-
అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి
తెనాలిరూరల్: అమెరికాలోని కనెక్టికట్లో నివశిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తనయుడు అభిజిత్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలు ఎన్నో ఏళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అడవి ప్రాంతంలో అదే రోజు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభిజిత్ భౌతిక కాయం అమెరికా నుంచి శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం చేరుకుంది. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, అభిజిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. -
విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన
జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్ పర్ఫెక్ట్' టీమ్. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్లో నటించారు. డిస్నీ హాట్ స్టార్లో ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్ ప్రకటించారు. 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్లా ఉంటుంది. క్లీన్నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్ సిరీస్ను ,అందరినీ ఆకట్టుకుంటుందని డిస్నీ+ హాట్స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ 'మిస్ పర్ఫెక్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది. పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది. లావణ్యతో పాటు అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. -
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్లో చేరేలోపే గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే అభిజిత్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అభిజిత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కాగా, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ ఇటీవలే సౌదీ అరేబియాకు చెందని ఓ ఆయిల్ కంపెనీలో 50లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్ ఉన్నట్టుండి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు) -
ఫేమస్ డాన్సర్ ఆత్మహత్య
పలు సూపర్హిట్ బాలీవుడ్ చిత్రాల్లో డాన్సర్గా కనిపించిన ఫేమస్ డాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని అభిజిత్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అభిజిత్ మృతదేశం వద్ద లభించిన సూసైడ్ నోట్లో తన బ్యాంక్ అకౌంట్ను కుమార్తెకు ట్రాన్స్పర్ చేయమని కొరినట్టుగా పోలీసులు తెలిపారు. కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అభిజిత్ షిండే డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోలు రణవీర్, రణ్బీర్లతో పలు సూపర్ హిట్ పాటల్లో డాన్స్ చేశాడు అభిజిత్ షిండే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
శిక్షణలోనే సందేహాలు నివృత్తి చేసుకోవాలి
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement