Top Stories
ప్రధాన వార్తలు
ఎన్నికల వేళ కలకలం.. సోషల్ మీడియాలో అమిత్ షా ఫేక్ వీడియో!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్ స్పందించింది. రిజర్వేషన్ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్ వీడియోపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్లో మ్యాడ్ మ్యాన్లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్)
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.
హైదరాబాద్లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్బాస్ 7 తెలుగు సీజన్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్తో హైదరాబాద్లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్లోని అద్దె ఫ్లాట్లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ )
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్ఏ పరీక్ష
హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.
Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ఉ.5.37 వరకు, తదుపరి షష్ఠి తె.4.27 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం: పూర్వాషాఢ రా.2.28 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.22 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.32 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: పనుల్లో విజయం. ఆర్థిక లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.తుల: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.వృశ్చికం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.ధనుస్సు: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.మకరం: ర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో కొనసాగుతాయి.కుంభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.మీనం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
చోడవరం బయల్దేరిన సీఎం జగన్
గుంటూరు,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా.. తొలుత అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే ప్రచార సభ కోసం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరారు.సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇప్పటికే కొత్తూరు జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ జెండాలతో పార్టీ శ్రేణుల ఉత్సాహంతో సందడి వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ సభ తర్వాత అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. ఆపై గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే మూడో ప్రచార సభలో పాల్గొంటారు.
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది.
సీఎం జగన్పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్నగర్లో బస్సుయాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది.
ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్ జగన్
డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే పంపితే అది జగన్ పాలన! అదే డబ్బులు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన! చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ 5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, మోసాల పాలన. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు.. ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు.. అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు నైజంగా, గుంపులు గుంపులుగా జెండాలు జత కట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు, మోసగాళ్లకు ఓటుతో పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం/సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరుకుట్రలు, వెన్నుపోట్లతో కూటమి కట్టి, జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘58 నెలల కాలంలో నేను ఏం చేశానో చెబుతా. నీ 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశావో చెప్పగలవా చంద్రబాబూ? నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా? జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పగలవా? నేను తెచ్చిన పథకాల గురించి మాట్లాడతావ్ ఏమిటయ్యా బాబూ? నేను రూపాయి ఇస్తే.. నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్ ఏంటయ్యా చంద్రబాబూ?’ అంటూ ధ్వజమెత్తారు. ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాని ఆ మనిషిని నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభతో మలి విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం వేళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో, సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పోటెత్తిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన ఏమన్నారంటే...బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లే!మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇవి వచ్చే ఐదేళ్ల పాటు మన ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్ర బాబు గురించి చరిత్ర చెప్పిన సత్యం. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఆహ్వానించడమే.మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడునాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతోనే. నా నమ్మకం ఆ దేవుడి దయపైనే. మేనిఫెస్టో హామీలను నూటికి 99 శాతం అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 130సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ అందాయి. సచివాలయాల్లో నా తమ్ముళ్లు, చెల్లెళ్లుదశాబ్దాలుగా మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు. నా తమ్ముళ్లు, చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మెరుగుపడిన ఆస్పత్రులు, బడుల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ నేను ‘‘నా..’’ అని ఆప్యాయంగా పిలిచే సామాజికవర్గాలకు ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు దక్కాయి.పౌర సేవలు.. విప్లవాత్మక వ్యవస్థలు ప్రజలకు అందించే సేవల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా పౌర సేవలు, పథకాలను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేశాం. నాడు – నేడుతో బాగుపడ్డ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వస్తోంది. గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తున్నాడు. మన గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలన్నీ మీ బిడ్డ 58 నెలల కాలంలోనే తెచ్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.పేదల ఆత్మగౌరవం కాపాడుతూ..పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటికే రూ.3 వేలు పింఛన్, రేషన్ అందజేస్తున్నాం. ఈరోజు ఇంటి వద్దకే క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ వస్తోంది. ఏది కావాలన్నా గడప వద్దకే వస్తున్న పరిస్థితులు మీరే చూస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులను ఎవరైనా ఊహించారా? గవర్నమెంట్ డబ్బులు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయని గతంలో ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేసి చూపించాం.విద్యా విప్లవం..పేదింటి పిల్లల చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువులు, ఆహారం అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పిల్లలు ధరించే యూనిఫాం మొదలు పుస్తకాల దాకా అన్నీ సమకూరుస్తున్నాం. క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, ఐఎఫ్పీ ప్యానెల్స్, ట్యాబ్లు, మారిన కరిక్యులమ్తో విద్యా విప్లవాన్ని తెచ్చాం. ఇదే పాలన మరో పదేళ్లు కొనసాగితే ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్న మీ పిల్లలు 2035 నాటికి టెన్త్ పరీక్ష ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్తో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే ఆన్లైన్ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానమవుతున్నాయి. మహిళా సాధికారతకు దన్నుగా‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం లాంటివి గతంలో విన్నారా?రైతన్నకు అండగా..రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలో రైతు భరోసా అందించడం గతంలో ఎప్పుడైనా చూశారా?. గ్రామాల్లోనే ఆర్బీకేలు, సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్, ఇన్ పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటలు సైతం కొనుగోలు లాంటివన్నీ చేసి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాడు.100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేమొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి మీ బిడ్డ అర్థం చెప్పాడు. చేతల్లో చూపించాడు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు డీబీటీ, నాన్ డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు లబ్ధి చేకూరింది. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 68 శాతం మంత్రి పదవులు ఆ వర్గాలకే ఇవ్వడం ఓ చరిత్ర. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించిన చరిత్ర గతంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి.జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తానని చెప్పగలవా?చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకొస్తే మీ జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చాడు. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు? ఆ విషయం చెప్పే ధైర్యం లేక నేను తెచ్చిన వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేమిటి? నువ్వు వస్తే వలంటీర్లకు జీతం పెంచుతానంటావేమిటి? జగన్ స్కీమ్లను రద్దు చేస్తాననే ధైర్యముందా?అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్! నేను 58 నెలలే పరిపాలన చేశా. జగన్ అమ్మఒడి తీసుకొస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. జగన్ చేయూత ప్రవేశపెడితే నువ్వు ఇంకా ఎక్కువమందికి ఇస్తానంటున్నావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్! జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ? జగన్ తెచ్చిన వలంటీర్, సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తానని చెప్పే ధైర్యం ఉందా? రైతు భరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా?మోసాల బాబు విఫల హామీలు⇒ 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన పాంప్లెట్ గుర్తుందా? ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఊదరగొట్టారు. మంగళ సూత్రం తెంపుతున్న చేతిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేశాడా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎక్కడైనా కనిపిస్తోందా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? ⇒ అవే మూడు పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్లు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యాయి.మన అభ్యర్థులను దీవించండిఅనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరణారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వై.విజయసాయిరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.మనం చేసిన మంచిలో మచ్చుకు కొన్ని..⇒ ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేది మీ జగన్. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అమ్మఒడి అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, మహిళా సాధికారత, రైతు భరోసా, ఆర్బీకేలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, జీవనభృతికి ఇబ్బంది లేకుండా విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా, పేదవాడికి మందులు, టెస్టులు అందిస్తూ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.⇒ స్వయం ఉపాధికి ఊతమిస్తూ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్, ఇంటికే పౌరసేవలు, పథకాలు చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్. నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడులు, గవర్నమెంట్ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్.తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అన్న, ఎంపీ అభ్యర్థి శంకరన్నపై మీ చల్లని దీవెనలు ఉంచాలని సవినయంగా కోరుతున్నా. కాసేపటి క్రితం పెద్దారెడ్డి అన్న తాడిపత్రి నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ గురించి ప్రస్తావించాడు. తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజీని మళ్లీ మన ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కూడా ప్రస్తావించారు. అవన్నీ పెద్దారెడ్డి అన్నతో దగ్గరుండి మీకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా.ఇవన్నీ కొనసాగాలంటే మన పార్టీకి ఓటేయండి...నేను చంద్రబాబు మాదిరిగా సెల్ఫోన్ కనిపెట్టానంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మీరే మార్కులు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కనీసం ఆరేడు విప్లవాత్మక కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీవద్ద ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేయండి. అవన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు. అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇలాగే చక్కగా చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు అధికారం ఇవ్వండి. పిల్లలు ఇలాగే ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఈ మార్పులు కొనసాగాలంటే మీ బిడ్డకే, ఫ్యాన్కు ఓటు వేయాలి. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పథకాలు సజావుగా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలి. చంద్రబాబు మార్కు దోపిడీ, జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ రాకూడదంటే ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మరోసారి ఆశీర్వదించాలి.మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? నాడూ నేడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కంటే ఇప్పుడే గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? కనీ వినీ ఎరుగని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు? అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు? అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి. మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తుంటే సుమతీ శతకం ‘‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ’’ గుర్తుకొస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్లలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీరంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదరాబాద్కు వెళ్లిపోతారు. ఇదీ వాళ్లకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టీ పార్టీలకు, వాటి సభ్యులకు, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునే వనరుల లాంటివి. వీరిలో ఏ ఒక్కరికీ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మేం చేసిన మంచి చూసి మాకు ఓట్లేయాలని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, ఇంటింటికి చేసిన మంచిని సగర్వంగా చెబుతున్న పార్టీ మనది. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ చేసిన మంచి ఇదీ అని మీ బిడ్డ సగర్వంగా చెబుతున్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే తోడుగా, సైనికులుగా నిలవాలని కోరుతున్నా.
తప్పక చదవండి
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
సినిమా
స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం
బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈమేరకు తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. తన భర్త మంజునాథ్ తండ్రి గారు హఠాన్మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందింది. ఈ క్రమంలో తన మామగారి ఫోటోను ఆమె షేర్ చేసింది. 'మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. 'భౌతికంగా మీరు మాతో లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.' అని మంజునాథ్ భావోద్వేగానికి గురైయాడు. ఆపై తన తండ్రితో దిగిని ఫోటోలను పంచుకున్నాడు. ఆయన మరణానికి కారణాలు తెలుపలేదు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manjunath Chillale (@manjunath_chillale)
నిర్మాతగా సమంత.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
హీరోయిన్గా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన సమంత వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణించింది. తాజాగా టాలీవుడ్లో ఆమె మరో అడుగు ముందుకు వేసింది. నిర్మాతగా మారిన సమంత తన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ మేరకు తన కొత్త ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' కంపెనీ నుంచి మొదటి సినిమా ప్రకటన అఫీషియల్గా వచ్చేసింది.నేడు (ఏప్రిల్ 28న) సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్తో పోస్టర్ విడుదల చేశారు. తన సొంత నిర్మాణ సంస్థలో సమంత లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో సమంత చీరకట్టుకుని చేతిలో తుపాకీ పట్టి సీరియస్ లుక్తో కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్'తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్ అధినేత హిమాంక్ దువుర్రు గతంలో తెలిపాడు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్పై ఓ నోట్ను పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు.అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఫొటోలు
బిజినెస్
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు."2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్లు ఒక యూనిట్గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్కు అనుగుణంగా కోచ్లను 16 వరకు పెంచుతారు.
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్లో తెలిపారు.బ్యాంకింగ్లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావడానికి కృషి చేశారు.
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్గ్రేడబుల్ ఏటీఎం మెషీన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది.
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్.. ప్రధాన స్టార్టప్లు ఇవే..
సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్మైండ్గ్రోడ్టెర్మినస్ సర్క్యూట్స్మార్ఫింగ్ మిషన్ఫెర్మియానిక్ఓక్టర్ఆగ్నిట్ఇన్కోర్సైన్ఆఫ్సిలిజియం సర్క్యూట్స్ఔరసెమిసెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి.
వీడియోలు
పవన్ కళ్యాణ్ అఫిడవిట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ మేనిఫెస్టోపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రియాక్షన్
గుంటూరులో ఎన్నికల ప్రచారం..దుమ్మురేపిన అనిల్ కుమార్ యాదవ్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కన్నబాబు ఫైర్
అధికారపక్షాలపై కేసీఆర్ ఫైర్
పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది: ఇంతియాజ్
నేడే ఆఖరి తేదీ.. వివరాలు వెల్లడించిన ఈసీ
సీఎం జగన్..ఎన్నికల ప్రచార సభలు నేటి షెడ్యూల్
అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ..!
చంద్రబాబు హామీలపై విరుచుకుపడ్డ సజ్జల..