-
కరోనా: ఇంట్లోనే చికిత్స మంచిది కాదు
చెన్నై : కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, పీఎంకే రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. కేసుల సంఖ్య పెరుగుతుందని ఇంటికి పంపించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తె అవకావం ఉందని పేర్కొన్నారు. చాలామంది ఇళ్లలో ఐసోలేషన్ సదుపాయాలు ఉండవని దీని వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుందని తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు నిండిపోయాయని, కొత్తగా వైరస్ సోకిన వారు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందాలన్న తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులు షాక్కి గురిచేశాయన్నారు. (49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా) చెన్నైలోని కళాశాలలు, హాస్టళ్లు, హాళ్ళు ఇండోర్ స్టేడియంలను గుర్తించి కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందించాలని అన్బుమణి రాందాస్ రాష్ట్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. దీని వల్ల రోగులను ఇంటికి పంపించకుండా నిత్యం వైద్యుల సంరక్షణలో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న కొందరి ఇళ్లలో భౌతిక దూరం పాటించడం కూడా కష్టమైన అంశమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ బాధితుల్ని ఇంటికి పంపిస్తే మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. (జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్లో కేజ్రీవాల్) -
అన్బుమణి రాందాస్కు గుండెపోటు..!
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ సభ్యుడు అన్బుమణి రాందాస్కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. పీఎంకే యూత్వింగ్ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణి రాందాస్ ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. -
‘జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ను పీఎంకే యూత్వింగ్ నాయకుడు అన్బుమణి రాందాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి చేసినవారికే ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని, ఈ పురస్కారం పొందే అర్హత జయలలితకు లేదని ఆయన పేర్కొన్నారు. జయలలిత 15 అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారని, ఆమెను నిర్దోషిగా వదిలేసిన కేసుకు సంబంధించి అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని రాందాస్ ’’ద హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఏకవ్యక్తి పార్టీ కావడంతో జయలలిత మృతితో తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రానున్న నాలుగున్నరేళ్లు అధికారంలో నిలుపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిజానికి శశికళకు ప్రజామద్దతు లేదని చెప్పారు. జయలలిత ఏనాడు ఆమెను తన రాజకీయ వారసురాలిగా పరిగణించలేదని, ఒకవేళ పరిగణించి ఉంటే ఈపాటికే ఆమెకు పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. -
కుట్రతో ముంచేశారు!
టీనగర్: ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, రెండు ద్రావిడ పార్టీలు పథకం ప్రకారం ముంచేశాయని పీఎంకే యువజన సంఘం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచివున్నామన్నారు. లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని అన్నాడీఎంకే, డీఎంకేలు తమ మేనిఫెస్టోలోను పేర్కొన్నాయన్నారు. మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న నినాదాన్ని డిఎంకే కూడా ప్రకటించిందన్నారు. దీంతో పథకం ప్రకారం ద్రావిడ పార్టీలు తనను ఓడించాయన్నారు. అయినప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచివున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ధర్మపురి జిల్లాలో కొత్త రైల్వే పథకాలు ప్రవేశపెట్టానని అన్నారు. నగదు అందుకోకుండా పీఎంకేకు ఓటు వేసిన 23 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని, మరికొన్ని రోజుల్లో పార్టీ నిర్వాహక కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పీఎంకేకు పెరిగిన ఓట్ల శాతం: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి పతనం కగా పీఎంకేకు ఇబ్బంది లేకుండా పోయింది. 2011 ఎన్నికల్లో పీఎంకే 5.23 శాతం ఓట్లు పొందింది. ఈ దపా పిఎంకేకు 5.30 శాతం ఓట్లు లభించాయి. పీఎంకే ఓటు బ్యాంకులో 0.07 ఓట్లు పెరిగాయి. ఉత్తర జిల్లాలలో పీఎంకే అభ్యర్థులు 88 శాతం వన్నియర్ల ఓట్లను పొందినట్లు పరిశీలనలో తేలింది. -
'తమిళనాడులో పోలింగ్ వాయిదా వేయండి'
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి పీఎంకే నేత అన్బుమణి రాందాస్ విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని, సోమవారం(మే 16) జరగనున్న ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. 'తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు పంచారు. వీరి నామినేషన్లు రద్దు చేసి ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికం గా వాయిదా వేయాల'ని లేఖలో రాందాస్ కోరారు. డబ్బులు పంచుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను పట్టిచ్చిన తమ అభ్యర్థిపై కేసు పెట్టారని ఆయన ఈసీకి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
తప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
Advertisement