ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు.
సిటీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకానే కాదు... 24 గంటలూ పనిచేసే కంపెనీలు అనేకం వచ్చేశారుు. థ్యాంక్స్ టు ఐటీ రెవల్యూషన్. హైదరాబాద్కి రాత్రి జీవితాన్నిచ్చినందుకు. రామ్ బండి ని పరిచయం చేసినందుకు. కాల్ సెంటర్స్, బీపీవో... తదితర ఉద్యోగాలు చేసేవారు తెలతెల వారుతుండగా విధులకు వీడ్కోలు పలుకుతూ ఇంటి దారి పడతారు. వెళుతున్నపుడు వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసం తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా మాత్రమే పనిచేసే రామ్కీ బండి ఓ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ జాయింట్.
రాత్రి విధులు అలవాటే కాబట్టి... తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో ఫుడ్ కోసం నాంపల్లిలోని, మొజంజాహీ మార్కెట్ సమీపంలో, కరాచీ బేకరీ ఎదురుగా ఉన్న రామ్ కీ బండి దగ్గర ఆగాం. విపరీతమైన రద్దీతో ఉండే ఏరియా ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉందంటే... ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు. సిటీలో పాపులర్ రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ ఉన్నా... రామ్కీ బండికి అంత పేరెందుకు వచ్చిందో... అక్కడ దోసె రుచి చూశాక నాకూ తెలిసింది.
అక్కడి గుంపులో కొందరేమో పెద్ద గొంతుతో మసాలా దోసె, ఇడ్లీ అంటూ ఆర్డర్లు ఇస్తుంటే మరికొందరు నుంచునే తింటూ ముచ్చట్లతో పాటు ఫుడ్ని ఆస్వాదిస్తున్నారు. చీజ్ దోసెలు, ఇడ్లీలు, ఉప్మా కమ్ దోసె... వంటివి అక్కడ బాగా ఫేమస్ అని నాకు వాటి డిమాండ్ చూశాక అర్థమైంది. చుట్టూ ఉన్న పరిసరాలు అంత గొప్పగా లేకపోయినా... చీజ్ దోసెను నాకు శుభ్రమైన ప్లేట్లలో సర్వ్ చేస్తూ... ‘క్వాలిటీ, టేస్ట్... ఈ రెండింటికే ప్రాధాన్యమిస్తూ బండి నడిపిస్తున్నా’ అన్నాడు రామ్. మా ఫ్రెండ్సందరం అక్కడున్న అరడజను రకాల దోసెలు తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నారుు. వాటిలో కలుపుతున్న ముడిసరుకు నాణ్యమైంది. చట్నీలు కూడా దోసెలకు చాలా చక్కగా నప్పాయి. ఇకపై మొజంజాహీ మార్కెట్ వైపు వెళితే... రామ్కీ బండి దగ్గర నా బైక్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది.
- శిరీష చల్లపల్లి
Breadcrumb
Related news
-
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
వీరి నినాదం.. ప్రకృతి దేవోభవ
పండ్లతోట.. పూలబాట రాయదుర్గం: మన సిటీలో ఇంటి వెనుక కాస్త స్థలం ఉంటే అందులో రెండు గదుల ఇల్లు కట్టి అద్దెకిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. కానీ పచ్చని చెట్లు ఉంటే అదే పెద్ద ఆస్తి అని భావించారాయన. అందుకే పెరట్లోనే పండ్లు, పూల మొక్కలను పెంచుతూ పన్నెండేళ్ల క్రితమే హరితహారానికి శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ ఉద్యోగి అనంతయ్య. గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి తండాలో నివసించే ఈయన తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూలు, పండ్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెద్దవై ఇంటి మొత్తాన్ని కప్పేసి.. చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని, పూలు, పండ్లను ఇస్తున్నాయి. ఇంటి పెరట్లో మామిడి, సపోటా, ఆల్ బుకార్, బొప్పాయి, సీతాఫలం, పనస, జామ చెట్లున్నాయి. వీటితో పాటు పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. అనంతయ్య కుమారులు శివకుమార్, చంద్రశేఖర్ కూడా వీటి సంరక్షణలో పాలుపంచుకుంటూ.. సీజన్ల వారీగా ఆయా మొక్కలను నుంచి వచ్చే పండ్లను ఆస్వాదిస్తారు. ఉపాధి వేటలో పెరుగుతున్న వలసలు.. ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఊపిరి సలపనంతగా కిక్కిరిసిపోతున్న పట్టణాలు.. ఉన్న అడవులను నరికేసి మౌలిక సదుపాయాల కల్పన. జనం పెరుగుతున్నారని భూమి విస్తీర్ణం పెరగదు కదా..! పచ్చని వనాలు కనుమరుగైపోయి.. కాంక్రీట్ భవంతులు భూతాల్లా భయపెడుతున్నాయి. కాలుష్యపు కోరలు చాస్తూ కర్మాగారాలు జీవన ప్రమాణాలను కాలరాస్తున్నాయి. కరెన్సీ కట్టల లెక్క సరిపోక.. పెరట్లో మొక్కలు పీకేసి.. ఇరుకు గదుల్లో ఆదాయం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు ప్రాణవాయువును సైతం కొనుక్కునే పరిస్థితి. దేహం రోగాల పుట్టగా మారిపోయింది. ‘చెట్టు’ తోడు లేకే కదా ఇన్ని అనర్థాలు..!! అందుకే పచ్చని హారం నిర్మాణ ం కోసం కొందరు పరితపిస్తున్నారు. భాగ్యనగరి సౌభాగ్యం వనాలతోనే ఉందని తమ చుట్టూ నందనవనాలు సృష్టిస్తున్నారు. ప్రకృతి రక్షణే పరమావధిగా.. జూబ్లిహిల్స్: ఇప్పటికైనా చెట్లను నరకడం ఆపేయాలి. లక్షల సంఖ్యలో మొక్కలు నాటి చెట్లుగా చూడాలి. పర్యావరణాన్ని ప్రాణంలా కాపాడాలి.. ఇదీ సాప్ట్వేర్ ఇంజినీర్ జయప్రకాశ్ నంబూరు స్వప్నం. ఈ స్వప్నాన్ని ఆచరణలో పెట్టేందుకు ఆరేళ్ల కిందట ఆయన నడుంబిగించారు. ఐదంకెల జీతాన్ని, అందమైన జీవితాన్ని వదిలేసి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన జయప్రకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో పలు ఉద్యోగాలు చేశారు. ఆ దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గమనించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చేసి పర్యావరణ పరిరక్షణకే అంకితమయ్యారు. ఇందుకోసం ‘ఐ గోగ్రీన్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఠీఠీఠీ.జీజౌజట్ఛ్ఛజౌఠఛ్చ్టీజీౌ.ౌటజ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. విసృ్తత స్థాయిలో పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలను ఎంపిక చేసుకొని నీరు, విద్యుత్ ఆదా, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశాలను పాఠశాల, ఇళ్లల్లో అమలు చేసేలా వారిని ఒప్పిస్తున్నారు. రోటరీక్లబ్ సహకారంతో పలు జిల్లాల్లోని 200కు పైగా రోటరీ భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించారు. విస్తృతంగా మొక్కలు నాటించారు. ‘పర్యావరణ చైతన్య రథం’ పేరుతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా చెట్లను నరికేస్తున్నట్టు గుర్తిస్తే 1800 4255364 (టోల్ ఫ్రీ) నంబర్కు సమాచార ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడన్నా చెట్లు తొలగిస్తుంటే వాటిని మరోచోట నాటుతున్నారు. కాలనీలు, డంపింగ్ యార్డ్ల్లో చెత్తను తగలబెడుతుంటే అడ్డుకునేందుకు ఓ ప్రత్యేక కార్యకర్తల బృందాన్ని నియమించారు. అంతేగాకుండా 040- 21111111 నెంబర్కు ఎవరన్నా ఫోన్ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ‘దేశంలోని వంద కోట్ల మందిలో ప్రతి ఒక్కరు చిన్న పర్యావరణ అనుకూల పనిచేసినా దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. ఒక్క మొక్కను నాటినా అది మహా వృక్షమై మనకు ఎంతో మేలు చేస్తుంది’ అని చెబుతున్నారు జయప్రకాష్. ‘చిగురించిన’ ఆదర్శం బంజారాహిల్స్: ఇంటి నిర్మాణానికి అడ్డు వస్తుందని చెట్లు నరికేస్తారు. ఇంటి ప్రహరీకి పగుళ్లు వస్తాయని గోడ పక్కన చెట్లను సైతం తొలగించే వారూ ఉన్నారు. చెట్టు నరికేస్తుంటే మనకెందుకులే.. అని పట్టించుకోనివారికీ నగరంలో కొదవలేదు. అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నివాసితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడివారు పచ్చదనం అంటే ప్రాణం పెడతారు. ఎక్కడో చెట్లను కొట్టేస్తున్నారని తెలుసుకుని ఆ చెట్లను తలా కొంత డబ్బు పోగు చేసి కొనుగోలు చేశారు. తమ అపార్ట్మెంట్ ఆవరణలో అప్పటికే ఉన్న వందలాది చెట్లతో స్థలం లేకపోతే ఎదురుగా ఉన్న రోడ్డులో వాటిని తెచ్చి నాటుకున్నారు. మెట్రోరైలు పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న భారీ చెట్లను జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫార్చూన్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉన్న 43 కుటుంబాలు చెట్టు ప్రాముఖ్యం తెలుసు కాబట్టి వాటి రక్షణకు నడుం బిగించారు. నివాసితులంతా తలా కొంత డబ్బు పోగుచేసి తొలగించే చెట్లను ట్రీ రీలొకేట్ పద్ధతిలో తీసుకొచ్చి నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు రూ. 10 వేలకు పైగా ఖర్చు చేశారు. ఈ చెట్లను అపార్ట్మెంట్ ఎదురు మార్గంలో నాటి వదిలేయలేదు.. అవి చక్కగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం నీళ్లు పోయడం, ఎరువు వేయడం వంటివి చేశారు. తలా ఒక రోజు చొప్పున చెట్టు రక్షణకు నిఘా ఉంచారు. ప్రస్తుతం అవి పచ్చగా ఎదిగి నీడనిస్తున్నాయి. పచ్చందాల కాలనీ.. శేరిలింగంపల్లి: పచ్చదనంతో ఆ కాలనీ కళకళలాడుతోంది. దీని సంరక్షణ కోసం స్థానికులు నిత్యం కొంత సమయం వెచ్చిస్తారు. కాలనీ చిన్నదే అయినా ఎటుచూసినా పచ్చదనమే. పక్షుల కిలకిల రావాలతో ఉదయం, సాయంత్రం సమయాల్లో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్-2 కాలనీ. ఇక్కడ నివసించే వారంతా విద్యాధికులు కావడంతో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ఇక్కడ 30 వేలకు పైగా మొక్కలు, చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. కాలనీ ప్రధాన గేటు లోపల భాగంలో వేప, మామిడి, జామ, సపోటా, మల్లె, ఉసిరి, టేకు, అశోక, పనస చెట్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఎగ్జోరా, అలమండ, జాత్రోపా సింగపూర్ ఎగ్జోరా, ఎల్కోనియా, స్వాతి పైలం, నైట్క్వీన్, ముసుండ తదితర మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏటా వీరు ‘ప్రకృతి దేవోభవ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ‘మా కాలనీలో పచ్చదనానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. వేసవిలో మిగతా కాలనీలతో పోలిస్తే ఇక్కడ రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంద’ని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే తెలిపారు. తమ కాలనీలో పచ్చదనంతో పాటు ఇంకుడు గుంతలను తవ్వించడం వల్ల నీటి సమస్య కూడా లేదని, సీవరేజ్ నీటిని శుద్ధి చేసి గ్రీనరీకి వినియోగిస్తున్నామని కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాంమూర్తి తెలిపారు. అతిథులకు మొక్కలు.. ఉప్పల్ : పచ్చదనమన్నా.. పక్షులన్నా ఆయనకు పంచ ప్రాణాలు. దీంతో తన ఇంటిని రకరకాల మొక్కలతో నింపి నందనవనంగా తీర్చిదిద్దారు. దీనిలో 40 రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆవాసం ఏర్పరచుకున్నాయి. కర్ణాటకలోని కార్వార్ ప్రాంతానికి చెందిన ఎన్ఎఫ్సీ రిటైర్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సావంత్.. హబ్సిగూడ స్నేహనగర్ వీధి నెంబర్-8లో నివాసం ఉంటున్నారు. 1980లో ఇల్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. ఉదయం 6 అయ్యిందంటే చాలు వేలాది పావురాలు సావంత్ అందించే ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. మొక్కలను పెంచడమే కాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు వాటి ప్రాముఖ్యతను వివరించి మొక్కలను పంచడం ఇతని హాబీ. -
పెట్స్తో జాగ్రత్త సుమా..!
కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు.. ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు. తమ ఆసక్తిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను సంరక్షిస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్గా కూడా మారిపోయాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీటిని విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఎంత ఖరీదైన జంతువైనా సరే పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వెటర్నరీ వైద్యులు. పెట్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో కనీస అవగాహన అవసరమంటున్నారు. - రాజేంద్రనగర్ / సాక్షి, సిటీబ్యూరో జునోసిస్ అంటే.. జంతువులకు వాటి నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయి పాశ్చర్ 1885 జులై 6న యాంటీ రేబిస్ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్ డేగా కూడా వ్యవహరిస్తుంటారు. అవగాహన అవసరం.. పెంపుడు జంతువులకు వేసే వాక్సినేషన్పై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది ఖర్చుతో కూడిందని పట్టించుకోరు. పెట్స్కు మాములుగా కరిచే గుణం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని రకాల పెట్స్కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషికి, జంతువుకు ఉండే కాంటాక్ట్లో అది కరవడం, గీరటం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. క్యాట్స్, ర్యాబిట్స్ లాంటివి పెంచుతున్నవారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. మా సంస్థ తరపునవ్యాక్సినేషన్ అవసరంపై అవగాహన చెపడుతున్నాం. వ్యాక్సిన్ వేయించడం పెట్కి మాత్రమే కాదు.. పెట్ ఓనర్స్, వారి చుట్టూ ఉన్నవారి రక్షణకు సంబంధించిన విషయం. - నిహార్, ఏఆర్పీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వైద్య సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను ‘జునాటిక్ డిసీజెస్’ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, ఆంత్రాక్స్.. వంటివి జునాటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల ఆరోగ్యం, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో, వాటి యజమానులు వారి హెల్త్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యంగా ఇంట్లో డాగ్స్ ఉన్నవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సిటీలో కుక్కలు, పిల్లులు తర్వాత పక్షులను పెంచుతున్నారు. వీటి వల్ల లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాటిని నివారించేందుకు పక్షులకు సంబంధించిన వాటర్ వ్యాక్సిన్స్ ఇప్పించాలి. వైల్డ్ లైఫ్ యానిమల్స్, పెట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి. - డాక్టర్ మురళీధర్, డాక్టర్ డాగ్ హాస్పిటల్స్ పెట్స్ను పిల్లల్లా చూడాలి.. నాకు మూడేళ్ల బాబు. హ్యాపీ, డాలర్, డ్యూక్ పెట్స్ (డాగ్స్) ఉన్నాయి. డాగ్స్తో పిల్లలకు ఇన్ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదు. సాధారణంగా ఆరు నెలలకు ఓసారి డాగ్స్కి పొట్ట క్లీన్ కావడానికి డీవార్మింగ్ చేస్తారు. అయితే, వీధి కుక్కలకు ఇలాంటిది లేకుండా బాగానే ఉంటాయి. నేను డీవార్మింగ్కి నాచురల్ రెమిడీస్, హోమియోపతి మందులు ఇస్తుంటా. నెలకోసారి పంప్కిన్, సన్ఫ్లవర్, తర్బూజా వంటి డ్రై గింజలు మిక్స్ చేసి ఇస్తుంటా. నా పెట్స్ హెల్దీగా ఉన్నాయి. పెట్స్కి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. సోయా, చికెన్, వెజిటేబుల్స్, ఎగ్, రైస్, యాపిల్ ఇలా అన్నీ వేసి వండుతాను. కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఉండేలా చూస్తా. వాటికి రెగ్యులర్గా బ్రష్, కోంబింగ్, మంత్లీ బాత్ తప్పనిసరి. బాత్ చేసిన తర్వాత బాగా తుడవాలి. తడిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. - సౌమ్య, పెట్లవర్ ఒత్తిడి మాయం.. చదువుకునేటప్పుడు నా దగ్గర డాగీస్ ఉండేవి. జాబ్లోకి వచ్చాక ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్నా. ఆరు నెలల క్రితం బర్త్డే గిఫ్ట్గా బెర్రీ(డాగ్) నా దగ్గరకు వచ్చాడు. మొదటి మూడు నెలలు వరుసగా వ్యాక్సిన్ వేయించాను. తర్వాత వన్ ఇయర్కి ఒకటి. డాగ్స్కి జనరల్గా వామ్స్ వస్తుంటాయి. సిరప్, పౌడర్ వంటి మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక బెర్రీతో కాసేపు ఆడుకుంటే ఒత్తిడి మొత్తం పోతుంది. వ్యాక్సిన్కి వెళ్లినప్పుడు డాక్టర్.. ఫుడ్, మెడికల్, బాతింగ్ ఎలా ఉండాలో చెప్పారు. పెట్స్కు కిడ్స్లా కేర్తో పాటు వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. - స్వాతి, పెట్ లవర్ పెంపుడు శునకాలకు ఉచిత వ్యాక్సిన్ నేడు ‘ప్రపంచ జునోసిస్ డే’ను పురస్కరించుకుని సోమవారం నారాయణగూడలోని ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ భగవాన్ రెడ్డి తెలిపారు. పంపుడు శునకాల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కూకట్పల్లిలో.. కూకట్పల్లిలో బీజేపీ కార్యాలయం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో నేడు కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్టు డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని, ఈ అవకాశాన్ని పెట్ లవర్స్ వినియోగించుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్లో.. కుత్బుల్లాపూర్ పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ అనిల్ మురారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. వివరాలకు 99127 89456 నెంబర్లో సంప్రదించవచ్చు. మలక్పేటలో.. మలక్పేట పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ ఎం.సబిత తెలిపారు. మలక్పేట గంజ్ ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న పశు వైద్యశాలలో తిరుమల మెడికల్ హాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వివరాలకు 89789 01658 నెంబర్లో సంప్రదించవచ్చు. చాంద్రాయణగుట్టలో చాంద్రాయణగుట్ట పూల్బాగ్లోని నల్లవాగు హిందూ శ్మశానవాటిక ఎదురుగా గల పశు వైద్యశాలలో కుక్కలు, మేకలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు వైద్యం అందిస్తారు. జంతువుల యజమానులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. -
ముందే సినిమా చూపిస్త మామా..
బొమ్మను చేసి.. ప్రాణం పోసి ఎందరికో ప్రాణప్రదంగా మార్చిన రోజుల నుంచి ప్రాణమున్న మనిషి నుంచే బొమ్మను పుట్టించే రోజులొచ్చాయి. వ్యక్తి కదలికల నుంచి యానిమేషన్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడమనే ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతూ.. సినిమాకి ముందు ‘నమూనా’ సినిమాని పుట్టించడానికి సిద్ధమైంది. మరోవైపు మార్కర్లెస్ మోషన్ క్యాప్చరింగ్తో సిటీ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. - తీయబోయే చిత్రాన్ని ముందే చూడొచ్చు - తెరకెక్కబోయే నటులకు ముందే డూప్లు - చిత్ర విచిత్రం.. మార్కర్లెస్ మోషన్ క్యాప్చరింగ్ మార్కర్లెస్లో మనమే ఫస్ట్ సాధారణంగా మోషన్ క్యాప్చరింగ్లో మార్కర్స్ వినియోగిస్తారు. వ్యక్తుల్ని చలింపజేసే కీళ్ల భాగాల్లో, బోన్స్ రొటేషన్ ఉన్న ప్రతి చోటా మార్కర్ పెట్టి వర్చువల్ ఫీల్డ్లో క్యారెక్టర్ని నిలబెట్టి.. కెమెరాతో ఆ సెన్సస్ని క్యాప్చర్ చేస్తారు. దీని కోసం స్పెషల్ సూట్ వేసుకుని శరీరంలో పలు చోట్ల మార్కర్స్ పెట్టుకుంటారు (ఆటల్లో కూడా దీనిని వాడుతున్నారు. ఉదాహరణకి క్రికెట్లో త్రో బౌలింగ్ వస్తుందంటే మోషన్ క్యాప్చర్స్ ద్వారానే పరీక్షిస్తారు) అయితే, ఈ మార్కర్స్, సూట్ ధరించాల్సిన అవసరం లేకుండానే కదలికల్ని క్యాప్చర్ చేసే వినూత్న ప్రక్రియను ఆసియాలోనే ప్రథమంగా నగరంలో అందుబాటులోకి తెచ్చింది క్రియేటివ్ మెంటర్స్. ‘మేం ఉపయోగించే టెక్నాలజీతో మార్కర్స్, సూట్ అవసరం లేకుండానే ఇన్స్టంట్గా మోషన్ క్యాప్చరింగ్ చేస్తాం. ఈ టెక్నాలజీని అమెరికన్ ఆర్మీ కోసం వినియోగిస్తారు. ఆసియాలోనే మార్కర్ లెస్ శైలి ఫస్ట్ టైమ్. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. దాదాపు రూ.20 వేల ఖరీదుండే సూట్లు, అలాగే మార్కర్స్, ట్రాకర్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు’ అంటున్నారు మాదాపూర్లోని కావూరిహిల్స్లో ఉన్న క్రియేటివ్ మెంటర్స్ నిర్వాహకులు. ‘మోషన్ క్యాప్చరింగ్’ అనే సాంకేతిక అద్భుతం.. హాలీవుడ్ ‘అవతార్’, తమిళ సినిమా ‘కొచ్చాడియాన్’ తర్వాత క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో నటులకు మాత్రమే కాదు.. సినిమాకి కూడా డూప్ని సైతం సృష్టిస్తోంది. యానిమేషన్ ప్రక్రియ అనేది పేపర్ పెన్సిల్ నుంచి మొదలై.. గేమింగ్, సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. దాని మీడియం మార్పు చేర్పులకు గురవుతూ సాఫ్ట్వేర్కి చేరుకుని 2డీ, 3డీ యానిమేషన్ సాఫ్ట్వేర్ సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఆ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం పరిచయమైంది ఈ మోషన్ క్యాప్చరింగ్. బొమ్మని చేసి దానికి నడకలు నేర్పి నటింపజేసే బదులు, నిజమైన నటుడి అభినయాన్ని కెమెరా ద్వారా క్యాప్చరింగ్ చేసి యానిమేటెడ్ క్యారెక్టర్గా యూజ్ చేసే ఈ ప్రక్రియ ఇప్పుడు సినిమాల ప్రీ విజువలైజేషన్కు సరికొత్త మార్గంగా మారింది. ‘నమూనా’ సినిమా.. స్కెచ్లు, బొమ్మల సహితంగా సినిమా స్టోరీ బోర్డ్ తయారు చేయడం రూపకర్తలకు అలవాటే. దీని ద్వారా తీయబోయే సినిమా మీద యూనిట్కు అవగాహన కల్పిస్తారు. ఈ స్టోరీబోర్డ్ పూర్తిగా మాన్యువల్. అయితే మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ పుణ్యమాని ఇప్పుడు ఏకంగా ‘అడ్వాన్స్డ్ ప్రీ విజువలైజేషన్ మూవీ’ అందుబాటులోకి వచ్చేసింది. ఈ ప్రక్రియ ద్వారా తీసే చిత్రం మొత్తాన్ని ముందే కళ్లకు కట్టినట్టు విజువలైజ్ చేయవచ్చు. కథకు అనుగుణంగా నటులను వినియోగించి వారి కదలికల ద్వారా యానిమేటెడ్ క్యారెక్టర్స్ని సృష్టిస్తూ షూటింగ్ తరహాలోనే ఈ విజువలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సినిమా మొత్తం ‘ప్రీ విజువలైజ్’ చేయించుకుంటే డెరైక్టర్ సెట్స్కి కూడా వెళ్లక్కర్లేదు. దీని వల్ల ప్రొడ్యూసర్కి సరైన బడ్జెట్ అంచనా వీలవుతుంది. పెద్ద హీరోని, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలన్నా.. కథ మీద నమ్మకం ఉన్న డెరైక్టర్, స్టోరీ రైటర్లు ఈ డూప్ మూవీ తయారు చేయించుకొంటున్నారు. సాంగ్స్ ఉండని ఈ డూప్ మూవీ సుమారు 90 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా కంపోజ్ చేస్తారు. సుమారు 45 రోజులు సమయం పడుతుంది. దీనికి కనీసం రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని యానిమేషన్ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అయితే ఒక పెద్ద హీరో చిత్రం సగటు వ్యయం రూ.25 కోట్లు అనుకుంటే, ఈ ప్రీ విజువలైజేషన్ వల్ల ఆదా అయ్యే వేస్టేజ్తో పోల్చుకుంటే ఈ వ్యయం ఎక్కువేం కాదంటున్నారు నిపుణులు. మొత్తం సినిమా లేదా కొన్ని ప్రధానమైన యాక్షన్ సీన్స్ మాత్రమే తీయవచ్చు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలకు ఈ తరహాలోనే ప్రీ విజువలైజేషన్ చేసినట్టు సమాచారం. ‘నమూనా’ నటులకు డిమాండ్. పూర్తిస్థాయి మూవీ మేకింగ్, గేమింగ్ ఇండస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ, ప్రీ విజువలైజేషన్, మెడికల్ -స్పోర్స్ సైన్స్ ఫీల్డ్లో కూడా ఈ మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. దాంతో దీని కోసం నటీనటుల అవసరం ఏర్పడుతోంది. అయితే యానిమేషన్ క్యారెక్టర్కు కొంతయినా వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ నప్పాలి. అలాగే నటన కూడా వచ్చి ఉండాలి. ఇలా నటించేవాళ్లకి మంచి రెమ్యునరేషన్ కూడా అందుతోంది. మార్కర్లెస్తో మ్యాజిక్.. నగరంలోని సిట్ అండ్ మల్టీ మీడియాతో అసోసియేట్ అయి యానిమేషన్ రంగంలో గేమింగ్ డిజైన్ చేస్తున్నాం. జేఎన్ఏ ఎఫ్ఎల్ సర్టిఫికేషన్తో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ఇప్పటికీ ఇండియాలో కేవలం నాలుగైదు సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. అయితే మేం అందిస్తున్న మార్కర్ లెస్ మోషన్ క్యాప్చరింగ్ మాత్రం ఆసియాలో మరెక్కడా లేదు. మూవీ ప్రీ విజువలైజేషన్కి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాదు దీని ద్వారా గేమ్స్, యానిమేషన్ కంటెంట్ను డొమెస్టిక్ మార్కెట్కి సప్లయ్ చేయవచ్చు. - కె. సురేష్రెడ్డి. క్రియేటివ్ మెంటర్స్ -
గుబాళించే కాలం..
అత్తరు పరిమళం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మల్లెపూలు, గులాబీరేకులు, గంధపు చెక్కలు, మొగలిపువ్వుల ఆవిరే అసలైన అత్తర్. ఎంతకాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నగరజీవన శైలిలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. విశాఖ-కల్చరల్ : సెంట్ ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసనను వెదజల్లుతుంది. నకిలీలదైతే కొంతకాలంలోనే వాసనలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. వీటిని తోలుతో చేసిన కుప్పిలలో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి రవాణా చేస్తారు. పురాతన కాలంలో కొంతమంది తమకు నచ్చిన అత్తరులను తయారు చేయించి, పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకునేవారు. అవి చాలాకాలం పాటు నిల్వ ఉండేవి. వీడని పరిమళం జన్నతుల్ పిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయట్, హౌప్, బఖూర్, మొఖల్లత్, ఇత్రేఫిల్, షమామతుల్, అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్ఊద్, రోజ్, కచ్చికలి అత్తరుల్లో ముఖ్యమైనవి. కృత్రిమంగా తయారు చేసేవి ఎన్ని ఉన్నా...పెట్టిన మరుక్షణమే వాసన పోయేవి ఉన్నాయి. అసలుసిసలైన అత్తరు అంటే ఒక్కసారి పూసుకున్నాక రెండు, మూడుసార్లు దుస్తులు ఉతికినా దాని పరిమిళం మాత్రం పోదు. రూ.10 నుంచి...రూ.వేల వరకూ.. సిటీలో డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, వన్ఏరియా, ద్వారకానగర్, పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, మరికొన్ని కార్పొరేట్ షాపింగ్మాల్స్లోనూ లభిస్తున్నాయి. అత్తరుకే ప్రత్యేకమైన దుకాణాల్లో లభ్యమయ్యేవి మరింత భిన్నం. అరబ్బులు ఇష్టపడే దహనల్ఊద్ పది మి.లి.లకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు ఉన్నాయి. షమామతుర్ అంబర్, హీన వంటి 10మి.లి.ధర రూ.600, కచ్చికలి పదిగ్రాములు రూ.80, జన్నతుల్ ఫిర్దౌస్ పదిగ్రాముల రూ.120 ఉన్నాయి. సీజన్ వారీగా... సిటీలో సీజనల్వారీగా సెంట్స్ను వినియోగిస్తున్నారు. సాధారణంగా అన్ని రకాల అత్తరులను నిత్యం వినియోగించట్లేదు. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూసినా, వాసన పీల్చినా అనర్థాలు కలిగే అవకాశం ఉండడంతో సీజన్ బట్టి సెంట్ వెరైటీని వినియోగించడం పరిపాటి. వేసవిలో ఖస్, ఇత్రేఫిల్ చాలా మంచివి. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేఫల్ మట్టివాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం, చలిలో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, మిష్క్, దహనుల్ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. దుబాయ్ నుంచి దిగుమతి... సీజన్ బట్టి రకరకాల సెంట్స్ దుబాయి, ఖత్తర్ వంటి దేశాల నుంచి నగరానికి దిగుమతి అవుతాయి. మనదేశంలో ఉత్తరప్రదేశ్లోని ఖన్నోజ్ ప్రాంతం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్టు హోల్సేల్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. సాధారణంగా వాడే సెంట్స్ ఇతర దేశాలతోపాటు బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి విశాఖకు వస్తున్నాయి.. అల్యూమినియం డాబ్బాలను రవాణాకు వినియోగిస్తున్నారు. గాజుపాత్రలు మంచివే అయినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అల్యూమినియం పాత్రల్లో తీసుకు వచ్చి ఇక్కడ గాజుపాత్రల్లో, సీసాల్లో నింపి బోటలింగ్ చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం మాది షాదీనగర్. మా బాబా సమయంలో ఇక్కడకు వచ్చేశా. 40 ఏళ్ల నుంచి ఇత్తరు వ్యాపారం చేస్తున్నాం. ముఖ్యంగా సూఫిబ్రాండ్ అత్తరులను ఎక్కువగా విక్రయిస్తున్నాం. దుబాయ్, ఖత్తరు, మలేసియా, సింగపూర్, విదేశాల నుంచి హోల్సేల్గా తీసుకు వస్తుంటాం. రంజన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఐదు జిల్లాలకు హోల్సేల్గా విక్రయిస్తుంటాం. - మహ్మద్ తుగ్లాక్ ఇమ్రాన్ఖాన్, జగదాంబ జంక్షన్
Related News by category
-
అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకో చోటకు...
అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకో చోటకు... రోగులుఅటూ ఇటూ తిరగకుండా అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకేచోట ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టింది. రూ.12.90 కోట్లతో డీఎంఈ ప్లాన్ నిధుల తో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇది కూ డా గత ప్రభుత్వంలోనే మంజూరైనా నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. తిరి గి ఈ ప్రభుత్వంలో పనులను పూర్తయ్యాయి. ఇటీవలే ఇది అందుబాటులోకి రావడంతో అన్ని రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. -
దుంపతెంచిన కలుపు మందులు
అవును.. ఇంగ్లండ్లో శాస్త్రవేత్తలు అటూఇటుగా చెబుతున్నది ఇదే. అక్కడి గోధుమ తదితర ఆహార పంటల్లో బ్లాక్ గ్రాస్ రకం కలుపు పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్ని కలుపుమందులు చల్లినా ఈ గడ్డి మాత్రం చావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్ శాస్త్రవేత్తల సారథ్యంలో రొథమ్స్టెడ్ రీసెర్చ్, జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ నిపుణులు బ్లాక్ గ్రాస్పై కలుపు మందుల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అధ్యయనం చేశారు. ఇంగ్లండ్ నలుచెరగుల నుంచి 70 వ్యవసాయ క్షేత్రాల్లో ఈ గడ్డి అడ్డూఅదుపూ లేకుండా బలిసిపోయిందట. 132 గోధుమ పొలాల నుంచి కలుపు విత్తనాలను సేకరించి పరీక్షించారు. ఫలితాలను చూసి అవాక్కయ్యారు. నమూనాల్లో 80% ఏ రకమైన కలుపు మందులకూ లొంగలేదని రొథమ్స్టెడ్ స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ కార్యక్రమ సారథి, కలుపు నిపుణుడు డా. పాల్ నెవె తెలిపారు. ఈ వివరాలను నేచర్ ఎకాలజీ, ఎవల్యూషన్ పత్రిక ఇటీవల ప్రచురించింది. పూర్వం నుంచే విరివిగా కలుపు రసాయనిక మందులు వాడటం వల్ల బ్లాక్ గ్రాస్ ఇప్పుడు ఏ కలుపు మందు చల్లినా చావని గడ్డు స్థితి వచ్చిందని, ఈ సమస్యను అధిగమించడానికి చేపట్టిన యాజమాన్య చర్యలేవీ ఫలించలేదని డా. పాల్ వివరించారు. కలుపు మందులకు ఎంత ఖర్చు పెట్టినా కలుపు చావలేదని, పంట దిగుబడులు తగ్గి ఆదాయం తగ్గిపోయిందని రైతులు గొల్లుమన్నారు. చాలా ఎక్కువ సార్లు కలుపు మందు చల్లడం.. అనేక రకాల కలుపు మందులు కలిపి చల్లడం లేదా వేర్వేరుగా ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయటం.. ఇవేవీ కలుపును అరికట్టలేకపోగా సమస్యను మరింత జటిలం చేశాయని శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. ఇంకేవో కొత్త రకం మందులు తెచ్చి చల్లినా ఉపయోగం ఉండబోదని, రసాయనిక కలుపు మందుల మీద ఆధారపడటం తగ్గించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఇంగ్లండ్ రైతుల చేదు అనుభవం గ్రహించైనా మన రైతులు ముందు జాగ్రత్త పడాల్సి ఉంది..! కాదంటారా? -
వారంలో 4 రోజులు సొంత కూరగాయలే!
నీత ప్రసాద్.. రెండేళ్లుగా ఇంటి మేడపైనే సేంద్రియ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను మక్కువతో సాగు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ ఘన్రాక్ ఎన్క్లేవ్ సెకండ్ ఫేజ్లో సొంత ఇండిపెండెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. స్వతహాగా బోన్సాయ్, పూల మొక్కలంటే ఆసక్తి చూపే నీత ప్రసాద్.. కొంతకాలం ఐటీ జాబ్ చేశారు. వెన్నునొప్పి కారణంగా ఉద్యోగం వదిలేసి.. సేంద్రియ ఇంటిపంటలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. టెర్రస్పై సుమారు 200 కుండీలు, గ్రోబాగ్స్లో కుటుంబంలో నలుగురికి వారానికి నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలతోపాటు.. 20 రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని ఇంటిపంటలకు వాడుతున్నారు. గోశాలలకు వెళ్లి ఆవు పేడ, మూత్రం తెచ్చుకొని.. ప్రతి 15 రోజులకోసారి స్వయంగా జీవామృతం తయారు చేసుకొని ఇంటిపంటలకు వినియోగించడం.. నగరంలో సహజాహారం సాగుపై ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనంగా చెప్పొచ్చు. అంజూర, జామ, డ్రాగన్ ఫ్రూట్స్, దానిమ్మ, సపోటా.. తదితర రకాల పండ్లు పెద్ద కుండీలు, గ్రోబాగ్స్లో పండిస్తున్నారు. పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర.. టమాటా, వంగ, దొండ, బీర, మిర్చి తదితర కూరగాయలను నీత ప్రసాద్(98490 31713) సాగు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులకు వారంలో కనీసం 4 రోజులకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను మేడపైనే ఆమె శ్రద్ధగా సాగు చేసుకోవడం అభినందనీయం. -
సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్!
సముద్ర తీర ప్రాంతాల్లో రైతులకు తమిళనాడుకు చెందిన వృద్ధ రైతు తిలగర్ (60) ఆచరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. తిలగర్ నాగపట్టినం జిల్లా సిర్కజి తాలూకా కొడంకుడిలో తనకున్న ఎకరం పావు పొలంలో దశాబ్దాలుగా రసాయనిక పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నా.. పెద్దగా నికరాదాయాన్ని కళ్ల జూసిన సందర్భాల్లేవు. బోరు నీటి ఆధారంగానే సేద్యం చేస్తున్న తిలగర్ ఈ నేపథ్యంలో.. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా మెరుగైన నికరాదాయాన్ని పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు దివంగత నమ్మాళ్వార్ చూపిన బాటలో మూడేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ తిలగర్ కుటుంబ సభ్యులే చేసుకుంటారు. చెరువు.. కోళ్ల షెడ్డు.. వరి పొలం.. పావెకరంలో చెరువు తవ్వారు. అది చేపల చెరువు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఎకరం వరి పొలానికి నీరందించే నీటి కుంట కూడా. చెరువులో పూరి పాకను నిర్మించి, చుట్టూ ఇనుప మెష్ ఏర్పాటు చేసి కోళ్ల ఫామ్గా మార్చారు. ఆ కోళ్ల పెంట నేరుగా చెరువు నీటిలోకి పడుతుంది. చెరువు నీటిలో బొచ్చె, బంగారుతీగ వంటి 3 రకాలకు చెందిన వెయ్యి మంచినీటి కార్పు చేప పిల్లలను వదులుతుంటారు. కోళ్ల పెంట వల్ల చెరువు నీటికి చేపలకు అవసరమైన ప్లవకాలను ప్రకృతిసిద్ధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీనికి తోడు అడపా దడపా పంచగవ్యను చల్లుతూ ఉంటారు. కాబట్టి, చేపల కోసం ప్రత్యేకంగా మేత అంటూ ఏమీ వేయడం లేదు. 2016లో సేకరించిన గణాంకాల ప్రకారం.. వెయ్యి చేపపిల్లలను వదిలిన 8 నెలల్లో 600 కిలోల చేపల దిగుబడి వచ్చింది. తిలగర్ ప్రత్యేకత ఏమిటంటే.. చేపలను సజీవంగా తన చెరువు వద్దనే నేరుగా వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. కిలో రూ. 150 చొప్పున.. రూ. 90 వేల ఆదాయం పొందుతున్నారు. చేపల చెరువు నీటితో వరి సాగు చేపల చెరువులోని నీటిని పక్కనే ఉన్న వరి పొలానికి పారిస్తున్నారు. వరి పొలానికి పంచగవ్య తప్ప మరేమీ ఎరువు వేయటం లేదు. ఎకరానికి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి పొందుతున్నారు. తిలగర్ తన పొలం వద్దనే దేశీ ఆవుతోపాటు మేకలు, బాతులను పెంచుతున్నారు. గట్ల మీద కొబ్బరి, మామిడి, జామ చెట్లను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యవసాయం, పశుపోషణ పరస్పర ఆధారితమైనవి కావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడు.. సమీకృత సేంద్రియ సేద్యం ప్రధానంగా చిన్న కమతాలుండి సొంత రెక్కల కష్టంపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు ఆహార, ఆదాయ భద్రత లభిస్తుందనడంలో సందేహం లేదు. సేంద్రియ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నాం జిల్లా కలెక్టర్ పళనిస్వామి స్వయంగా తిలగర్ క్షేత్రాన్ని సందర్శించి అభినందించడంతోపాటు ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. ఇతర రైతులను సైతం సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేయమని అధికారులను ఆదేశించారు. తిలగర్ వ్యవసాయోత్పత్తులకు పీజీఎస్–ఇండియా కింద సేంద్రియ సర్టిఫికేషన్ను అందించబోతున్నాం. – ఆర్. రవిచంద్రన్ (094440 63174, 095007 82105)మత్స్య శాఖ సహాయ సంచాలకుడు,నాగపట్టినం, తమిళనాడు -
అమ్మిన 12 ఎకరాలు..మళ్లీ కొన్నది
రసాయనిక వ్యవసాయంలో నష్టాలపాలై ఉన్న 20 ఎకరాల్లో 12 ఎకరాలను తెగనమ్ముకున్నారు. అంతటి సంక్షోభ కాలంలో పరిచయమైన ప్రకృతి వ్యవసాయం వారి ఇంట సిరులు కురిపిస్తోంది. అమ్మిన ఆ 12 ఎకరాలను తిరిగి కొనుక్కున్నారు.. అవే పంటలు.. అదే పొలం.. మారినది సాగు పద్ధతి మాత్రమే.. రసాయనిక వ్యవసాయం వారిని అప్పుల్లో ముంచింది. ఆ అప్పులు ఉన్న 20 ఎకరాల పొలంలో 12 ఎకరాలను మింగేశాయి. ఇక వ్యవసాయం వద్దే వద్దు.. అనుకుంటున్న తరుణంలో పరిచయం అయిన ప్రకృతి వ్యవసాయం ఈ లావణ్యా రమణారెడ్డి కుటుంబం తలరాత మారిపోయింది. కల నెరవేరింది..! తెగనమ్ముకున్న అదే 12 ఎకరాల భూమిని మళ్లీ తిరిగి కొనుక్కున్నారు. నమ్ముకున్న రైతు కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం దీర్ఘకాలంలో ఎంత మేలు చేస్తుందో లావణ్యా రమణారెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి 16 ఏళ్లుగా ప్రకృతి సేద్యాన్ని లాభదాయకంగా కొనసాగిస్తున్నారు. కళ్లు చెదిరే దిగుబడులు తీస్తున్నారు. కారువంగ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన లావణ్య ప్రజలకు సేవలందిస్తూనే ప్రకృతి వ్యవసాయంపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. రైతులకూ శిక్షణ ఇస్తున్నారు. లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి ప్రతి రోజూ తమ పొలంలో పత్తి, మిరప, ఆముదం,మొక్కజొన్న, వరి లాంటి పంటలను గతంలో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేవారు. అప్పులపాలై 12 ఎకరాలు అమ్ముకున్న తర్వాత వ్యవసాయం మానేద్దామనుకున్న తరుణంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పుస్తకాల్లో చదివి తెలుసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మహారాష్ట్ర వెళ్లి పాలేకర్ను కలుసుకొని.. కొద్దిరోజులపాటు అక్కడే ఉండి శిక్షణ పొందారు. మొదట కేవలం ఒక సెంటు భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2002లో ప్రయోగాత్మకంగా కనకాంబరం తోటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. 2003లో అర ఎకర పొలంలో మిర్చి పంట వేసి ఆరు క్వింటాళ్ల దిగుబడి పొందారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఏడాది ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడిని సాధించారు. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో వరిని సుడిదోమ దెబ్బతీసింది. అయితే, లావణ్య పొలంలో ఎకరానికి 78 బస్తాల(బస్తా 60 కిలోలు) ధాన్యం దిగుబడి వచ్చింది. 3 ఎకరాల్లో మిరప తోట సాగు చేయగా.. ఇప్పటికి పండు మిర్చి 3 కోతల్లో 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా ఎకరానికి 6–7 క్వింటాళ్ల కాయ ఉందని ఆమె తెలిపారు. మిరపలో ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, వేరుశనగ వంటి అంతర పంటలు ఉన్నాయి. అంతరపంటల ద్వారా ఖర్చు తిరిగి వచ్చేస్తే.. ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం అంతా నికరాదాయంగా ఉంటుందన్నది పాలేకర్ వ్యవసాయంలో మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నారు లావణ్యా రమణారెడ్డి దంపతులు. ప్రకృతి సాగే తమకు ఎంతగానో నచ్చిందని, ఖర్చు కూడా బాగా తగ్గిందన్నారు. ఇతర గ్రామాల రైతులు సైతం లావణ్య, రమణారెడ్డి చేపట్టిన ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు. – శ్రీధర్, సాక్షి, నాగర్కర్నూల్, తెలంగాణ వ్యవసాయాన్ని ఉద్యోగంలా భావిస్తేనే లాభాలు! వ్యవసాయాన్ని చాలా మంది రైతులు చాలా తేలికగా తీసుకుంటారు. నిరాసక్తతతో సేద్యం చేస్తారు. ఈ ధోరణే వారిని నష్టాల పాలు చేస్తున్నది. వ్యవసాయ రంగం ఇతర రంగాలకు ఏ మాత్రం తీసిపోదు. దీన్ని ఓ ఉద్యోగంలా భావించి, అనుదినం కనిపెట్టుకొని అన్ని పనులూ స్వయంగా చేసుకోవాలి. మరీ అవసరం ఉన్నప్పుడే కూలీలపై ఆధారపడాలి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను మార్కెట్ చేసుకునే విషయంలోనూ శ్రద్ధ చూపాలి. మేము పండించే ఎండు మిరప కాయలతో కారం పొడిగా మార్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నాం. దీంతో మిర్చి ఆదాయం రెండింతలైంది. – కసిరెడ్డి లావణ్య రమణారెడ్డి(77300 61819), సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు,కారువంక, నాగర్కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement