-
బఫెట్ తప్పు చేశారు: ట్రంప్
ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ షేర్లను విక్రయించి వారెన్ ఒఫెట్ తప్పుచేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్లో శుక్రవారం జరిగిన ఓ న్యూస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడుతూ ... కొన్నిసార్లు బఫెట్ లాంటి అనుభవజ్ఞులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. బఫెట్ ఎయిర్లైన్ స్టాక్లులను విక్రయించకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఎయిర్షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అయితే బఫెట్పై తనకు అపారమైన గౌరవం ఉందని ట్రంప్ తెలిపారు. తాను మాత్రం జీవితాంతం సరైన నిర్ణయాలే తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బఫెట్ అమెరికాలోని ప్రధానమైన 4 ఎయిర్లైన్స్ కంపెనీల షేర్లను విక్రయించారు. విచిత్రంగా బఫెట్ విక్రయం తర్వాత ఈ ఎయిర్లైన్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒక్క వారంలోనే డెల్టా ఎయిర్లైన్ షేరు 40శాతానికి పైగా పెరిగింది. అమెరికన్ ఎయిర్లైన్ షేరు 90శాతం, సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ షేరు 25శాతం, యూనైటెడ్ ఎయిర్లైన్స్ హోల్డింగ్ షేరు 60శాతానికి పైగా లాభపడింది. బఫెట్ 2016 నుంచి ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. తన సొంత సంస్థ బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశం ఈ మేనెలలో జరిగింది. ఈ సందర్భంగా బఫెట్ మాట్లాడుతూ వైమానిక పరిశ్రమ పట్ల ప్రపంచ థృక్పథం మారిపోయిందన్నారు. -
విమాన షేర్లు.. టేకాఫ్!
ఐదు రోజుల్లో 45 శాతం పెరిగిన ఎయిర్లైన్స్ షేర్లు దిగొస్తున్న క్రూడ్ ధరలతో లాభాల బాట పడతాయన్న నమ్మకం రెండు నెలల్లో 15 శాతం తగ్గిన విమాన ఇంధన ధరలు ఆఫర్లతో పెరుగుతున్న ప్రయాణికులు ఝున్ఝున్వాలా వాటా కొన్న వార్తలతో 16% పెరిగిన స్పైస్ జెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా భారీ నష్టాలతో సతమతమైన దేశీయ విమానయాన రంగానికి మంచి రోజులు రాబోతున్నాయా? అంతర్జాతీయంగా తగ్గుతున్న ఇంధన ధరలు దీనికి అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. గత మూడు నెలల్లో 10 శాతం తగ్గిన విమాన ఇంధన ధరలు తాజాగా మరో 4 శాతం తగ్గాయి. దీంతో గత మూడు నెలల్లో ఇంధన ధరలు 14 శాతం దిగిరావడంతో విమానయాన సంస్థలు సంతోషంలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో కిలో లీటరు విమాన ఇంధన ధర రూ.70.04గా ఉంటే అది ఇప్పుడు రూ. 59,94కి పడిపోయింది. ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిని తగ్గించకూడదని నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్న విషయం విదితమే. విమానాల నిర్వహణా వ్యయంలో అత్యధిక శాతం 40 నుంచి 50 శాతం ఇంధనానిదే ఉండటంతో ధరల తగ్గుదల ఈ రంగానికి పెద్ద ఊరటినిస్తుందంటున్నారు. తగ్గనున్న నష్టాలు... గత ఆర్థిక ఏడాదిలో దేశీయ విమానయాన సంస్థలన్నింటికీ కలిపి సుమారు రూ. 10,600 కోట్ల నష్టాలు వస్తే, ఇంధన ధరల తగ్గింపు వల్ల ఈ నష్టాలు రూ. 8,000 కోట్లకు తగ్గుతాయని ఆసియా పసిఫిక్ ఏవియేషన్ సంస్థ అంచనా వేసింది. లాభాల్లో నడుస్తున్న ఏకైక విమానయాన సంస్థ ఇండిగో గతేడాది ఇంధన వ్యయం రూ.5,500 కోట్లుగా ఉందని, ఇంధన ధరలు తగ్గడం వల్ల సుమారు రూ. 350 కోట్ల ప్రయోజనం లభించనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలకు ఈ ఏడాది నష్టాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 10 శాతం ఇంధన ధరలు తగ్గినప్పుడే స్పైస్ జెట్ రూ. 320 కోట్ల ప్రయోజనం లభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది స్పైస్ జెట్ ఇంధన బిల్లు రూ. 3,252 కోట్లు ఉంటే నష్టాలు రూ.1,003 కోట్లుగా ఉన్నాయి. ప్రపంచంలోనే విమాన టికెట్ల ధరలు ఇండియాలోనే తక్కువగా ఉండటంతో టికెట్ల ధరలు ఇంత కంటే తగ్గే అవకాశం లేదని, ఈ తగ్గింపుతో నష్టాలను పూడ్చుకోనున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. షేర్ల ధరల జోరు... ఇంధన ధరలు తగ్గుతుండటంతో కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు విమానయాన కంపెనీల షేర్లపై దృష్టిసారిస్తున్నారు. దీనికితోడు దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా నష్టాల్లో ఉన్న స్పైస్ జెట్లో వాటా పెంచుకున్నారన్న (75 లక్షల షేర్ల కొనుగోలు) వార్తలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మరింత పెంచింది. దీంతో గత ఐదు రోజుల్లో ఈ రంగ షేర్లు 45 శాతం పైగా పెరిగాయి. జెట్ ఎయిర్వేస్ షేరు 47 శాతం వృద్ధితో రూ. 241 నుంచి రూ. 354కు పెరిగితే, స్పైస్ జెట్ షేరు 45 శాతం వృద్ధితో రూ. 14.75 శాతం నుంచి రూ. 21.40కి చేరింది. కష్టాల్లో ఉన్న ఈ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం కొత్త ఏవియేషన్ పాలసీ రూపొందిస్తుండటం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, ఇంధన ధరలు తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారని జెన్మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అన్నారు. ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నా... కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటంతో రానున్న కాలంలో కంపెనీల మధ్య ఉండే ధరల యుద్ధంపై షేర్ల ధరలు కదులుతాయన్నారు. గత కొంత కాలంగా దేశీయ విమానయాన సంస్థలు చౌకటికెట్ల ఆఫర్లు ప్రయాణికులను ఆకర్షించడంలో సఫలమయ్యాయి. స్పైస్జెట్ లోడ్ ఫ్యాక్టర్ 69 శాతం నుంచి 82 శాతానికి చేరితే, జెట్ ఎయిర్వేస్ది 77 శాతం నుంచి 79 శాతానికి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. -
పెట్టుబడుల్లో వైవిధ్యం ఎందుకంటే...
పెట్టుబడుల్లో ముఖ్యంగా దీర్ఘకాలిక దృష్టితో చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో వైవిధ్యం చూపడం అనేది చాలా కీలకమైన విషయం. ఒకే రంగానికి చెందిన వాటిల్లో పెట్టుబడి పెట్టకుండా ఈ మొత్తాన్ని విభిన్న రంగాలకు మళ్లించడం ద్వారా సాధ్యమైనంత వరకు నష్టభయాన్ని తగ్గించుకోవడమే కాకుండా లాభాలను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యత చూపడం వల్ల నష్టాలు పూర్తిగా ఉండవని కాదు, కాని దీనివల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల్లో వైవిధ్యం ఎందుకు ఉండాలో ఇప్పుడు సోదాహరణంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఎయిర్లైన్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒకరోజు హఠాత్తుగా పైలట్లు సమ్మెకి దిగితే ఎయిర్లైన్స్ షేర్లన్నీ కుప్పకూలుతాయి. అప్పుడు తీవ్ర నష్టాలు తప్పవు. అదే ఎయిర్లైన్స్తోపాటు రైల్వే వంటి ఇతర రవాణా రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వైవిధ్యత చూపిస్తే, ఈ నష్టం సాధ్యమైనంత వరకు తగ్గిపోతుంది. ఎందుకంటారా.. పైలట్ల సమ్మెతో విమానాలు నిలిచి పోతే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలైన రైల్వేలను ప్రయాణికులు ఆశ్రయిస్తారు. దాంతో వాటి ఆదాయం పెరిగి ఆ షేర్లు పెరుగుతాయి. అప్పడు ఎయిర్లైన్స్ షేర్ల వల్ల వచ్చిన నష్టాలను రైల్వే షేర్లతో పూడ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేడప్పుడు రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీ, బులియన్, రియల్ ఎస్టేట్, డెట్ వంటి అన్ని పథకాలకూ విస్తరించాలి. ఇవి కాకుండా అసలు రిస్క్ లేని గవర్నమెంట్ సెక్యూరిటీలు, పోస్టాఫీసు, రికరింగ్ డిపాజిట్లు వంటి వాటిల్లో కూడా కొంతమేర కేటాయించే విధంగా చూసుకోండి. రిస్క్ తక్కువ ఉన్న సాధనాలకు ఎక్కువ కేటాయిస్తే ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉన్న పథకాలకు కేటాయిస్తూ వెవిధ్యం చూపించాలి. అప్పుడే రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్థిరమైన సంపదను సృష్టించుకునే వెసులుబాటు కలుగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement