-
టాటా మరో వికెట్ డౌన్
ముంబై: టాటా గ్రూపు నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఆయన సన్నిహితులపై టాటా గ్రూపు వేటు వేసింది. దీంతోపాటు మిస్త్రీ అనుయాయులు కొంతమంది రాజీనామా చేశారు. అయితే తాజాగా టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్ బెవరేజెస్ సంస్థ బోర్డుకు మరో డైరెక్టర్ గుడ్ బై చెప్పారు. టాటా బేవరేజెస్ స్వతంత్ర డైరెక్టర్, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీ ఛైర్మన్ అనల్జిత్ సింగ్ మంగళవారం రాజీనామా చేశారు. నవంబరు 15న జరిగి టాటా గ్లోబల్ బోర్డు సమావేశంలో మిస్త్రీకి ఉద్వాసనకు వ్యతిరేకంగా వాదించిన డైరెక్టర్లలో అనల్జిత్ కూడా ఒకరు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా చేశారని టాటా గ్లోబల్ ప్రకటించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా టాటా గ్రూపు నుంచి ఛైర్మన్గా తొలగించిన సైరస్ మిస్త్రీని టాటా గ్లోబల్ ఇటీవల తొలగించింది. పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపు నేపథ్యంలోనే టాటా గ్లోబల్ కూడా మిస్త్రీని ఛైర్మన్ గా తొలగించిని సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ ఇండియా.. ఇక బ్రిటిష్ కంపెనీ
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా సబ్సిడరీలోని మైనారిటీ షేర్హోల్డర్ల వాటాలను రూ.10,141 కోట్లతో కొనుగోలు చేయడానికి యునెటైడ్ కింగ్డమ్కు చెందిన వొడాఫోన్ గ్రూప్ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద ఏకమొత్తం విదేశీ పెట్టుబడి ఇదే. కొనుగోలు పూర్తయిన తర్వాత పూర్తిగా విదేశీ సంస్థ ఆధీనంలో ఉండే కంపెనీగా వొడాఫోన్ ఇండియా ఆవిర్భవించనుంది. వొడాఫోన్ గ్రూప్ ప్రతిపాదనను ఆమోదించినట్లు గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం అనంతరం ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. టెలికంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను అనుమతిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయించడం విదితమే. చందాదారుల సంఖ్య పరంగా దేశంలో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఇండియాలో ప్రస్తుతం 64.38% వాటా వొడాఫోన్ గ్రూప్నకు ఉంది. మైనారిటీ షేర్హోల్డర్లలో అజయ్ పిరమల్ వద్ద 10.97%, వొడాఫోన్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జీత్ సింగ్ వద్ద 24.65% షేర్లున్నాయి. వీటి కొనుగోలుకు గాను అనల్జీత్ సింగ్కు రూ.1,241 కోట్లు, పిరమల్కు రూ.8,900 కోట్లను వొడాఫోన్ గ్రూప్ చెల్లించనుంది. పిరమల్కంటే ఎక్కువ వాటా వున్న అనల్జీత్కు బాగా తక్కువ మొత్తం చెల్లించడానికి సింగ్, వొడాఫోన్ల మధ్య ఒప్పందమే కారణం. సింగ్కు చెందిన మరో కంపెనీలో పరోక్షంగా వొడాఫోన్ పెట్టుబడి చేయడం దీని నేపథ్యం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
Advertisement