-
'ఆస్తుల వివరాలు ఇవ్వడం కుదరదు'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరుతూ ముంబైకి చెందిన అనిల్ గాల్గానీ.. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గత ఐదేళ్లలో సీఎం, మంత్రుల ఆస్తులు వివరాల కావాలని అందులో కోరారు. ఆస్తుల వివరాలు సమర్పించని వారిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే అనిల్ గాల్గానీ అడిగిన వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవడం పట్ల సమాచార హక్కు మాజీ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మూర్కత్వంలో వ్యవహరించిందని విమర్శించారు. -
‘ఎనిమిది నెలల్లో 229 రేప్లు’
ముంబై: వాణిజ్య రాజధాని రేప్ రాజధానిగా మారిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు నగరంలో 229 అత్యాచారాలు, ఎనిమిది సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఎనిమిది నెలల్లోనే నమోదైన ఈ కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. సామాజిక కార్యకర్త అనిల్ గల్గలీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఈ విషయాలు ముంబైకర్లను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అనిల్ అన్నారు. నగర శివారు ప్రాంతం దిందోషి, బోరివలిలో మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారాలు నవంబర్లో రెండు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇదిలావుండగా దేశంలో సురక్షిత నగరం ముంబై అని పోలీసులు అంటున్నారు. అనేక కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ అత్యాచారాలు చేశారని తెలిపారు. ఇందుకు గతంలో జరిగిన కేసులే నిదర్శనమని ముంబై పోలీసు అసిస్టెంట్ కమిషనర్ భగవాన్ చటే అన్నారు. శక్తి మిల్స్ గ్యాంగ్రేప్ ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు అని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఇలాంటి నేరాలను సాధ్యమైనంత మేర అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Chicken
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
టీ20 వరల్డ్కప్ కోసం జట్టును ప్రకటించిన కెనడా
ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..
పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement