-
ఏసీ మార్కెట్ వృద్ధి 10 శాతమే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఏసీల డిమాండ్ను అంతకంతకూ పెంచుతుండగా... దేశంలో మాత్రం వీటిపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండటం అమ్మకాల జోరుకు కొంత అడ్డుకట్ట వేస్తున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏటా రూ.14,000 కోట్ల విలువైన ఏసీలు అమ్ముడుపోతున్నాయి. సంఖ్యలో చూస్తే... 2017–18లో 55 లక్షల యూనిట్లు విక్రయం కాగా... ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ వృద్ధి ఉండవచ్చని, ఇది 60 లక్షల యూనిట్లకు చేరవచ్చని బ్లూస్టార్ జేఎండీ త్యాగరాజన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. 2019–20లో ఇవి 66 లక్షల యూనిట్లను చేరవచ్చన్నారు. మార్కెట్ వృద్ధి 10 శాతం వరకూ ఉంటే... బ్లూస్టార్ కూడా అదే స్థాయి వృద్ధిని లకి‡్ష్యస్తున్నట్లు చెప్పారాయన. జీఎస్టీని తగ్గిస్తే మాత్రం ఈ వృద్ధి మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన విండో... పెరిగిన ఇన్వర్టర్: విద్యుత్ను ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీల వార్షిక వృద్ధి 100 శాతం దాటిపోతుండగా... విండో ఏసీల వాటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఏసీల్లో విండో శ్రేణి వాటా 12 శాతం ఉండగా... 88 శాతం స్ప్లిట్ ఏసీలే ఉన్నాయి. ఇందులో మల్టీ స్ప్లిట్ వాటా 2 శాతం. స్ప్లిట్ ఏసీల్లో ఇన్వర్టర్ విభాగం 52 శాతం, ఫిక్స్డ్ స్పీడ్ మోడళ్లు 47 శాతం ఉన్నాయి. 2016లో ఇన్వర్టర్ ఏసీల వాటా 10 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో విండో ఏసీల అమ్మకాలు పూర్తిగా పడిపోయినట్లు విక్రేతలు చెబుతున్నారు. ఎక్కువగా 3 స్టార్.. విక్రయమవుతున్న ఏసీల్లో 5 స్టార్ మోడళ్ల వాటా 14 శాతంగా ఉంది. 82 శాతం వాటా మాత్రం 3 స్టార్దే. 5 స్టార్తో పోలిస్తే 3 స్టార్ మోడళ్ల ధర కనీసం రూ.5 వేలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని, ఏసీని ఎక్కువగా వాడేవారు మాత్రమే విద్యుత్ ఆదా కోసం 5 స్టార్ వైపు మొగ్గు చూపుతున్నారని టీఎంసీకి చెందిన కె.శ్రీనివాస్ చెప్పారు. ‘‘తెలంగాణ, ఏపీ కస్టమర్లకు విద్యుత్ ఆదా విషయంలో అవగాహన ఎక్కువ. ఈ రెండు రాష్ట్రాల్లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు 90 శాతం ఉంటున్నాయి’’ అని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి చెప్పారు. 5 స్టార్ సేల్స్ దేశంలో ఇక్కడే ఎక్కువన్నారాయన. కాగా ఏసీ విక్రయాల్లో 30–35 శాతం ఈఎంఐల ద్వారా జరుగుతున్నాయని గోద్రెజ్ చెబుతోంది. -
ఏసీల అమ్మకాలు కూల్..!
2015లో 43 లక్షల ఏసీల విక్రయం అంచనా - 15% వృద్ధి ఖాయం: పరిశ్రమ - కంపెనీలకు సానకూల వాతావరణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల జోష్తో ఎయిర్ కండీషనర్ల(ఏసీ) మార్కెట్ వేడెక్కింది. భానుడి ప్రతాపానికితోడు దేశవ్యాప్తంగా సెంటిమెంటు బలంగా ఉండడంతో ఏసీల విపణి జోరందుకుంది.గతేడాదితో పోలిస్తే 2015లో 15 శాతంపైగా వృద్ధి ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భారత్లో 2014లో రూమ్ ఏసీలు 37.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో 43 లక్షలకుపైగా యూనిట్లు నమోదవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది 2.50 లక్షల ఏసీలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 15% వృద్ధి ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 5.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. సహజంగా జనవరి-మార్చి కాలంలో 25 శాతం అమ్మకాలు నమోదవుతాయి. భారత్లో వోల్టాస్, ఎల్జీ, శాంసంగ్ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీ, బ్లూ స్టార్, శాంసంగ్లు తొలి 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇన్వర్టర్ ఏసీల హవా.. భారత్లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు ఊపందుకున్నాయి. విద్యుత్ను గణనీయంగా ఆదా చేసే ఈ మోడళ్ల వాటా ప్రస్తుతం 8%గా ఉంది. 2015లో ఈ విభాగం 15%కి, 2018 నాటికి 30 శాతానికి ఎగబాకుతుందని బ్లూస్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘5 స్టార్తో పోలిస్తే ధర 25% అధికం. అయితే విద్యుత్ను ఆదా చేసుకోవాలంటే ఇన్వర్టర్ ఏసీ వాడకమొక్కటే మార్గం. ఈ ఏడాది బ్లూస్టార్ నుంచి ఈ విభాగంలో 20-25 కొత్త మోడళ్లు రానున్నాయి’ అని చెప్పారు. ఇన్వర్టర్ ఏసీలు చైనాలో 80%, జపాన్లో 50% ఆక్రమించేశాయి. అల్యూమినియంకు బదులు కాపర్ కాయిల్తో తయారైన ఏసీలపట్ల కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన వివరించారు. ఏసీల జీవిత కాలం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు. తెలుగు వెలుగులు.. ఏసీల ఎంపిక విషయంలో తెలుగు కస్టమర్లు ముందుంటున్నారు. విండో ఏసీలను దాదాపుగా మర్చిపోయారు. 2014లో కేవలం 12,500 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. స్ప్లిట్ ఏసీల వాటా అత్యధికంగా 95 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పరిశ్రమలో 5 స్టార్ ఏసీల వాటా 20 శాతమైతే, తెలుగు రాష్ట్రాల్లో ఇది 23%. విక్రయాల్లో తెలుపు రంగు మోడ ళ్లు 1.75 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. తెలుపు తర్వాత ఎరుపు, బంగారు వర్ణానికి డిమాండ్ ఎక్కువ. మొత్తంగా 50% ఏసీ అమ్మకాలు చిన్న పట్టణాల నుంచి నమోదవుతున్నాయి. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 1 కోటి యూనిట్లకు చేరుకోవచ్చని బ్లూస్టార్ అంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement