సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి 14 కారణాలున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. పార్టీ పరాజయం, భావి కార్యాచరణపై సోమవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ నేతలు సమీక్షించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్సింగ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, జైరాం రమేశ్, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, డొక్కా మాణిక్యప్రసాద్ తదితరులు ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.
జూన్ 17న విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థులు పార్టీ పరాజయంపై, భవిష్యత్తు కార్యాచరణపై చేసిన విశ్లేషణలను క్రోడీకరించి ఒక నివేదికను ఏపీసీసీ అధ్యక్షుడు అందించగా.. వాటన్నింటిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ పాలన, అధిక ధరలు, ఆధార్ను గ్యాస్కు అనుసంధానం చేయడంవంటి కారణాలవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి రహస్య ఎజెండాతో పనిచేయడం, ఢిల్లీ పరిశీలకుల వ్యాఖ్యలు, పార్టీకి రాజీనామా చేసిన నేతల తీవ్ర విమర్శలు పరాజయానికి కారణాలని పేర్కొన్నారు. కాంగ్రెస్కు మీడియా మద్దతు లేకపోవడం కూడా మరో కారణమని చెప్పారు. పార్టీని అన్ని స్థాయిల్లో పునర్నిర్మించుకోవాలని, సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవాలని 16 భవిష్యత్ కార్యాచరణ సూత్రాలను సూచించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం రఘువీరా ఆయా వివరాలు మీడియాకు వెల్లడించారు. జులైలోగా మండల స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేసి.. ఆయా కమిటీల ప్రతినిధులతో ఆగస్టు 2వ వారంలో రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు. తొలి రోజు సమావేశానికి సోనియాగాంధీ, మలి రోజు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారని వివరించారు.
ఓటమికి 14 కారణాలు
Published Tue, Jun 24 2014 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement