వరంగల్ : పాలన, పథకాల అమలులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎవరూర సాటిరారని ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. శుక్రవారం వరంగల్లో హరీశ్రావు లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు దిక్సూచి వంటిందని ఆయన అభివర్ణించారు.
మూడేళ్లలో రహదారులు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని... అయినా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హరీశ్రావు స్పష్టం చేశారు.