-
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్లు ఈసారి బరిలో దిగారు. పుతిన్ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్దిన్ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్కోవ్, ఖరిటోనోవ్లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA presidential election 2024: ట్రంప్కు షాక్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి షాక్ తగిలింది. 2024 నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్ హిల్పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్ 3) ప్రకారం ట్రంప్ను దోషిగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్ పార్టీ నిరాకరించింది. వివేక్ రామస్వామి అండ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్లో ఇంజినీర్గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement