ఏఐపీఎంటీ గడువు పెంచిన సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

ఏఐపీఎంటీ గడువు పెంచిన సుప్రీంకోర్టు

Published Fri, Jun 19 2015 12:08 PM

ఏఐపీఎంటీ గడువు పెంచిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: జాతీయ ప్రిమెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)-2015 మళ్లీ నిర్వహించేందుకు సీబీఎస్ఈకి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఆగస్టు 17న పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. దీంతో పరీక్ష నిర్వహించుకునేందుకు సీబీఎస్ఈకి దాదాపు రెండు నెలల గడువు ఇచ్చినట్టైంది.

మే3 న నిర్వహించిన ఏఐపీఎంటీ-2015 ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈనెల 15న ఆదేశాలిచ్చింది. ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం పరీక్ష రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్ కు నాలుగువారాల గడువిచ్చింది. అయితే ఈ గడువు సరిపోదని సీబీఎస్ఈ విన్నవించడంతో గడువు పొడిగించింది.

Advertisement
Advertisement