ఇస్లామాబాద్: పాకిస్థాన్ను దౌత్యపరంగా చావుదెబ్బ కొడుతూ దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) సమావేశాలను బహిష్కరించిన భారత్పై అంతకంతకూ ప్రతీకారం తీర్చుకునేలా దాయాది దేశం భారీ ప్రణాళికలు రచిస్తోంది. సార్క్ ఏర్పడిననాటి నుంచీ కూటమిలో ఇండియానే ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించిన పాక్.. సార్క్కు పోటీగా 'గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్'(విశాల దక్షిణాసియా ఆర్థిక కూటమి)ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
ఇందులో చైనా, ఇరాన్ లతోపాటు మరికొన్ని మధ్య ఆసియా దేశాలనూ భాగస్వాములు చేయాలనుకుంటోంది. 'భారత్ కూడా ఈ కూటమిలో చేరొచ్చు' అని పైకి చెబుతున్నప్పటికీ 'గ్రేటర్ అలయెన్స్' అసలు ఉద్దేశం ఇండియాను ఇబ్బందిపెట్టడమే! ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తోన్న పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం ఈ మేరకు కొత్త కూటమి విధివిధానాలపై చర్చిస్తున్నట్లు ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థ బుధవారం ఒక రిపోర్టును ప్రచురించింది.
పాకిస్థాన్ పార్లమెంటరీ బృందంలో సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ సయీద్.. మంగళవారం అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ సౌత్ ఏసియా అలయెన్స్ ఏర్పాటు ప్రయత్నాలు నిజమేనని ధృవీకరించారు. 'నిజానికి ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ ఆయా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన సహకార ఒప్పందాలేవీ లేవు. గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయెన్స్ ఏర్పాటుతో అన్ని సభ్యదేశాలు అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. భారత్ ను కూడా కూటమిలోకి ఆహ్వానిస్తాం.. కానీ వాళ్లు చేరకపోవచ్చు' అని ముషాహిద్ హుస్సేన్ అన్నారు. సార్క్లో తన ఆధిపత్యం కొనసాగుతుండగా.. భారత్ కొత్త కూటమిలోకి చేరకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
మరి కొద్ది రోజుల్లో (నవంబర్ లో) ఇస్లామాబాద్ వేదికగా జరాగాల్సిఉన్న 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే తామీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర సభ్యదేశాలైన బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు సైతం భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలను బహిష్కరించారు. దీంతో పాక్ దక్షిణాసియాలో ఒంటరైపోయింది. తన మిత్రులైన చైనా, ఇరాన్ లతో గ్రేటర్ అలయెన్స్ ఏర్పాటుచేసి తన మళ్లీ అందరితో కలవాలని పాక్ ప్రయత్నిస్తోంది. కాగా, ఒక్క అఫ్ఘానిస్థాన్ కు తప్ప సార్క్ లోని ఏ దేశానికి ఈ కొత్త కూటమి వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదు. కాబట్టి అవేవీ పాక్ కూటమిలో చేరే అవకాశం లేదు. అఫ్ఘానిస్థాన్ ఉన్నదే మధ్య ఆసియాలో కాబట్టి ఆర్థిక ప్రయోజనాల రీత్యా అటువైపు మొగ్గుచూపొచ్చు. అప్పుడు కూడా భారత్ సూచనలమేరకే అఫ్ఘాన్ నడుచుకుంటుందని పాక్ మీడియా రిపోర్టులో పేర్కొన్నారు.
పాకిస్థాన్ కొత్త ఎత్తుగడ
Published Wed, Oct 12 2016 3:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement