-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ గణతంత్ర వేడుకలకు సరిగ్గా నెల రోజుల ముందు దేశంలో ఉలికిపాటు. దేశంలో భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ – నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చాకచక్యంగా పట్టుకుని వారి కుట్రను భగ్నం చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్న, హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను ఎన్ఐఏ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలే వీరి లక్ష్యమనీ, సంస్థలోని సభ్యులంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వెల్లడించింది. అరెస్టయిన వారంతా ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్రా లేని వారేననీ, ఉత్తరప్రదేశ్లోని ఆమ్రోహాకు చెందిన ఓ ముఫ్తీ (ముస్లిం మతాచారాలపై తీర్పులిచ్చే న్యాయ నిపుణుడు) కూడా వీరిలో ఉన్నాడనీ, ఇతనే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అని ఎన్ఏఐ ఐజీ అలోక్ మిత్తల్ చెప్పారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్, ఆమ్రోహ, లక్నోల్లో సోదాలు జరిపి, స్థానికంగా తయారు చేసుకున్న రాకెట్ లాంచర్ సహా పలు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సోదాల అనంతరం హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాంకు చెందిన మొత్తం 16 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిని విచారించి 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసింది. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని అలోక్ మిత్తల్ చెప్పారు. సమాచారంతో ముందస్తుగానే నిఘా సోదాల్లో చేతితో తయారు చేసిన ఆయుధాలు, ఇంకా పరీక్షించాల్సి ఉన్న రాకెట్ లాంచర్, ఆత్మాహుతి జాకెట్ల తయారీకి ఉపయోగించే పదార్థాలు, వంద అలారం గడియారాలు, 12 నాటు తుపాకీలు, వందలకొద్దీ బుల్లెట్లు, వంద మొబైల్ ఫోన్లు, 135 సిమ్కార్డులు, ఏడున్నర లక్షల రూపాయల డబ్బు, బాంబు తయారీలో వాడే పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితరాలను భారీ మొత్తాల్లో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఏయే ప్రభుత్వ సంస్థలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయాలో ఇప్పటికే వారు రెక్కీ నిర్వహించారనీ, మరికొన్ని రోజుల్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారని అలోక్ చెప్పారు. హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం ప్రణాళికల గురించి తమకు ముందుగానే సమాచారం వచ్చిందనీ, అప్పటి నుంచి వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టిందన్నారు. అనుమానిత ఉగ్రవాదులు చాలా వేగంగా బాంబులు తయారు చేస్తూ పోతుండటంతో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలోని ఉగ్రవాద వ్యతిరేక దళంతో కలిసి ఎన్ఐఏ వారి కుట్రను బుధవారం భగ్నం చేశామని అలోక్ తెలిపారు. వీరి హిట్ లిస్ట్లో ఢిల్లీ పోలీస్, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఇతర దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ ‘ఇతర సంస్థలు వారికి ఇష్టమొచ్చింది ఏదైనా చెప్తాయి. ఈ కేసును దర్యా ప్తు చేస్తున్నది మేము. ఆధారాల్లేకుండా మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అన్నారు. నెట్లో చూసి నేర్చుకున్నారు! ఎన్ఐఏ ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను ఆమ్రోహాలో, మరో పది మందిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన నిధులను హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం సభ్యులు సొంతంగానే సమకూర్చుకున్నారంది. ‘పేలుడు పదార్థాల తయారీలో వీరు ఇప్పటికే చాలా పురో గతి సాధించారు. బాంబులను ఇక జతపరచడమే తరువాయి. ఆ తర్వాత రిమోట్ కంట్రో ల్ బాంబులతో, ఆత్మాహుతి దాడులతో, పైప్ బాంబులతో దేశంలో భయోత్పాతం సృష్టించాలనేది వీరి ప్రణాళిక’ అని అలోక్ మిత్తల్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముఫ్తీ మహ్మద్ సుహైల్ (29)తోపాటు నోయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, హ్యుమానిటీస్లో గ్రాడ్యుయేషన్ మూడో ఏడాది చదువుతున్న మరో విద్యార్థి కూడా ఉన్నారని అలోక్ చెప్పారు. మరో ఇద్దరు వెల్డింగ్ పని చేసుకుని జీవనం సాగించేవారన్నారు. ‘దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం హర్కత్ సంస్థను మూడు, నాలుగు నెలల క్రితం సుహైల్ స్థాపించి, వివిధ వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నాడు. వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్ల ద్వారా వారు సంభా షించుకున్నారు. బాంబులు ఎలా చేయాలో వీరికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదనీ, ఇంటర్నెట్లో చూసి సొంతంగానే నేర్చుకున్నట్లు ప్రాథమి కంగా తెలుస్తోంది’ అని అలోక్ వివరించారు. సోదాల్లో తమకు ఓ వీడియో లభించిందనీ, బాంబులు ఎలా తయారు చేయాలో సుహైల్ ఇతరులకు సూచనలిస్తూ రూపొందించిన వీడియో అది అని తెలిపారు. విద్యార్థులు.. వెల్డర్లు.. ఇమామ్లు న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర ముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారందరి వయసు 20–35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా, మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహ్మద్ సుహైల్ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. వారి వ్యక్తిగత వివరాలిలా ఉన్నాయి. 1. ముఫ్తీ మహ్మద్ సుహైల్ అలియాస్ హజ్రత్ (29): ఈ బృందం వ్యవస్థాపకుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన హజ్రత్ స్థానిక మదరసాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3–4 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించి ఆన్లైన్లో ఐసిస్ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారుచేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. 2.అనాస్ యూనస్ (24): జఫ్రాబాద్కు చెందిన యూనస్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాంబులు తయారుచేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు. 3.రషీద్ జాఫర్ రఖ్ అలియాస్ జాఫర్ (23): జఫ్రాబాద్కు చెందిన ఇతడు బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 4.సయీద్ (28): అమ్రోహాలోని సైదాపూర్ ఇమ్మాకు చెందినవాడు. వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న ఇతడు పిస్టల్స్, రాకెట్ లాంచర్లను తయారుచేశాడు. 5.రాయీస్ అహ్మద్: సయీద్కు సోదరుడు. ఇతనికి కూడా వెల్డింగ్ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారుచేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్పౌడర్ను సేకరించారు. 6.జుబైర్ మాలిక్ (20): జఫ్రాబాద్కు చెందిన మాలిక్ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 7.జైద్ (22): జుబైర్ సోదరుడు. నకిలీ పత్రాలతో సోదరులిద్దరూ సిమ్ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగిలించి డబ్బు సమకూర్చుకున్నారు. 8.సాకిబ్ ఇఫ్తికార్ (26): ఉత్తరప్రదేశ్లోని హాపూర్కు చెందినవాడు. బక్సార్లోని మదరసాలో ఇమామ్గా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్కు సాయం చేశాడు. 9.మహ్మద్ ఇర్షాద్ (28): ఆటోరిక్షా నడిపే ఇర్షాద్ అమ్రోహా నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్కు సాయం చేశాడు. 10. మహ్మద్ ఆజామ్ (35): ఢిల్లీలోని చౌహాన్ బజార్ నివాసి. మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్కు సాయం చేశాడు. బుధవారం జఫ్రాబాద్లో తనిఖీల్లో పాల్గొన్న ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు -
మనీ, మందుకు చెక్..!
గుర్గావ్: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధానంగా ఉపయోగించే డబ్బు, మందుకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ, గుర్గావ్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హర్యానా నుంచి నగరంలోకి అక్రమంగా మందు, డబ్బు రవాణా కాకుండా సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీ, గుర్గావ్ పోలీసు ఉన్నాధికారులు ఇటీవల ఈ విషయమై సమావేశమయ్యారని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గూండాలకూ అడ్డుకట్ట... ప్రలోభాలకు లొంగనివారిని భయపెట్టడం కొత్త ట్రెండ్గా మారిన ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు గూండాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ పనికి ఎక్కువగా పహిల్వాన్లను ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత భద్రత పేరుచెప్పి వీరిని రంగంలోకి దించుతూ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ పహిల్వాన్లను హర్యానాలోని అఖాడాలు ఎక్కువగా సరఫరా చేస్తుంటాయి. ఇటువంటి అఖాడాలు గుర్గావ్, ఢిల్లీల్లో లేకపోవడంతో హర్యానా నుంచే తె ప్పించుకోవాల్సి వస్తోంది. ఈ విషయంపై కూడా దృష్టిసారించిన పోలీసులు గూండాలు, పహిల్వాన్ల రాకపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం... నగర సరిహద్దుల వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలతో ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అనుమానం వచ్చిన వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారీకేడ్ల మార్గంలోకి పంపుతూ మిగతా వాహనాలను యథావిధిగా పంపుతున్నారు. తాము తీసుకుంటున్న భద్రతా చర్యలవల్ల ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ఎన్నికల వరకు ఈ అవస్థలు పడక తప్పదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రశాంతతే మా లక్ష్యం.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే తమ లక్ష్యమని నోయిడా కమిషనర్ అలోక్ మిట్టల్ తెలిపారు. అందుకే ఢిల్లీ నగరంలోకి ఎటువంటి మద్యం, నగదు, ఆయుధాలు సరఫరా కాకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా అసాంఘిక శక్తుల రాకను కూడా అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అనుమానిత వ్యక్తులుగానీ, మందు, నగదు పట్టుబడలేదని చెప్పారు. రాత్రి సమయాల్లో గుర్గావ్ ఎక్సైజ్ విభాగం కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటోందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement