-
‘ఆమెది భరించలేని మోసం.. గుండెలోతుల్లో ఆ బాధను అనుభవించా!’
-
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్ఫోన్ ఛాటింగ్లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: ‘ప్లీజ్ మా చెల్లి వెంటపడొద్దు’
లక్నో: తన చెల్లి వెంట ఒకరు వెంట పడుతున్నాడని తెలిసి సోదరుడు కల్పించుకుని అతడికి సర్ది చెప్పాడు. ఇదే ఆ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. తన చెల్లి వెంటపడొద్దని హితవు పలికిన అతడిని నలుగురు వ్యక్తులు కలిసి స్కార్ఫ్తో దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లా బజ్హేర గ్రామానికి చెందిన సురేంద్ర పాల్ ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తన చెల్లి వెంట స్థానికుడు శివకుమార్ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి వెంట పడొద్దని హితవు పలికాడు. దూరంగా ఉండాలని.. ఇకపై కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివకుమార్ సరే అని చెప్పాడు. అయితే ఆమెకు దూరంగా ఉండడం శివ తట్టుకోలేకపోయాడు. జరిగిన విషయాన్ని శివ తన స్నేహితుడు భూపేంద్రకు చెప్పాడు. శివకు ఓదార్చిన భూపేంద్ర దీనికి ఓ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సురేంద్ర పాల్ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. సురేంద్ర, భూపేంద్ర దూరపు బంధువులు. ఈ చనువుతో సురేంద్రను మద్యం సేవిద్దామని భూపేంద్ర పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. అయితే సురేంద్రకు పీకల దాక భూపేంద్ర మద్యం తాగించాడు. అనంతరం స్కార్ఫ్తో సురేంద్రను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మధురకు సమీపంలోని యమున నదిలో విసిరేశాడు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తాం’ అని బెదిరించారు. కంగారు పడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో శివకుమార్, రాహుల్ సింగ్, రతన్ సింగ్ పాత్ర కూడా ఉందని తేలింది. దీంతో వారిని అలీఘర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 364 ఏ, 302, 201 సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. యమున నది తీరంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెల్లి ప్రేమ అన్న ప్రాణం మీదకు వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై ఫిర్యాదు చదవండి: ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్లో సాయం చేయండి’ -
పెళ్లాం ఊరెళ్తే ప్రియురాలితో ....
బొమ్మనహళ్లి : భార్య పుట్టింటికి వెళ్లగా ప్రియురాలితో తన ఇంట్లోనే కాపురం పెట్టాడు ఓ ప్రభుద్ధుడు. ఊరి నుంచి వచ్చిన భార్య ఆ ఇద్దరిని గదిలో బంధించి పోలీసులకు పట్టించింది. ఈ ఘటణ శుక్రవారం మడివాళ పోలిసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన రెడ్డప్ప, నాగమణి దంపతులు జీవనోపాధి కోసం బెంగళూరుకు చేరుకొని హెచ్ఎస్ఆర్ లేఔట్లోని 7వ సెక్టర్లో నివాసం ఉంటున్నారు. నాగమణి కూలి పనులకు వెళుతుండగా రెడ్డప్ప ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా రెడ్డప్ప మరో వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న భార్య భర్తను మందలించింది. అయినప్పటికీ పెడచెవినపెట్టాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం నాగమణి సొంతూరుకు వెళ్లింది. ఇదే అదనుగా రెడ్డప్ప ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చాడు. స్థానికులు ఈ విషయాన్ని మొబైల్ ద్వారా నాగమణికి తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే ఇంటికి చెరుకున్న నాగమణి..ఇంట్లో భర్త, అతని ప్రియురాలు ఉండటాన్ని గుర్తించి బయటి నుంచి గొళ్లెం పెట్టింది. మడివాళ పోలీసులు వచ్చే సమయానికి రెడ్డప్ప తప్పించుకోగా ఇంట్లోనే ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement