-
సల్మాన్ఖాన్ సోదరి పెళ్లి సందడి
-
వాహ్.. తాజ్ ఫలక్నుమా
షహర్కీ షాన్ ఫలక్నుమా ప్యాలెస్.. ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ స్పాట్. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం ఇక్కడ ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో ప్యాలెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చరిత్రాత్మక కట్టడాలలో ఫలక్నుమా ప్యాలెస్ది ప్రత్యేక స్థానం. ఫలక్నుమా అంటే ఆకాశదర్పణం అని అర్థం. చార్మినార్ కట్టడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు వేల అడుగుల ఎత్తయిన కొండపై దీన్ని నిర్మించారు. ఇటలీ వాస్తు నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ను పై నుంచి చూస్తే తేలు ఆకారంలో కనిపిస్తుంది. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ ప్రధానమంత్రి, పైగా వంశస్తుడు సర్ వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. 1884 మార్చి 3న శంకుస్థాపన జరగగా 1893లో నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. ఎంతో అందంగా తయారైన ఈ రాజ భవనాన్ని ఉమ్రా.. మీర్ మహబూబ్ అలీఖాన్కు 1895లో బహుమానంగా ఇచ్చారు. దీంతో 1898లో నిజాం నవాబు ఫలక్నుమా ప్యాలెస్ను తన గెస్ట్హౌస్గా మలచుకున్నారు. జీవిత చరమాంకాన్ని ఇదే ప్యాలెస్లో గడిపిన ఆయన, 1911లో ఇక్కడే తుదిశ్వాస విడిచారు. ప్యాలెస్కు స్వాగత తోరణంగా ఉన్న కమాన్ను ప్రస్తుతం ఫలక్నుమా ఆర్టీసీ బస్ డిపోకు ప్రవేశద్వారంగా మార్చారు. ప్రస్తుతం తాజ్ ఫలక్నుమా.. ఫలక్నుమా ప్యాలెస్.. నాలుగేళ్ల క్రితం తాజ్ ఫలక్నుమా ప్యాలెస్గా మారింది. ఏడో నిజాం మనుమడు ప్రిన్స్ ముఖరం జా అధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ను నాలుగేళ్ల కిందట తాజ్ గ్రూప్నకు లీజుకిచ్చారు. దీంతో శుభకార్యాలు, బోర్డు సమావేశాలు, విందులు, వినోదాలకు ఈ ప్యాలెస్ వేదికైంది. నగరంలోని అత్యంత ఖరీదైన హోటళ్లలో ఈ ప్యాలెస్ ఒకటి. నిజాం ఉపయోగించిన వస్తువులను, క్రీడాపరికరాలను, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులను, పుస్తకాలను ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో ప్రధాన సూట్లతో పాటు 60 రూమ్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అద్దె రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. నిజాం కాలం నాటి రాచమర్యాదలను ఈ హోటల్లో అందుకోవచ్చు. స్పెషల్ బాత్, స్పా, జావా, హెల్త్క్లబ్, స్విమ్మింగ్పూల్, స్మోకింగ్ ఏరియా, ఇటాలియన్ రెస్టారెంట్, హైదరాబాద్ స్పెషల్ (అదా) రెస్టారెంట్లు ఉన్నాయి. నిజాం నవాబుతో పాటు బేగం ఉపయోగించిన పరికరాలనూ ప్రదర్శనకు ఉంచారు. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కుర్చీలను అతిథులూ వాడుకోవచ్చు. గేమ్స్ రూమ్ ప్యాలెస్లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఓ అద్భుతం. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్, ఇటలీ నుంచి తెప్పించిన చెస్ బోర్డ్ ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కా ఏర్పాటు చేసి అతిథులకు అందిస్తున్నారు. ఇందులో ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ ఉన్నాయి. అదా రెస్టారెంట్ ప్యాలెస్లో అదా రెస్టారెంట్కు తాజ్ గ్రూపు ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ రుచులైన బిర్యానీ, పత్తర్కీ మటన్, ధమ్కీ చికెన్ తదితర వంటకాలతో పాటు ఆంధ్రాభోజనాన్నీ అందిస్తున్నారు. దీని పక్కనే చెలాస్రే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. స్మోకింగ్ ఏరియా ప్యాలెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన గార్డెన్ను స్మోకింగ్ జోన్గా వ్యవహరిస్తున్నారు. సంధ్య వేళలో దమ్ములాగుతూ.. నగర అందాలను వీక్షించవచ్చు. నిజాం సూట్ ప్యాలెస్లో నిజాం సూట్ అన్ని సూట్లలో (నంబర్ 204)లలో ఖరీదైనది. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ఈ సూట్లో నిజాం ఉపయోగించిన వస్తువులతో పాటు వివిధ దేశాల నుంచి సేకరించిన వస్తువులను అలంకరించారు. సూట్ పక్కనే అక్బర్ సూట్, షాజాదీ సూట్ ఇతర సూట్లు ఉన్నాయి. వీటితో పాటు 60 సూట్లు ఉన్నాయి. ప్యాలెస్లో స్పా.. ప్యాలెస్లో పూర్తి ఇండియన్ స్టైల్లో నిర్వహించే స్పా, యోగా సెంటర్ ఉన్నాయి. రెండున్నర గంటల పాటు నిర్వహించే స్పా కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలి. -కర్నాటి శ్రీనివాసగౌడ్ అతిపెద్ద డైనింగ్ హాల్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో నిజాం ఉపయోగించిన అతిపెద్ద డైనింగ్ హాల్ను అద్దెపై వినియోగించుకునే వీలు కల్పించారు. ఒకేసారి నూటొక్క (101) మంది అతిథులు ఈ హాల్లో విందారగించవచ్చు. పూర్తి ఇటాలియన్ ఫర్నిచర్, తొమ్మిది దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తు సామగ్రి ప్రత్యేక ఆకర్షణ. 33 మీటర్ల పొడవైన ఈ డైనింగ్ హాల్లోనే నిజాం తన బంధువులు, విదేశీ అతిథులకు ఆతిథ్యమిచ్చేవారు. మార్బుల్ మెట్లు.. ప్యాలెస్లో కేవలం నాలుగు ఫిల్లర్లపై ఉన్న స్టేర్ కేస్ ప్యాలెస్ అందాన్ని ఇనుమడింప చేస్తోంది. ఇటలీ మార్బుల్తో ఏర్పాటు చేసిన ఈ స్టేర్ కేస్ పైనున్న దర్బార్ హాల్ టీ సెక్షన్కు వెళ్తుంది. మహల్లో లైబ్రరీ.. నిజాం వివిధ దేశాల నుంచి సేకరించిన 900 గ్రంథాలతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో పార్సీ, అరబిక్, ఉర్దూలలో లిఖించిన పుస్తకాలున్నాయి. ఇందులో 1911 నుండి 1951 వరకు ప్యాలెస్ను సందర్శించిన వారి వివరాలతో కూడిన విజిటర్ బుక్ సైతం ఉంది. -
అర్పితా టేస్ట్...
సల్మాన్ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన తన బాయ్ఫ్రెండ్ ఆయుష్ శర్మను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ పెళ్లి హైదరాబాద్లో జరగనుండటం విశేషం. హైదరాబాద్లోని చారిత్రక కట్టడం ఫలక్నుమా ప్యాలెస్ను అర్పితా తన పెళ్లి వేదికగా ఎంపిక చేసుకుంది. ఆమె కోరిక మేరకు సల్మాన్ కుటుంబ సభ్యులు ఫలక్నుమా హోటల్ యాజమాన్యంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement