ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి టీడీపీ నేతలు రోజుకో ప్రకటనతో అయోమయం సృష్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు. ఈనెల 10 వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, రఘురాంలు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ మేకపాటి.. కేంద్రంలో భాగస్వామ్యమైన టీడీపీ వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.
టీడీపీ నేతలు రోజుకో ప్రకటనతో రాష్ట్రంలో అయోమయం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసమే వైఎస్ జగన్ ధర్నా చేపడుతున్నారని.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, నిధులు వస్తాయని మేకపాటి స్పష్టం చేశారు.