- హస్తినలో హీటెక్కిన రాజకీయం
- రాష్ట్రపతి ఎన్నికల కోసం మెట్టుదిగిన అధికారపక్షం
- కాంగ్రెస్ అధినేత్రిని కలిసి మద్దతు కోరనున్న బీజేపీ కమిటీ
- సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీతోనూ మంతనాలు
- పరిణామాలపై ఉమ్మడిగా చర్చించిన విపక్షాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇన్నాళ్లూ ఏకపక్షంగా వ్యవహరించిన బీజేపీ.. తొలిసారి దిగివచ్చింది. విపక్షాల మద్దతు కూడా కూడగట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే బీజేపీ త్రిసభ్య కమిటీ నేడో రేపో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెంతకువెళ్లి మద్దతు కోరనుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకుగానూ బీజేపీ ఏర్పాటుచేసిన కమిటీలోని సభ్యులు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్సింగ్లు సోనియా గాంధీని కలవనున్నట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. అటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా బీజేపీ కమిటీ కలవనుంది.
మరోవైపు శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), మాయవతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లతోనూ బీజేపీ కమిటీ ఇప్పటికే మంతనాలు జరిపింది. ఎన్సీపీ కీలక నేత ప్రఫుల్ల పటేల్, బీఎస్పీ నాయకుడు సతీశ్ మిశ్రాలతో వెంకయ్య, రాజ్నాథ్లు జరిపిన చర్చలు ఫలించినట్లు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికలకు నేడు (జూన్ 14న) నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అన్ని పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాతే ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించనుంది.
విపక్షాల దూకుడు
ఒకవైపు బీజేపీ త్రిసభ్య కమిటీ సోనియా, సీతారాం ఏచూరిలతో చర్చలకు సిద్ధమైన వేళ.. విపక్షపార్టీలు కీలక చర్చలు జరిపాయి. పార్లమెంట్ ఆవరణలో జరిగిన భేటీకి కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీ ఒబ్రెయిన్, పీఎంకే నుంచి అన్బుమణి రాందాస్, సమాజ్వాదీ పార్టీ నుంచి రాంగోపాల్ యాదవ్ తదితర నాయకులు హాజరయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయా?లేక బీజేపీ దిగొచ్చినందున ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలుపుతాయా? తేలాల్సిఉంది.
సోనియా చెంతకు బీజేపీ కీలక నేతలు
Published Wed, Jun 14 2017 4:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement