి ముందు ప్రగతి భవన్లోనే మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలసి సీఎం కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం వారి సమస్యలు, విజ్ఞప్తులు విన్నారు. కాగా తమ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్కు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటించిన వరాలివీ.. ♦ మాజీ సైనికులు రాష్ట్రప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్ పెన్షన్ ఇచ్చే అంశంపై పరిశీలన. పెన్షన్ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే భార్యకు పెన్షన్ అందజేత. ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు ఈ పెన్షన్ చెల్లింపు. ♦ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుం బాలకు అందుతున్న పరిహారం, సదు పాయాలను.. సర్వీసులో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వంటి కారణాలతో మర ణించిన సైనికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలి. ఈ పెన్షన్ కూడా ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు చెల్లింపు. ♦ స్పెషల్ పోలీసాఫీసర్లుగా పనిచేస్తున్న వారికి మాజీ సైనికోద్యోగుల వేతనం. ♦ సైనిక సంక్షేమ బోర్డుల బలోపేతానికి చర్యలు. పది జిల్లాల్లో ఉన్న బోర్డుల తరహాలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లా ల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు. ♦ యుద్ధంలో మరణించిన సైనికులకిచ్చే గ్యాలంటరీ అవార్డుల ద్వారా అందించే పరిహారాన్ని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేలా కొత్త విధానం. ♦ సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో రిజర్వే షన్. మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణ తీసుకునేవారికి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు. ♦ వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని నిర్ణయం. ♦ ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతి సారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారు దేశంలో ఇప్పటికే ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణలో చెల్లించాల్సిన అవసరం లేకుండా చర్యలు. ♦ సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, డబుల్ బెడ్ రూం పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయింపు.
Related News by category
-
Lok Sabha Elections: ఆరో విడత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడతలో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో విడతలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో షెడ్యూల్లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.కాగా, సోమవారం ఉదయం ఆరో విడతలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో విడతలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో విడతలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, మే ఆరో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Election Commission issues notice for the Sixth phase of Lok Sabha elections.Elections will be held in 57 Lok Sabha seats in 6 states and 1 Union Territory. pic.twitter.com/3ASMsonYUb— Sunny Raj ( Modi ka Parivar ) (@sunnyrajbjp) April 29, 2024 -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్రతన్లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement