-
కంది.. సస్యరక్షణతో లాభాలు దండి
సమయానుకూలంగా మెలకువలు పాటించాలి మోతాదుకు మించి ఎరువులు వాడకూడదు వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్కుమార్ టేక్మాల్: సస్యరక్షణ చర్యలను పాటిస్తూ కంది సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పంటను చీడపీడలు ఆశించినా, తెగుళ్లు సోకినా.. దిగులు చెందాల్సిన పనిలేదు. సమయానుకూలంగా మెలుకువలు పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు పాటిస్తూ, తగిన మోతాదులో ఎరువులను వాడితే రైతులు మెరుగైన ఫలితాలను కళ్ల చూస్తారని టేక్మాల్ ఏఎఈఓ సునిల్కుమార్ (99499 68674) తెలిపారు. కంది పంట సాగు, సస్యరక్షణ చర్యలపై ఆయన అందించిన సలహాలు, సూచనలు.. పురుగులు: ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ తప్పక పాటించాలి. మరుకా మచ్చల పురుగు: దీని నివారణకు క్లోరిపూరిఫాస్ 2.5 మి.లీ లేదా నోవోల్యురాన్ 0.75 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.75 మి,లీ లేదా సైహలోత్రిన్ 1 మి.లీ లీటను నీటికి కలిపి మందును మార్చి వారానికోసారి పిచికారి చేయాలి. సమగ్ర సస్యరక్షణ: వేసవిలో లోతు దుక్కిచేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షితపైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ఐ.సి.పి.యల్- 332, యల్.ఆర్.జి.41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల యల్.ఆర్.జి30, యల్.ఆర్.జి- 38 కంది రకాలను సాగుచేయాలి. పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించి వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజాడిరాక్టిన్)ను పిచికారి చేయాలి. ఎకరాకు 200 లార్వాలను సమానమైన యన్.పి.వి ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో రెండు సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు. పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, పూతలేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేక ఎసిఫేట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి హ్యండ్ కంప్రెషన్ స్ప్రేయర్తో పిచికారి చేయాలి. తెగుళ్లు: ఎండుతెగులు: ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంతభాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి,పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయాకూడదు. వెర్రితెగులు(స్టెరిలిటి మొజాయిక్): ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొలుస్తుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ, కెల్థేన్ కలిపి వారానికొకసారి రెండు దఫాలుగా పిచికిరి చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, 227 రకాలను సాగుచేయాలి. మాక్రోఫొమినా ఎండు తెగులు: ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ వుంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పోతాయి. యం.ఆర్.జి 66 కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు. -
బెండ.. సిరుల కొండ
సస్యరక్షణతో అధిక దిగుబడులు పరిమిత మందులే ఎంతో మేలు సలహాలు, సూచనలు తప్పనిసరి టేక్మాల్ ఏఈఓ సునిల్కుమార్ టేక్మాల్: బెండ సాగు రైతన్నకు ఎంతో అండగా నిలుస్తుందని టేక్మాల్ ఏఈఓ సునిల్కుమార్ (99499 68674) తెలిపారు. కాస్త మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకు మించి మందులను వాడకుండా తగిన మోతుదులో వాడుతూ పంటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమయానికి సహజ ఎరువులకు అధిక ప్రాధాన్యతనిస్తూ పండిస్తే మరింత దిగుబడులు పెరుగుతాయన్నారు. బెండసాగులో పురుగుల దాడిపై ఆయన అందించిన సలహ, సూచనలు మీకోసం.. మొవ్వు, కాయతొలుచు పురుగు: నాటిన 30 రోజుల నుంచి కోతదశ వరకు ఈ పురుగు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత, కాతదశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందకి తుంచాలి. లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లి లేదా లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తరువాత పిచికారి చేయాలి. పంట కాపునకు రాని దశలో థయోడికార్బ్ గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దీపపు పురుగులు: ఆకుపచ్చ రంగులో వుండే చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగ చేస్తాయి. ఆకులు పైకి ముడుచుకొని పోయి, పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి మిథైల్ డెమెటాన్ 2 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. ఎర్రనల్లి: పంట చివరి దశలో చిన్న, సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ: పంటలో పూతకు ముందు చిన్న, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడంవల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంఖురోగాన్ని వ్యాప్తి చెందిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. తీవ్రదశలో ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గానీ, ఆముదం గానీ పూసి తెల్లదోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి. తెగుళ్ళు బూడిద తెగులు: ఆకులపైన, అడుగు భాగాన బూడిద వంటి పొడిచే కప్పబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి. శంఖు లేదా పల్లాకు తెగులు: తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5గ్రా ఎసిఫేట్ కలిపి పిచికారి చే యడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు.వర్షాకాల పంటను జులై 15 ముందుగా విత్తటం ద్వారా ఈ తెగులును కొంత వరకు నివారించవచ్చు. ఎండు తెగులు: మొలక దశలో మొక్కలు మొత్తం కొద్ది సమయంలో ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. సమగ్ర సస్యరక్షణ: కిలో విత్తనానికి 5 గ్రా చొప్పున ఇమిడాక్లోప్రిడ్(గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ఎకరానికి 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం లేదా గ్రీజు పూసి పెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. రసం పీల్చేపురుగుల నివారణకు ఫాసలోన్,ఫిప్రొనిల్,డైమిధోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5గ్రా ఎసిఫేట్ను 1.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement