-
ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లోని టూరిజం ప్లాజా ప్రాంగణంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఆదాయపన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని కోరారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో 30% ఫిట్మెంట్ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇచ్చా రని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరితే, దాన్ని రాష్ట్రాలపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ చైర్మన్ కామ్రేడ్ సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకుమార్ల అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాలలో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. అలాగే కోవిడ్తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు లాంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. -
వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు
హన్మకొండ అర్బన్: రాణిరుద్రమ, మేడారం సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తిగా వరంగల్ గడ్డపై పుట్టిన మహిళలు ఉద్యమంలో ముందుండి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహిళా ఉద్యోగుల పాత్ర మరువలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శనివారం వరంగల్ నిట్ ఆడిటోరియంలో జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) 5వ జాతీయ సదస్సులో కవిత ప్రసంగించారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించాల్సిన సదస్సును వరంగల్లో నిర్వహించడానికి కారణం.. ఇక్కడి మహిళల పోరాట పటిమ దేశానికి చాటేందుకేనని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులు ఇక్కడి మహిళల పోరాటస్పూర్తితో తమ రాష్ట్రాల్లో, కేంద్రంపైనా సమస్యల సాధనకు ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో పాతపెన్షన్ అమలుకు కృషి 2004 నుంచి ప్రభుత్వం తీసుకువచ్చిన సీపీఎస్ పెన్షన్పద్ధతిపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణమద్దతు ఉంటుందని కవిత అన్నారు. తెలంగాణలో సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్నే అమలుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని, ఉద్యోగుల సమస్యల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు. కేంద్రం నిధులు తగ్గించినా సీఎం రాష్ట్రంలోని అంగన్వాడీలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల బాలల సంరక్షణ సెలవు మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు వారికి నోటీసులు జారీచేసిందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్లనే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంపునకూ.. ప్రస్తుతం మహిళా ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి రూ. 2.50 లక్షలుగా ఉందని, దీనికి రూ.6 లక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని కవిత చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న ఈ డిమాండ్పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తె స్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలు 16శాతం మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం అధ్యక్షతన జరిగిన సదస్సులో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కార్యదర్శి హమీద్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేచల్, 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. 10 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్ వరంగల్ నిట్ ఆడిటోరియంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ ముత్తుసుందరం అధ్యక్షతన జరిగిన ఐదో జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన 10 డిమాండ్లను వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వాల ముందుంచారు. అవి.. 1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2) ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. 3) కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామక విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి. 4) ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి. 6) ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలి 7)ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో పిల్లల సంరక్షణాలయాలు ఏర్పాటు చేయాలి. 8) పదోన్నతుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. 9) అధిక పనిభారంతో రాత్రివేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. 10) అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యక ర్తలను వెంటనే పర్మినెంట్ చేయాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement