-
మరో 2 బిలియన్ డాలర్లు.. రిలయన్స్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 16,400 కోట్లు) సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశీ కరెన్సీలో తక్కువ వడ్డీ రేట్లకు ఈ నిధులను సమీకరించే యోచనలో కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ఈ రెండు సంస్థలు ఇటీవలే 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 24,600 కోట్లు) మొత్తాన్ని సిండికేట్ లోన్ ద్వారా సమీకరించాయి. రెండు డజన్ల తైవాన్ బ్యాంకులతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ తదితర 55 దిగ్గజ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఆ ఒప్పందాల ప్రాతిపదికనే కొత్తగా 2 బిలియన్ డాలర్లను రిలయన్స్, జియో సమీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) -
హెచ్డీఎఫ్సీకి ఐఎఫ్సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
ఏపీకి అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏపీ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 15 శాతం టార్గెట్ పూర్తి చేసింది. ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్డీపీలో నాలుగు శాతం నికర రుణాల పరిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇవీ చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు -
నాలుగు శ్లాబులుగా జీఎస్టీ!
6, 12, 18, 26 శాతంగా పన్ను రేట్లు • జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీ ప్రతిపాదన, నేడు తుది నిర్ణయం • నిత్యావసరాలపై తక్కువ, విలాస వస్తువులపై అధికం • విలాస వస్తువులు, పొగాకుపై అదనపు సెస్ వసూలు • రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు ప్రతిపాదనలకు అంగీకారం • పరిహారం కోసం సెస్సు ఆదాయంతో రూ. 50 వేల కోట్ల నిధి సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జఎస్టీ) రేట్లపై ఎట్టకేలకు ముందడుగు పడింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు పన్ను శ్లాబుల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 6, 12, 18, 26 శాతంగా రేట్లను వర్గీకరిస్తూ పన్ను వసూలు చేయాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో బుధవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిత్యావసర వస్తువులపై తక్కువ రేటు, విలాస వస్తువులపై అధిక పన్ను రేటు విధించాలని ప్రతిపాదనల్లో సూచించారు. ప్రతిపాదన సారాంశం.. ‘ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని... పన్ను నుంచి ఆహార పదార్థాల్ని మినహాయించాలి. అలాగే దాదాపు 50 శాతం నిత్యావసర వస్తువుల్ని పన్ను నుంచి మినహాయించడం కానీ తక్కువ రేటు విధించడం కానీ చేయాలి. 70 శాతం వస్తువులపై పన్ను రేటు 18 శాతం కంటే తక్కువ ఉండాలి. విలాసవంతమైన కార్లు, పొగాకు, సిగరెట్లు, శీతల పానియాలు, కాలుష్యకారక వస్తువులపై అదనపు సెస్ విధించాలి. బంగారంపై మాత్రం 4 శాతం రేటు ఉండాలి. ఎఫ్ఎంసీజీ (త్వరగా ఖర్చయ్యే వస్తువులు, ఉదా: సబ్బులు), కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులు(గృహోపకరణాలు, కార్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు)పై 26 శాతం పన్ను విధించాలి’ అని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిపై 31 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. నేడు పన్ను రేట్లపై తుది నిర్ణయం విజ్ఞాన్భవన్లో మూడు రోజులు జరిగే ఈ సమావేశాల్లో బుధవారం తుది పన్ను రేట్లపై ఒక నిర్ణయానికి రానున్నారు. మంగళవారం భేటీలో ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిం చాలి? రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే పరిహారం ఎలా చెల్లించాలి? అన్న అంశాలపై చర్చించా రు. పన్ను ఆదాయం వృద్ధి రేటు 14 శాతం ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రాలకు వస్తున్న పన్ను ఆదాయంపై 14 శాతం అదనపు ఆదాయం జీఎస్టీ అమలుతో రాకపోతే, తగ్గిన మొత్తాన్ని కేంద్రం పరిహారంగా చెల్లిస్తుంది. ఈ ప్రతిపాదన కు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ... ఆదాయం లెక్కింపునకు 2015-16ను ఆధార సంవత్సరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. ‘గత ఐదేళ్ల ఆదాయాన్ని లెక్కించేందుకు 14 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్రాలు ఇంతకంటే తక్కువ ఆదాయం పొందితే... కేంద్రం పరిహారమిస్తుంది. విలాస వస్తువులు, పొగాకువంటి పదార్థాలపై విధించే సెస్తో రూ. 50 వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం’ అని జైట్లీ పేర్కొన్నారు. సేవలపై మూడు శ్లాబులే.. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... సేవలపై పన్ను 6, 12, 18 శాతంగా మాత్రమే ఉంటుందని, గరిష్టంగా 18 శాతం విధిస్తారన్నారు. తుది నిర్ణయం తీసుకోలేదు: యనమల శ్లాబులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బుధవారం చర్చ కొనసాగుతుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. పేదలపై భారం ఉండరాదు: ఈటెల సామాన్యులకు భారం కాకుండా పన్ను విధానం ఉండాలని మొదటి నుంచి తెలంగాణ కోరుతోందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమావేశం అనంతరం అరుణ్ జైట్లీని కలిసి వెనకబడిన జిల్లాలకు రెండో విడత నిధులు రూ. 400 కోట్లు ఇవ్వాలని కోరారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement