-
బిపిన్ రావత్ మృతి.. ‘దయచేసి ఆ ఊహాగానాలకు చెక్ పెట్టండి’
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
పాక్ తాలిబన్ చీఫ్ ఫజ్లుల్లా హతం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లాను అమెరికా వైమానిక దళం హతమార్చింది. అఫ్గానిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో జరిపిన డ్రోన్ దాడుల్లో అతడు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ అధికారి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు. 2012లో పాకిస్తాన్ బాలిక మలాలాపై దాడి జరిగిన సమయంలో ఫజ్లుల్లా స్వాత్ లోయలో తాలిబన్ కార్యకలాపాలకు ఇన్చార్జిగా వ్యవహరించాడు. 2013లో ఆ సంస్థకు చీఫ్ అయిన తరువాత అమెరికా, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా ఎన్నో దాడులకు కుట్ర పన్నాడు. అందులో 2014 నాటి.. 130 మంది చిన్నారులు సహా మొత్తం 151 మందిని బలిగొన్న పెషావర్ హైస్కూల్ దాడి ఘటన కూడా ఉంది. 2010లో న్యూయార్క్లోని టైమ్స్స్క్వేర్ వద్ద కారుబాంబుతో దాడి చేయడానికి ఆ సంస్థ ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఫజ్లుల్లా తలపై 5 మిలియన్ డాలర్ల(రూ. 34 కోట్లు) రివార్డు ఉంది. 2009లో పాకిస్తాన్లోని కైబర్–పఖ్తూన్క్వా ప్రావిన్స్లో తన అనుచరులందరూ హతమయ్యాక.. అఫ్గానిస్తాన్కు పారిపోయాడు. అక్కడి నుంచే పాక్లో ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడు. రేడియోలో రెచ్చగొట్టే ప్రసంగాలు.. ఒక సీనియర్ ఉగ్ర నాయకుడు లక్ష్యంగా దాడులు చేశామని గురువారం అమెరికా రక్షణ శాఖ ప్రకటించినా.. మరణించిన ఉగ్రవాది పేరును మాత్రం వెల్లడించలేదు. ‘జూన్ 13న కునార్ ప్రావిన్స్లో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక ఉగ్రనేత లక్ష్యంగా అమెరికా వైమానిక బలగాలు దాడులు చేశాయి’ అని లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ చెప్పారు. అయితే ఫజ్లుల్లా మృతిని శుక్రవారం అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి మొహమ్మద్ రద్మానిష్ ధ్రువీకరించారు. కునార్ ప్రావిన్స్లోని నురుగుల్ కాలే గ్రామ సమీపంలో అమెరికా బలగాల డ్రోన్ దాడిలో ఫజ్లుల్లాతో పాటు మరో నలుగురు తాలిబన్ కమాండర్లు మరణించారని ‘ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తెలిపింది. ఫజ్లుల్లా, అతని అనుచరులు ఇఫ్తార్ విందు చేసుకునే సమయంలో డ్రోన్ విమానం బాంబుల వర్షం కురిపించిందని మరికొన్ని నివేదికలు వెల్లడించాయి. ఫజ్లుల్లా మృతిని తాలిబన్ ఇంకా ధ్రువీకరించలేదు. 2010, 2014లలోనూ ఫజ్లుల్లా మృతిచెందినట్లు వార్తలు వెలువడినా, ఆ తరువాత అవి అబద్ధాలని తేలింది. ప్రైవేట్ రేడియోల్లో విస్తృతంగా ప్రసంగించి రెచ్చగొట్టే ఫజ్లుల్లాకు రేడియో ముల్లా, మౌలానా రేడియో అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే అతను అఫ్గానిస్తాన్ పారిపోయాక ఆ రేడియో స్టేషన్లను మూసివేశారు. రంజాన్ మాసంలో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న సమయంలో తాజా దాడి జరగడం గమనార్హం. ఆ ఒప్పందాన్ని గౌరవిస్తామని, కానీ, అమెరికా ఉగ్ర వ్యతిరేక పోరుకు దానితో సంబంధంలేదని నాటో అధికారి తెలిపారు. -
మరో ‘పఠాన్కోట’
తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకోవడంలో, సరిద్దుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించే వారెవరైనా అందుకు మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఆదివారం తెల్లవారుజామున యూరి సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడే అందుకు సాక్ష్యం. ఈ జనవరిలో పఠాన్కోట వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి మన భద్రతా వ్యవస్థకే సవాలును విసిరింది. యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ చేదు అనుభవం తర్వాతైనా మన భద్రతా వ్యవస్థను పటిష్టం చేస్తారని, మన సైనిక స్థావరాల రక్షణకు ప్రాధాన్యాన్నిస్తారని ఆశించాం. అన్నిటికి మించి పాకిస్థాన్లో సురక్షిత స్థావరాలను ఏర్పరచుకున్న భారత వ్యతిరేక ఉగ్రమూకలు యథేచ్ఛగా దేశంలోకి చొరబడకుండా పటిష్ట చర్యలు చేపడతారని అనుకున్నాం. అది అత్యాశేనని, చేసిన తప్పులనే తిరిగి తిరిగి చేస్తూ ఉగ్రవాద దాడులకు దారులను తెరిచి ఉంచే అలస త్వమనే జాడ్యం మన పాలక వ్యవస్థను ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నదని యూరి దాడి తేటతెల్లం చేసింది. ఉగ్రవాదులు భారత సైనికుల దుస్తుల్లో వచ్చారని, తెల్లవారు జాము చీకటిమాటున దాడి చేశారని, స్థావరంలోని తాత్కాలిక గుడారాలలో సైని కులు నిద్రిస్తుండగా దాడి జరగడం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందని, ఒక రెజి మెంటు స్థానంలో మరో రెజిమెంటు బాధ్యతలను స్వీకరించడం కోసం వచ్చిన సమయం చూసి ఉగ్రవాదులు దాడి చేశారని వినిపిస్తున్న సంజాయిషీలు ఏవీ మన పాలక వ్యవస్థ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చలేవు. పైగా దాడికి వారానికి ముందే సరిహద్దులలోని మన సైనిక స్థావరాలపై భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఇంటె లిజెన్స్ సమాచారం ఉన్నదని కూడా వినవ స్తోంది. సుదీర్ఘమైన సరిహద్దులోని ఏ మారుమూల నుంచో ఉగ్రవాదులు చొరబడకుండా చూడటం కష్టమంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అది ఆధీనరేఖకు కూతవేటు దూరంలో 15 నుంచి 16 వేల మంది సైనికులుండే పెద్ద స్థావరం. శత్రువు దాని దరిదాపులకు చేరడమే అసాధ్య మయ్యే రక్షణ ఏర్పాట్లు ఉండటం ఆవశ్యకం. అలాంటిది నిరాటంకంగా ఉగ్రవా దులు ఆ స్థావరాన్ని చేరుకోవడమే కాదు, సునాయాసంగా ఫెన్సింగ్ను కత్తిరించి చొరబడిపోగలగడం మన భద్రతా వ్యవస్థ భద్రతపైనే అనుమానాలను రేకెత్తిం చదా? పాక్ ఆధారిత ఉగ్రవాదం మన సైనిక స్థావరాలపైకి ఎక్కుపెడుతున్న దాడుల ముఖ్య లక్ష్యాలలో ఒకటి అదే కాదా? ఈ దురాగతానికి పాల్పడ్డ ఉగ్రమూకలు భారీ మూల్యం చెల్లించక తప్పదని, పాక్ను ఏకాకిని చేసే వ్యూహాలను రచిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న ప్రకటనలు పఠాన్కోట దాడి తదుపరి ప్రతిస్పందనల ప్రతిధ్వనులే తప్ప భరోసాను కల్పించేవి కావు. పలువురు బీజేపీ నేతలు, మీడియా విశ్లేషకుల ధోరణి తక్షణమే ప్రతీకార దాడులకు పాల్పడటమో, ఏదో ఒక స్థాయి సైనిక చర్యను చేప ట్టడమో ‘ఏదో ఒకటి చేసి తీరాలి’ అనేదిగా ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏ అర్థంలోనోగానీ.. యూరి భారత్, పాక్ల మధ్య యుద్ధం వంటి వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. పాక్, అక్కడి నుంచి పనిచేస్తున్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు కోరుకుంటున్నది సరిగ్గా అదే. నవాజ్ షరీఫ్ నేతృత్వం లోని పాక్ రాజకీయ అధికార వ్యవస్థ, ఐఎస్ఐ అధికారులు, సైనికాధికారులతో కూడిన శక్తివంతమైన రాజ్యాంగేతర అధికార వ్యవస్థ ఇటీవల గొప్ప సఖ్యతను ప్రద ర్శిస్తున్నాయి. ప్రత్యేకించి జూలై 8న ిహ జ్బుల్ ముజాహిదిన్ కమాండర్ బుర్హన్ వని ఎదురు కాల్పులలో హతమైన తదుపరి క శ్మీర్ లోయలో నెలకొన్న అశాంతిని అవ కాశంగా మలుచుకుని కశ్మీరీ ప్రజలకు మిగతా దేశానికి మధ్య అగాధాన్ని సృష్టిం చాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే పాక్ నుంచి పనిచేసే జైషే మొమమ్మద్ సాగిం చిన పఠాన్కోట దాడిని కశ్మీర్ మిలిటెంట్ల చర్యగా చిత్రీకరించే యత్నం చేశారు. యూరి దాడికి పాల్పడినది ఎవరో ఇంకా తేలకపోయినా ఐఎస్ఐ ముద్ర మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ నెల చివర్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి, దాన్ని అంతర్జాతీయం చేయగలననే భ్రమల్లో పాక్ ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం, ప్రత్యేకించి ఆ పార్టీ నేతలు సైతం ఇదే ఉష్ట్రపక్షి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుండటం విచారకరం. పాక్ను ఏకాకిని చేసేస్తామని ప్రభుత్వం అంటుంటే, ఇప్పటికే ఏకాకిని చేసేశామనే వరకు బీజేపి నేతలు పోతున్నారు. కశ్మీర్ సమస్యను మొత్తంగా పాక్ సృష్టిగా కొట్టిపారేస్తూ వీధుల్లో రాళ్లు రువ్వే కశ్మీరీ యువతతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ‘ఏదో ఒకటి చేసి తీరాలి’ అనే ఒత్తిడికి లోనైతే కశ్మీరీ యువత పట్ల మరింత కఠిన చర్యలకు, సైనిక బలప్రయోగానికి పూనుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే పాక్ పన్నిన ఉచ్చులోకి నేరుగా నడవడమే అవుతుంది. యూరి ఘటనపై ఆవేశపూరిత, అనాలో చిత ప్రతీకార ప్రకటనల సంగతెలా ఉన్నా.. ఆచరణకు సంబంధించి ఆచితూచి అడుగువేయడం, పాక్ పట్ల, సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని చూపడానికి తగ్గ అంతర్గత సంసిద్ధతకు కృషి చేయడం అవసరం. అది విస్మరించి, పోయేదేమీ లేదనే తెంపరితనాన్ని చూపే పాక్పైకి కాలుదువ్వడం ఆర్థికవృద్ధి పథంలో తడ బడుతూ నిలదొక్కుకుంటున్న భారత్ను ప్రతికూల పరిస్థితులలోకి నెట్టేస్తుంది. పైగా కశ్మీర్ను భారత్లోని అవిభాజ్యమైన అంతర్భాగంగా చూడటమంటే అక్కడి ప్రజల మానసిక స్థితిని, వారి సంవేదనలను, భావోద్వేగాలను పంచుకోవడం కూడా అని గుర్తించడం అవసరం. పాక్ సాగిస్తున్న ఈ ముసుగు యుద్ధంలో మన విజయానికి హామీ కశ్మీరీ ప్రజల హృదయాలను గెలుచుకోవడమేనని అర్థం చేసుకో వడం ఆవశ్యకం. పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇంత వరకు చేసిందేమైనా ఉంటే కశ్మీరీ హృదయాలను మరింత గాయపరచడమే. మరిన్ని పఠాన్కోటలు, యూరిలు జరగకుండా నివారించుకోగలగడం ఎలాగనే విషయంపై దృష్టిని కేంద్రీకరించడం తక్షణ ఆవశ్యకత. కాగా, కశ్మీర్ సమస్యకు సామరస్యపూర్వక, శాంతియుత పరి ష్కారం కోసం ఓపికగా కృషి చేయడం, పాక్ పట్ల నిలకడలేని తత్కాలీన, ఆవేశ పూరిత విధానాల స్థానే దీర్ఘకాలికమైన, ఆచరణాత్మకమైన, నిలకడతో కూడిన ఆలోచనాయుత విధానాన్ని రూపొందించుకోవడం అవసరం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement