-
బస్సులు ఢీ కొని ఇద్దరి దుర్మరణం
హైదరాబాద్: డ్రైవర్ల నిర్లక్ష్యం ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఒకే మార్గంలో రెండు బస్సులు ఢీ కొట్టిన ఘటనల్లో డిగ్రీ విద్యార్ధి, టీవీ మెకానిక్ మృత్యువాత పడ్డారు. గోపాలపురం హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం.. ఖైరతాబాద్ చింతల్బస్తీలోని విజయ్కుమార్జైన్ నివాసి కుమారుడు అనూప్జైన్ (19) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహంపై రెజిమెంటల్ బజార్లోని తన మేనమామ మహవీర్చంద్ జైన్ ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి మిత్రుడిని కలిసేందుకు సంగీత్ చౌరస్తాకు వస్తున్న క్రమంలో రాణిగంజ్ ఒకటో డిపో బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అనూప్ సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటన..పాతబస్తీ ఆలీజాకోటకు చెందిన మహ్మద్ సనావుల్లా (62) టీవీ మెకానిక్షాపు నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం యాఖుత్పురా నుంచి ఎంఎంటీఎస్ రైలులో తన కుమారుడు నవీదుల్లాతో కలసి సికింద్రాబాద్ బయలుదేరాడు. ఆలుగడ్డబావి సమీపంలో ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ దొరకని కారణంగా నిలిపివేశారు. ఇంతలో రైలు దిగిన సనావుల్లా అతని కుమారుడు రోడ్డు మీదకు వస్తున్నాడు. రోడ్డుపైకి చేరుకుంటుండగానే సనావుల్లా కాలు జారి పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి దూసుకువెళ్లింది. ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన బస్సు, డ్రై వర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
యువ భారతీయునికి గ్లోబల్ సిటిజెన్ అవార్డు
న్యూయార్క్: ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజెన్ అవార్డును, తద్వారా లక్ష డాలర్ల నగదు పురస్కారాన్ని ఓ యువ భారతీయుడు గెలుచుకున్నారు. పారిశుద్ధ్య వసతులు కల్పించడంలో చేసిన కృషికిగానూ అనూప్ జైన్ అనే భారతీయుడు 2014 సంవత్సరానికి ‘వెయిస్లిట్జ్ గ్లోబల్ సిటిజెన్’ పురస్కారానికి ఎంపికయ్యారు. 2011లో బీహార్లో హుమనుర్ పవర్ (హెచ్పీ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన అనూప్ జైన్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించడంలో చొరవ తీసుకున్నారు. ఆయన చేసిన ఈ కృషే ప్రపంచ అవార్డు గెలుచుకునేందుకు దోహదపడింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
No Headline
నమ్మించి.. నట్టేట ముంచి
సిర్పూర్(టి) ఎంపీపీగా ఈర్త సత్యనారాయణ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
క్రిమినల్ కేసులు
న్యూస్రీల్
ఎల్కపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీ
వేడి.. ఉక్కపోత
● మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు విడుదల ● నాలుగు నెలల బకాయిలు ఖాతాల్లో జమ ● 3,584 సంఘాల ఖాతాల్లోకి రూ.2,43,61,125 ● జిల్లాలో 7,988 ఎస్హెచ్జీలు, 89,666 మంది సభ్యులు
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement