-
దేశ రక్షణలో రాజీ లేదు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకాదళం నేవల్ బేస్ పరేడ్ గ్రౌండ్లో ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్మ్డ్ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సబ్మెరైన్, యుద్ధనౌకల సిబ్బంది, సీ కేడెట్ కార్ప్స్ మార్చ్ పాస్ట్, రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ జైన్ మాట్లాడుతూ విద్రోహుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ తీర భద్రత విషయంలో అవసరమైన నౌకలు, సబ్మెరైన్లు, యుద్ధవిమానాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారత సముద్ర భాగంలో భద్రత పెంచేందుకు అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రక్షణ విషయంలో నౌకాదళం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిడ్–19 సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారిని అభినందించారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ ఎంపిక
సాక్షి, అమరావతి : రాజ్యాంగ బద్దమైన రాష్ట్ర సమాచార కమిషన్కు ముఖ్య కమిషనర్ ఎంపిక ప్రక్రియను చంద్రబాబు సర్కారు అపహాస్యం చేసింది. తనకు గూఢచర్యం నెరిపే అధికారికి ఈ అత్యున్నత పదవికి కట్టబెట్టేందుకు నిబంధనలను తుంగలో తొక్కింది. రాష్ట్ర కేడర్కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జిల్లా జడ్జిలను కాదని.. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిని చీఫ్ కమిషనర్గా ఎంపిక చేసింది. ఇందుకోసం నిబంధనలను తుంగలో తొక్కింది. ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ను సైతం చిత్తుపేపర్లా మార్చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పారదర్శకతకు పాతరేస్తూ జైన్ ఎంపిక కోసమే ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేశారంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా విచారణలో ఉంది. అంతేకాదు.. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సమావేశానికి ప్రతిపక్ష నేతను ఆహ్వానించకుండానే చీఫ్ కమిషనర్ను ఎంపిక చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఏకే జైన్ను చీఫ్ కమిషనర్గా నియమించాలని బాబు సర్కారు ముందుగానే నిర్ణయించుకోవడంపై సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. చీఫ్ కమిషనర్ పోస్టుకు 20, కమిషనర్ పోస్టులకు 280 దరఖాస్తులు చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సమాచార హక్కు కమిషనర్లు, చీఫ్ కమిషనర్ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. దీంతో సమాచార హక్కు చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల పోస్టులను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అనంతరం 2017 ఆగస్టు 16వ తేదీన చీఫ్ కమిషనర్ పోస్టుకు, ముగ్గురు కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానిలో 2017 అక్టోబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అనంతరం అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్కు స్పందిస్తూ చీఫ్ కమిషనర్ పోస్టుకు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జిల్లా జడ్డీలు కలిపి మొత్తం 20 మంది, మూడు కమిషనర్ పోస్టులకు 280 మంది దరఖాస్తు చేశారు. ఏకే జైన్ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్ ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఒక సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ చేయాల్సి ఉంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన తేదీన సమావేశానికి రావాల్సిందిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన పాదయాత్రలో ఉన్నందున తన తరఫున ఒకరు వస్తారని ప్రభుత్వానికి సూచించారు. అయితే నిర్ధారించిన తేదీన సమావేశం జరగలేదు. తర్వాత 2018 జూలై 12న చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల ఎంపిక సమావేశం జరిగింది. ఇందులో చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ను, కమిషనర్లుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి బీవీ రమణకుమార్, అడ్వకేట్ ఎం.రవికుమార్, కట్టా జనార్దన్ను నియమించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. అయితే చీఫ్ కమిషనర్గా ఎంపిక చేసిన ఏకే జైన్ అసలు దరఖాస్తు చేయలేదని, ఆయన నీతి ఆయోగ్లో సలహాదారుగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ముగ్గురు కమిషనర్లను ఎంపిక చేస్తూ సంబంధిత ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ నర్సింహన్.. చీఫ్ కమిషనర్ లేకుండా కమిషనర్లు ఏం చేస్తారని, నోటిఫికేషన్ జారీచేసి కూడా చీఫ్ కమిషనర్ను ఎంపిక చేయకపోవడమేంటంటూ ఫైలును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై సీఎం చంద్రబాబు గవర్నర్తో మాట్లాడి మళ్లీ ఆ ఫైలును పంపగా గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ దరఖాస్తు చేసేందుకు వీలుగా గతంలో జారీచేసిన నోటిఫికేషన్ను కాదని.. కొత్తగా 2018 ఆగస్టు 24వ తేదీన మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గతేడాది సెప్టెంబర్ 10ని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దీంతో ఏకే జైన్ ఆగస్టు 31న నీతి ఆయోగ్ నుంచి రిలీవ్ అయి.. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్చేసి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చీఫ్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. -
సీబీడీటీ తాత్కాలిక చైర్మన్గా ఏకే జైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాత్కాలిక చైర్మన్గా సీనియర్ రెవెన్యూ అధికారి ఏకే జైన్ నియమితులయ్యారు. జైన్ 1978 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. ఇప్పటి వరకు సీబీడీటీ చైర్మన్గా వ్యవహరించిన అనితా కపూర్ సోమవారం పదవీ విరమణ చేశారు. ఇకపై అనితా కపూర్ ఆరు నెలలపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో పన్ను సంస్కరణల సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆమె పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సర్వీసులను అందించడానికి, రానున్న బడ్జెట్ రూపకల్పనకు, ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళతరం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషించనున్నారు. అనితా కపూర్ పన్ను సంబంధిత సంస్కరణల విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు తగిన సూచనలను, సలహాలను అందిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఆమె ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల రీ-డ్రాఫ్టింగ్కు కోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్.వి. ఈశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి సహాయకురాలిగా వ్యవహరిస్తారని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement