-
నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు
ముంబై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ మరో అడుగు ముందుకేసి మిషన్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. కరోనా ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పేద, వలస కూలీలకు అన్నదానం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. భారత్లో లాక్డౌన్ గడువును పొడిగించడంతో పేదలు, రోజువారీ కూలీల దయనీయ పరిస్థితులను చూసి చాలా బాధేసిందని అన్నారు. అందుకే వారికి ఆహారం అందించేందుకు మిషన్ అన్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. దీని ద్వారా 3 కోట్ల మంది నిరుపేదలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఓ కార్పోరేట్ సంస్థ చేస్తున్న అతి పెద్ద అన్నదాన పంపిణీ కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా అక్షరాల 535కోట్ల రూపాయల విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది రిలయన్స్ సంస్థ. -
లండన్లో వైఎస్సార్ అన్నదాన కార్యక్రమం
లండన్: ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమంలో దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 300 మందికి రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మంచి పనులు, వారి గొప్ప నాయకత్వాన్ని స్మరించుకోవటం విశేషం. వైఎస్సార్సీపీ యుకే & యురోప్ వింగ్ కార్యకర్తలు సందీప్ రెడ్డి వంగల, శివ కుమార్ రెడ్డి చింతం, డా. ప్రదీప్ కుమార్ రెడ్డి చింతా, అబ్బయ చౌదరి కొఠారి, సతీష్ వనహారం, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, భగవాన్ రెడ్డి , కోటి రెడ్డి కల్లం, పిసి రావు, సురేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి పాతపాటి, ప్రదీప్ కుమార్ రెడ్డి కత్తి, రవి మోచెర్ల, భాస్కర్ రెడ్డి మాలపాటి, సునీల్ రెడ్డి చవ్వా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు లండన్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement